తెలంగాణ వర్సిటీలో రచ్చ.. రచ్చ
తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ నియామకంపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రభుత్వానికీ తలనొప్పి వ్యవహారంగా మారింది.
వీసీ నియమించిన రిజిస్ట్రార్ను అంగీకరించని ఈసీ
ఈసీ నియమించిన రిజిస్ట్రార్ను ఒప్పుకోని వీసీ
రెండేళ్లలో తొమ్మిదిసార్లు మార్పు.. నెల రోజుల్లోనే ముగ్గురు..
తాజాగా కుర్చీ కోసం యాదగిరి, కనకయ్యల వాగ్వాదం
ఈనాడు-హైదరాబాద్, నిజామాబాద్, తెవివి-న్యూస్టుడే: తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ నియామకంపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రభుత్వానికీ తలనొప్పి వ్యవహారంగా మారింది. ఉపకులపతి(వీసీ) నియమించిన రిజిస్ట్రార్ను పాలకమండలి(ఈసీ) ఒప్పుకోకపోవడం.. ఈసీ నియమించిన రిజిస్ట్రార్ను వీసీ అంగీకరించకపోవడం.. ఇలా రెండేళ్లుగా ఇదే తంతుగా సాగుతోంది. వర్సిటీలో రెండేళ్లలో ఏకంగా తొమ్మిదిసార్లు రిజిస్ట్రార్లు మారారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఎప్పుడు, ఎవరు నియమితులవుతారో.. ఎప్పుడు పదవి నుంచి వైదొలుగుతారో తెలియని పరిస్థితి నెలకొంది. వర్సిటీ ఉపకులపతి(వీసీ)గా ఓయూ ఆచార్యుడు రవీందర్ గుప్తా 2021 మే నెలలో నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలల్లోనే రిజిస్ట్రార్గా ఉన్న ఆచార్య నసీమ్ను తొలగించి ఆ స్థానంలో కనకయ్యను నియమించారు. ఆ తర్వాత నుంచి ఈసీ సభ్యులు, వీసీ మధ్య విభేదాల కారణంగా తరచూ రిజిస్ట్రార్లను మారుస్తూ వచ్చారు. గత నెల రోజుల్లోనే నిర్మలాదేవి, ఆ తర్వాత యాదగిరి, అనంతరం కనకయ్య.. అంటే ముగ్గురు మారారు. తాజాగా మరోసారి ‘రిజిస్ట్రార్ను నేనంటే.. నేను..’ అంటూ ఇద్దరు ఆచార్యులు యాదగిరి, కనకయ్యలు.. ఆ కుర్చీలో కూర్చోవడానికి వచ్చి వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది. వారికి విద్యార్థి, కుల సంఘాలు వేర్వేరుగా మద్దతు పలకడం.. వారు సైతం రిజిస్ట్రార్ ఛాంబర్లోకి రావడంతో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2.30 గంటల వరకు వాగ్వాదాలు, అరుపులతో వర్సిటీ దద్దరిల్లింది. విశ్వవిద్యాలయం పరువు మరోసారి బజారున పడింది.
ఆర్డర్ కాపీ చూపించాలన్న కనకయ్య
వర్సిటీ రిజిస్ట్రార్గా యాదగిరిని పాలకమండలి(ఈసీ) నియమించగా.. కనకయ్యను ఉపకులపతి నియమించిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 11 గంటలకు ఆచార్య యాదగిరి రిజిస్ట్రార్ ఛాంబర్కు వచ్చి కుర్చీలో కూర్చున్నారు. గంట తర్వాత కొందరు ఉద్యోగులు, విద్యార్థి సంఘ నాయకులతో కలిసి ఆచార్య కనకయ్య ఛాంబర్లోకి వచ్చారు. ‘రిజిస్ట్రార్గా మీరు నియమితులైనట్లు ఆర్డర్ కాపీ ఉందా’ అంటూ యాదగిరిని ఆయన అడిగారు. తనను పాలకమండలి నియమించిందని, రిజిస్ట్రార్ను నియమించే అధికారం ఈసీకే ఉంటుందని.. ప్రత్యేకంగా ఆర్డరు కాపీ అవసరం లేదని యాదగిరి సమాధానమిచ్చారు. దీంతో సంతృప్తి చెందని కనకయ్య.. తనను నియమిస్తూ ఉపకులపతి ఇచ్చిన ఉత్తర్వు కాపీని చూపారు. ఆర్డర్ కాపీ లేనందున కుర్చీలో కూర్చోవడం సరికాదంటూ యాదగిరితో అన్నారు.
