సిట్ నివేదిక వచ్చాకే ఫలితాలు!
రాతపరీక్షలు పూర్తయిన మూడు ఉద్యోగ నోటిఫికేషన్ల తదుపరి ప్రక్రియలు.. ప్రశ్నపత్రాల లీకేజీపై దర్యాప్తు తుది నివేదిక వచ్చేవరకు నిలిచిపోనున్నాయి.
ఎంపికలు ప్రారంభిస్తే న్యాయ ఇబ్బందులు?
పూర్తయిన 3 రాత పరీక్షల తదుపరి ప్రక్రియపై టీఎస్పీఎస్సీ యోచన
పరీక్ష రాసిన అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు
ఈనాడు, హైదరాబాద్: రాతపరీక్షలు పూర్తయిన మూడు ఉద్యోగ నోటిఫికేషన్ల తదుపరి ప్రక్రియలు.. ప్రశ్నపత్రాల లీకేజీపై దర్యాప్తు తుది నివేదిక వచ్చేవరకు నిలిచిపోనున్నాయి. సిట్ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ఫలితాలు వెల్లడించి, తుది ఎంపికలు చేపట్టడం న్యాయసూత్రాలకు విరుద్ధమని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. సాంకేతిక, న్యాయ ఇబ్బందులూ తలెత్తవచ్చని అంచనావేస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తివివరాలు వెల్లడయ్యేవరకు వేచిచూడాలని భావిస్తోంది. నిందితులు ఏయే ప్రశ్నపత్రాలు లీక్ చేశారు? ఎంతమంది కొనుగోలు చేశారనే విషయాలపై సిట్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయా పరీక్షల ఫలితాల కోసం వేల మంది అభ్యర్థులు ఎదురుచూడాల్సి వస్తోంది.
* ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో 24 పోస్టులకు గత ఏడాది జులైలో టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. 16,381 మంది దరఖాస్తు చేయగా.. వారికి గత నవంబరులో రాతపరీక్ష నిర్వహించి, డిసెంబరులో మెరిట్ జాబితా ప్రకటించారు. ఈ పోస్టులకు 1:2 నిష్పత్తిలో తుదిఎంపిక జాబితా ప్రకటిస్తామని కమిషన్ వెల్లడించింది. తర్వాత గ్రూప్-1 పోస్టుల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పోలీసు శాఖలోనూ ఇదే విధానం అమలవుతున్నందున అన్ని నియామకాల్లోనూ ఈ పద్ధతి అవలంబించాలని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో ఐపీఎం పోస్టుల ఫలితాలు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఈ పోస్టులకు తుది జాబితా ప్రకటన మరింత ఆలస్యమవుతోంది.
* మహిళా శిశు సంక్షేమశాఖలో సీడీపీవో, శిశుసంక్షేమాధికారులు, విస్తరణ అధికారుల (గ్రేడ్-1) పోస్టుల భర్తీకి గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో కమిషన్ రెండు ఉద్యోగ ప్రకటనలు జారీచేసింది. ఈ పోస్టులకు ఈ ఏడాది జనవరిలో రాత పరీక్షలు జరిగాయి. ఈ విభాగంలో 23 సీడీపీవో, శిశుసంక్షేమాధికారుల పోస్టులకు 19,184 మంది, 181 గ్రేడ్-1 విస్తరణ అధికారుల (సూపర్వైజర్) పోస్టులకు 26,752 మంది దరఖాస్తు చేశారు. ఈ పరీక్షలకు ప్రాథమిక కీ కూడా వెల్లడైంది. తుది కీ జారీ చేసి, మెరిట్ జాబితా ప్రకటించాల్సి ఉంది.
వీలైనంత త్వరగా సీబీఆర్టీ పరీక్షల ఫలితాలు!
ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం నిర్వహిస్తున్న పునఃపరీక్షలు, రీషెడ్యూలు అయిన పరీక్షలకు కమిషన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు(సీబీఆర్టీ) నిర్వహిస్తోంది. పరీక్షల్లో మరింత పారదర్శకతతో పాటు వేగంగా ఫలితాలు వెల్లడించేందుకు ప్రయత్నిస్తోంది. సిట్ దర్యాప్తుతో సంబంధం లేని రాత పరీక్షలకు సీబీఆర్టీ పరీక్షలు పూర్తయిన నెల నుంచి 45 రోజుల్లోగా మెరిట్ జాబితాలు ప్రకటించేలా చర్యలు తీసుకుంటోంది. అనంతరం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలిచి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించనుంది. ఈ పరిశీలన పూర్తయిన 15 రోజుల్లోగా తుది ఎంపిక జాబితాలు ప్రకటించాలని భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM