సమీకృత మార్కెట్లతో సమస్యలకు చెల్లు
ఇరుకిరుకు మార్కెట్లు.. అధ్వాన పారిశుద్ధ్య పరిస్థితులు.. ఒక్కో ఆహారం కోసం ఒక్కో చోటకు వెళ్లాల్సి రావడం వంటి సమస్యలకు ఇక తెరపడనుంది.
రాష్ట్రంలో వేగంగా నిర్మాణం
ఏడాదిలోగా అన్ని పురపాలక సంఘాల్లో సిద్ధం
కొన్నిచోట్ల శివార్లలో ఏర్పాటుతో వ్యాపారుల అనాసక్తి
ఈనాడు, హైదరాబాద్: ఇరుకిరుకు మార్కెట్లు.. అధ్వాన పారిశుద్ధ్య పరిస్థితులు.. ఒక్కో ఆహారం కోసం ఒక్కో చోటకు వెళ్లాల్సి రావడం వంటి సమస్యలకు ఇక తెరపడనుంది. రహదారులపైనే కూరగాయలు, చేపలు, మాంసం విక్రయాలకు కాలం చెల్లనుంది. రాష్ట్రంలోని ప్రతి పురపాలిక పరిధిలో వేగంగా సాగుతున్న సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణాలు ఈ సమస్యలను తీర్చనున్నాయి. రాష్ట్రంలోని 144 ప్రాంతాల్లో వీటి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించగా.. ఇప్పటికి 14 ప్రాంతాల్లో మార్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. గజ్వేల్, సిద్దిపేట, ఖమ్మం ఇలా పలు మార్కెట్లు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఊరికి కాస్తంత దూరంలో నిర్మించడంతో ప్రస్తుతానికి కొంత అనాసక్తత నెలకొంది. భవిష్యత్తు అవసరాలతోపాటు స్థలలభ్యతను బట్టి మార్కెట్లను నిర్మిస్తున్నట్లు మున్సిపల్ వ్యవహారాల ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు.
కొన్ని ఊరికి దూరం..
నూతనంగా నిర్మించిన కొన్ని మార్కెట్లలో సౌకర్యాలున్నా.. అవి ఊరికి దూరంగా ఉండటంతో వ్యాపారులు ముందుకు రావటంలేదు. ఇప్పటికీ నగర పరిధిలో మార్కెట్లు అందుబాటులో ఉండటంతో నూతన మార్కెట్లు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావటం లేదు. తూప్రాన్లో 54 దుకాణాలు ఏర్పాటు చేసినా 15 దుకాణాల్లోనే వ్యాపార కార్యకలాపాలు సాగుతున్నాయి. అది కూడా పరిమిత సమయంలోనే. నారాయణపేటలో 112 దుకాణాలతో మార్కెట్ ప్రారంభిస్తే వేళ్లమీద లెక్కించదగిన దుకాణాలకు మాత్రమే వ్యాపారులు ముందుకు వచ్చారు. మాంసాహారం కోసం 41 దుకాణాలు నిర్మించారు. ఆదివారాల్లో వీటిలో 25-30 దుకాణాలు నడుస్తున్నాయి. మిగిలిన రోజుల్లో పది కూడా తెరుచుకోవు. మధిరలో పరిమిత సమయాల్లోనే వ్యాపారాలు సాగుతున్నాయి. ఇక్కడ ఇప్పటివరకు మాంసాహారం విక్రయానికి దుకాణాలు కేటాయించలేదు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది.
నిర్మాణంలో 94..
94 మార్కెట్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే 14 అందుబాటులోకి వచ్చాయి. ధర్మపురి (జగిత్యాల జిల్లా), మంథని (పెద్దపల్లి), లీజ (జోగులాంబ), ఖమ్మం, మధిర (ఖమ్మం), తొర్రూరు (మహబూబాబాద్), తూప్రాన్ (మెదక్), నారాయణపేట (నారాయణపేట), రాజన్న సిరిసిల్ల (రాజన్న సిరిసిల్ల), జహీరాబాద్ (సంగారెడ్డి), గజ్వేల్, సిద్దిపేట (సిద్దిపేట), సూర్యాపేట (సూర్యాపేట), భువనగిరి (యాదాద్రి జిల్లా)లలో మార్కెట్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మరో 29 ప్రాంతాల్లో ఇటీవలే స్థల వ్యవహారాలు కొలిక్కి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 12 ప్రాంతాల్లో కసరత్తు చేపట్టాల్సి ఉంది. తుర్కయంజాల్, నేరేడుచర్ల, పోచంపల్లి, కొంపల్లిలలో ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాల్సి ఉంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కరీంనగర్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అదనంగా ఒక్కొక్కటి చొప్పున నిర్మించేందుకు స్థలాల ఎంపిక చేయాల్సి ఉంది. రానున్న ఆరు నుంచి తొమ్మిది నెలల్లో 70 నుంచి 75 శాతం నిర్మాణాలు పూర్తవుతాయని అంచనా. ఏడాది వ్యవధిలో అన్నింటినీ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇటు గజ్వేల్.. అటు సిద్దిపేట..
నిజాం కాలం నాటి మోండా మార్కెట్ ఆదర్శంగా సమీకృత మార్కెట్లకు ప్రభుత్వం బీజం వేసింది. గజ్వేల్, సిద్దిపేట మార్కెట్లు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. అదే విధంగా ఇతర పట్టణాల్లోనూ మార్కెట్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమత్రి కేసీఆర్ నిర్ణయించారు. గజ్వేల్ మార్కెట్లు ప్రజలకు చేరువ కావటంతో వ్యాపార లావాదేవీలు గణనీయంగా జరుగుతున్నాయి. ఇక్కడ 240 స్టాళ్లతో ఏర్పాటు చేసిన మార్కెట్లో నిత్యం పది క్వింటాళ్ల కూరగాయాలు, నాలుగు క్వింటాళ్ల మాంసం, మూడు క్వింటాళ్ల పూలు, రెండు క్వింటాళ్ల వరకు పండ్లు విక్రయమవుతుండటం విశేషం. ఐఎస్వో సర్టిఫికెట్ పొందిన మార్కెట్లలో గజ్వేల్ మొదటిదైతే సిద్దిపేట రెండోదిగా నిలిచింది. సిద్దిపేట మార్కెట్లోని 217 దుకాణాల్లో వ్యాపారాలు సాగుతుండటం విశేషం. సాధారణ రోజుల్లో సగటున మూడు వేలమంది, ఆదివారాల్లో అయిదారువేల మంది ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో