డిజిటల్ హైవేకు ఏడాది ఆగాల్సిందే..!
తెలంగాణ సహా మూడు రాష్ట్రాలతో అనుసంధానమైన కీలక రహదారి విస్తరణకు ఎదురుచూపులు తప్పడం లేదు.
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి విస్తరణ
వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు చేపట్టాలని కేంద్రం నిర్ణయం
అంచనా వ్యయం రూ. 4,750 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ సహా మూడు రాష్ట్రాలతో అనుసంధానమైన కీలక రహదారి విస్తరణకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈమేరకు హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిని ‘డిజిటల్ హైవే’గా విస్తరించే పనులను వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25)లో చేపట్టాలని కేంద్రం తాజాగా నిర్ణయించింది. ఈ పనులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే చేపట్టే అవకాశం ఉందని భావించిన నేపథ్యంలో.. ఇక ఏడాది వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. దశలవారీగా దేశవ్యాప్తంగా 10 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్ఎస్) మౌలిక సదుపాయాలతో ‘సూపర్ ఇన్ఫర్మేషన్ (డిజిటల్) హైవే’లుగా విస్తరించాలని గతంలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఆ జాబితాలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారినీ చేర్చింది. తరచుగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 4 వరుసలను 6కు విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే విస్తరణకు అవసరమైన భూసేకరణను గతంలోనే చేయడంతో పనులు త్వరితగతిన చేపట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
* హైదరాబాద్ నుంచి బెంగళూరు దూరం 576 కి.మీ.లు. ఇందులో తెలంగాణ పరిధిలో 190 కి.మీ.లు ఉండగా మిగతా రహదారి ఏపీ, కర్ణాటకల్లో ఉంది. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు డిజిటల్ హైవేగా విస్తరణకు రూ.4,750 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ మార్గాన్ని విస్తరించేందుకు గత మూడు, నాలుగేళ్లుగా ప్రతిపాదనలు సాగుతున్నాయి. తొలుత అధికారులు సాధారణ జాతీయ రహదారి విస్తరణగానే ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. కేంద్రం డిజిటల్ హైవేగా మార్చాలని నిర్ణయించడంతో మరోదఫా కసరత్తు చేపట్టారు. విస్తరణలో భాగంగా 6 వరుసల రహదారితోపాటు 7 మీటర్ల మేర సర్వీసు రోడ్లను సైతం నిర్మిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు 8-10 గంటలు పడుతుండగా.. విస్తరణ అనంతరం ఆ వ్యవధిని కనీసం 2 గంటలు తగ్గించేందుకు అవకాశం ఉంటుందని అంచనా. ఈమేరకు సవివర నివేదిక (డీపీఆర్)ను రూపొందించే బాధ్యతను గత ఏడాది కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించారు. ఇప్పటికే తుది నివేదిక సిద్ధం అయింది. డిజిటల్ హైవేగా మారుస్తున్న నేపథ్యంలో సర్వీసు రోడ్డు, కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు ఉన్న పరిస్థితులను అధికారులు పరిశీలించారు. తుది డీపీఆర్ను ఇటీవల కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపినట్లు సమాచారం.
* ఈ మార్గాన్ని ఓఎఫ్ఎస్తో అనుసంధానించడంతో పాటు, ఇంటిగ్రేటెడ్ యుటిలిటీ కారిడార్లను అభివృద్ధి చేయాలన్నది ప్రణాళికలో భాగం. ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో ప్లగ్ అండ్ ప్లే లేదా ఫైబర్ ఆన్ డిమాôడ్ విధానంలో ఇంటర్నెట్ సేవలు అందించాలని నిర్ణయించారు. కేబుల్ వ్యవస్థతోపాటు రహదారి విస్తరణ పనులను జాతీయ రహదారుల సంస్థ చేపడుతుంది. 5జీ, 6జీ వంటి నవతరం టెలికం సాంకేతికత వ్యవహారాలను టెలి కమ్యూనికేషన్స్ శాఖతోపాటు టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) పర్యవేక్షిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు