గోరంట్ల బుచ్చిబాబు క్రియాశీల కుట్రదారు
దిల్లీ మద్యం విధానంలో సౌత్ గ్రూప్నకు ఆడిటర్గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబు క్రియాశీల కుట్రదారు అని సీబీఐ ఆరోపించింది.
మద్యం విధాన రూపకల్పనకు తరచూ దిల్లీ ప్రయాణాలు
ముత్తా గౌతమ్ ఖాతా ద్వారా అభిషేక్ నుంచి రూ.55 లక్షల స్వీకరణ
రెండు ఫోన్లు ధ్వంసం చేసిన మనీశ్ సిసోదియా
సీబీఐ అదనపు ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం
సిసోదియా, బుచ్చిబాబు, దల్, అర్జున్పాండేలకు నోటీసులు
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం విధానంలో సౌత్ గ్రూప్నకు ఆడిటర్గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చిబాబు క్రియాశీల కుట్రదారు అని సీబీఐ ఆరోపించింది. ఈ కేసుపై 5,700 పేజీలతో అదనపు ఛార్జిషీట్ను సీబీఐ ఏప్రిల్ 25న దిల్లీ రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసింది. దీనికి సంక్షిప్తరూపంగా 54 పేజీల నివేదికను శనివారం న్యాయస్థానానికి సమర్పించింది. అదనపు ఛార్జిషీట్ను ప్రత్యేక న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. నిందితులు మనీశ్ సిసోదియా, గోరంట్ల బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమన్దీప్దల్ తదితరులకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు విచారణకు నిందితులంతా హాజరుకావాలని ఆదేశించింది.
బుచ్చిబాబుదే ప్రధాన పాత్ర
ఈ కేసులో బుచ్చిబాబు పాత్రను అదనపు ఛార్జిషీట్లో సీబీఐ వెల్లడించింది. ‘మద్యం విధాన రూపకల్పనలో సహ నిందితులైన అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై, ముత్తా గౌతమ్లతో కలిసి గోరంట్ల బుచ్చిబాబు క్రియాశీల కుట్రదారు. మద్యం విధానంపై మంత్రుల బృందం నివేదిక తయారు చేసే సమయంలో, ఈ విధానంతో అనుచిత లబ్ధి పొందడంలో బుచ్చిబాబు చురుకైన పాత్ర పోషించారు. ఇందుకోసం రెండుమూడు సార్లు దిల్లీ ప్రయాణించాల్సి ఉందని బుచ్చిబాబు 2021, మార్చి 6న వాట్సప్ చాట్ చేశారు. ఇందుకు తగ్గట్లే 2021, మార్చి 6 నుంచి 9 వరకు విజయ్ నాయర్ హైదరాబాద్కు ప్రయాణాలు చేశారు. అనంతరం బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై, శరత్ చంద్రారెడ్డి దిల్లీ ఒబెరాయ్ హోటల్లో మార్చి 14 నుంచి 17 వరకు మకాం వేశారు. ఆ తర్వాత నుంచి బుచ్చిబాబు తరచూ దిల్లీ ప్రయాణాలు చేశారు. సౌత్ గ్రూప్ సూచించిన పలు నిబంధనలు మంత్రుల బృందం తమ నివేదికలో పొందుపర్చినట్లు బుచ్చిబాబు వాట్సప్ ఛాట్ నుంచి సేకరించాం’ అని సీబీఐ పేర్కొంది.
నిధుల స్వీకరణ....
‘2021 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో బుచ్చిబాబు.. బోయినపల్లి అభిషేక్ నుంచి ఇండియా ఎహెడ్ డైరెక్టర్ ముత్తా గౌతమ్ ఖాతా ద్వారా రూ.55 లక్షలు స్వీకరించారు. గౌతమ్ ఖాతా నుంచి రూ.15 లక్షలు బుచ్చిబాబు ఖాతాకు జమయ్యాయి. 2021, సెప్టెంబరు 27న అభిషేక్ ఖాతా నుంచి గౌతమ్ ఖాతాకు రూ.1.30 కోట్లు బదిలీ అయ్యాయి. అదే రోజు బుచ్చిబాబు ఖాతాకు గౌతమ్ రూ.40 లక్షలు బదిలీ చేశారు. ఇండియా ఎహెడ్ ప్రెసిడెంట్గా అర్జున్ పాండే ఉన్న సమయంలో ఇండోస్పిరిట్కు రూ.70 లక్షలు బదిలీ చేశారు. అనంతరం ఇండో స్పిరిట్ నుంచి రూ. కోటి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్ ఖాతాకు బదిలీ అయ్యాయి.
* దిల్లీ మద్యం విధానం రూపకల్పనకు ప్రధాన సూత్రధారి మనీశ్ సిసోదియా. 2022 జులై 22కు ముందు వాడిన రెండు మొబైల్ ఫోన్లను ఆయన ధ్వంసం చేశారు. ప్రైవేటు హోల్సేల్ వ్యాపారులకు మార్జిన్ను 5 నుంచి 12 శాతానికి పెంచారు. కొవిడ్ తీవ్రంగా విజృంభించిన సమయంలో హడావిడిగా మద్యం విధాన్ని రూపొందించారు’ అని సీబీఐ ఛార్జిషీట్లో వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు