పదేళ్లలో విద్యుత్ డిమాండ్ రెట్టింపు
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పదేళ్లలో రెట్టింపు కానుంది. ప్రస్తుత ఏడాది(2023-24) రాష్ట్ర విద్యుత్ వినియోగం 70 వేల మిలియన్ యూనిట్లు(ఎంయూ) ఉంటుందని అంచనా.
సరఫరాకు రూ.37,911 కోట్లు అవసరం
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది
ఈఆర్సీకి డిస్కంల నివేదికలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పదేళ్లలో రెట్టింపు కానుంది. ప్రస్తుత ఏడాది(2023-24) రాష్ట్ర విద్యుత్ వినియోగం 70 వేల మిలియన్ యూనిట్లు(ఎంయూ) ఉంటుందని అంచనా. ప్రస్తుతం కొరత లేదు. అవసరమైనంత కరెంటు సరఫరాకు ఒప్పందాలున్నాయి. కానీ, 2033-34లో రాష్ట్ర అవసరాలకు లక్షా 40 వేల ఎంయూలకు పైగా కరెంటు అవసరమని, అందులో 25,981 ఎంయూల కొరత ఉంటుందని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తాజాగా అంచనా వేశాయి. ప్రతి అయిదేళ్ల కాలానికి ‘కంట్రోల్ పీరియడ్’ పేరుతో భవిష్యత్తు అవసరాలకు అంచనాలు వేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్ల(2024-29) తొలి కంట్రోల్ పీరియడ్, ఆ తరవాత మలి కంట్రోల్ పీరియడ్(2029-34)కి విద్యుత్ డిమాండ్, కొరత, ఎంత అదనంగా కొనాల్సి ఉంటుందనే దక్షిణ, ఉత్తర తెలంగాణ డిస్కంలు అంచనాలను తయారు చేసి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి తాజాగా నివేదికలు అందజేశాయి. విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల ఆధునికీకరణకు రాబోయే పదేళ్లలో అదనంగా రూ.37,911 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపాయి. కొత్తగా నిర్మించే విద్యుదుత్పత్తి కేంద్రాలతో ‘విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు’(పీపీఏ) చేసుకోవాల్సి ఉంటుందనీ వివరించాయి.
పెరగనున్న కరెంటు కొరత నేపథ్యంలో పీపీఏలు చేసుకోవడానికి, అవసరమైన కరెంటు కొనడానికి అనుమతించాలని ఈఆర్సీని కోరాయి. ఈ నివేదికలను మండలి తాజాగా విడుదల చేసింది. డిస్కంలు వేసిన అంచనాలు, కరెంటు కొనుగోలు లెక్కలపై ప్రజలు అభ్యంతరాలు, సూచనలు జూన్ 4లోగా తెలియజేయాలని ఈఆర్సీ కోరింది. ఆ తరవాత విచారణ జరిపి వాటిపై తుది ఆదేశాలు ఇవ్వనుంది.
నివేదికల్లోని ముఖ్యాంశాలు..
* ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణంలో ఉంది. దీని స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 4 వేల మెగావాట్లు. ఇది పూర్తయితే వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) నుంచి 52,970 ఎంయూల కరెంటు రాష్ట్రానికి సొంతంగా సరఫరా చేయనుంది. ఈ సంస్థ థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి సరఫరా సామర్థ్యం 2028-29 నాటికి 58,940 ఎంయూలకు పెరగనుంది. జలవిద్యుత్ కేంద్రాల నుంచి మాత్రం 3,443 ఎంయూలే వస్తుందని అంచనా.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్ కేంద్రాలన్నీ కలిపి 2033-34లో లక్షా 14 వేల ఎంయూలు సరఫరా చేయగలవు. కానీ, అప్పటికి రాష్ట్ర అవసరాలకు లక్షా 40 వేల ఎంయూలు అవసరమని, అంతమేర కొనుగోలుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి.
* మొదటి కంట్రోల్ పీరియడ్(2024-29)లో రాష్ట్ర అవసరాలకు మించి మిగులు విద్యుత్ అందుబాటులో ఉంటుందని, రెండో కంట్రోల్ పీరియడ్(2029-34)లో మాత్రం ఏటా కరెంటు కొరత పెరుగుతుందని అంచనా. ఈ కొరతను అధిగమించడానికి బహిరంగ మార్కెట్లో ఎప్పటికప్పుడు కరెంటు కొనాల్సి ఉంటుంది.
డిమాండ్ ఎందుకు పెరుగుతుందంటే..
రాష్ట్రంలో ఐటీ సహా పలు పరిశ్రమలు పెద్దఎత్తున రానున్నాయి. పాలమూరు-రంగారెడ్డి, సీతారామసాగర్ వంటి ఎత్తిపోతల పథకాలతో పాటు వ్యవసాయ కరెంటు వినియోగం కూడా అధికంగా ఉంటుంది. దీనికితోడు విద్యుత్ వాహనాలు, రైల్వే నెట్వర్క్కు సైతం అదనంగా కరెంటు అవసరం.
2030 నాటికి 22 వేల మెగావాట్లకు పైగా గరిష్ఠ డిమాండ్
రాష్ట్ర విద్యుత్ డిమాండ్ శరవేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం రోజూవారీ గరిష్ఠ డిమాండ్ 15,500 మెగావాట్లుంది. ఇది 2030 నాటికి 22 వేల మెగావాట్లు దాటుతుందని అంచనా వేశాం. థర్మల్ విద్యుత్ కేంద్రాలను కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేకున్నా కేంద్ర సంస్థల నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కొనుగోలుకే కాకుండా పంపిణీ, సరఫరా వ్యవస్థలో భాగంగా కొత్త సబ్స్టేషన్లు, లైన్ల నిర్మాణం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు నిధులు సమకూర్చుకోవాలి. 24 గంటలూ నిరంతర నాణ్యత సరఫరా చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం.
దేవులపల్లి ప్రభాకరరావు, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష వాయిదా
పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్లైన్లో నిర్వహించాల్సిన కంప్యూట్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను వాయిదా వేసినట్లు జెన్కో సీఎండీ తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
పర్యాటకులను వేధించొద్దు
తనిఖీల సందర్భంగా పర్యాటకులను వేధించొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా లేఖ రాసింది. -
న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలేదు
జ్యుడిషియల్ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. -
హనుమకొండలో కేటీఆర్పై కేసు నమోదు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు తదితరులు హనుమకొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్