రిజిస్ట్రార్ కార్యాలయానికి తాళం
వాదోపవాదాల అనంతరం ఇరుపక్షాలు ఓ ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేవరకు రిజిస్ట్రార్, వీసీ కార్యాలయాలకు తాళం వేసి వర్సిటీ పాలనను స్తంభింపజేయాలని విద్యార్థి సంఘాల నాయకులు సూచించారు. దీనికి అంగీకరించిన ఇరువర్గాలవారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రిజిస్ట్రార్ కార్యాలయానికి వర్సిటీ సిబ్బందే తాళం వేశారు. అయితే సోమవారం వీసీ రాకపోవటంతో ఆయన ఛాంబర్ తాళం తెరవలేదు.
ప్రభుత్వ హెచ్చరికలూ బేఖాతరు..
విశ్వవిద్యాలయ పాలకమండలి ఆదేశాలను ఉపకులపతి పాటించాల్సిందేనని, రిజిస్ట్రార్ నియామక అధికారం ఈసీదేనని స్పష్టం చేస్తూ ప్రభుత్వం లేఖ రాసినా.. ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించినా.. రవీందర్ గుప్తా బేఖాతరు చేస్తున్నారు. రిజిస్ట్రార్ను నియమించే అధికారం వీసీగా తనకే ఉందని, పాలకమండలి కేవలం ర్యాటిఫై మాత్రమే చేస్తుందని వాదిస్తున్నారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్పై ఆయన బహిరంగంగా విమర్శలు చేయడం కలకలం సృష్టించింది. మరోవైపు, ఉపకులపతి రవీందర్ గుప్తా పొరుగు సేవల కింద ఇష్టారాజ్యంగా వందల మంది సిబ్బందిని నియమించారని, పలు వస్తువుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని గతంలో ఆరోపణలు వచ్చాయి. దానిపై ప్రభుత్వం ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిరుడు జూన్లో ఓ కమిటీని నియమించింది. విచారణ జరిపిన కమిటీ నివేదిక ఇచ్చింది.
నా విధులకు ఆటంకం కలిగింది: ఆచార్య యాదగిరి
ప్రభుత్వ ఆదేశాలతో పాలకమండలి(ఈసీ) నన్ను నియమించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యతలు చేపట్టి.. సోమవారం రిజిస్ట్రార్ కుర్చీలో కూర్చున్నాను. ఆచార్య కనకయ్య కొందరితో కలిసి వచ్చి.. వాదనకు దిగారు. దీంతో నా విధులకు ఆటంకం కలిగింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను.
దళితుడికి అవమానం: ఆచార్య కనకయ్య
నన్ను రిజిస్ట్రార్గా వీసీ నియమించారు. రెండు రోజులు ఆ హోదాలో కొనసాగాను. మూడు నెలల కాలం ఇన్ఛార్జిగా ఉంటాను. పాలకమండలి ఆమోదించకుంటే బాధ్యతల నుంచి తప్పుకొంటాను. ఈరోజు యాదగిరి వచ్చి ఆ కుర్చీలో కూర్చున్నారు. ఇది దళితుడినైన నన్ను అవమానించటమే అవుతుంది. నాకు వీసీ ఇచ్చిన ఆర్డర్ కాపీ ఉండగా ఆయన కూర్చోవడం సరికాదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వలకు చిక్కిన 30 కిలోల చేప