పోలీస్ శాఖలో వసూల్రాజా!
పోలీస్ శాఖలో ఆయనో కీలకాధికారి. ఎస్పీల కార్యకలాపాలను పర్యవేక్షించే ఉన్నత హోదాలో పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం పదోన్నతి పొందడంతో ఆ కీలక బాధ్యతల్లో చేరారు.
స్టేషన్ల నిర్వహణ నిధుల్లో వాటా
నాలుగు నెలల సొమ్ములో ఒక నెల ఇవ్వాలంటూ హకుం
కార్యాలయం మరమ్మతుల పేరిట ఠాణాల వారీగా వంతులు
ఈనాడు, హైదరాబాద్: పోలీస్ శాఖలో ఆయనో కీలకాధికారి. ఎస్పీల కార్యకలాపాలను పర్యవేక్షించే ఉన్నత హోదాలో పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం పదోన్నతి పొందడంతో ఆ కీలక బాధ్యతల్లో చేరారు. తాజా బాధ్యతల్లో చేరిన కొద్ది రోజుల నుంచి వసూళ్ల పర్వానికి తెరలేపిన ఆయన తీరు శాఖలో చర్చనీయాంశంగా మారింది. పోలీస్ స్టేషన్ల నిర్వహణ నిధుల్లో వాటా తీసుకోవడంతోపాటు తన కార్యాలయం మరమ్మతుల కోసమంటూ ఠాణాల వారీగా వంతులేసి మరీ వసూళ్లకు పాల్పడటం విస్తుగొలుపుతోంది. వాస్తవానికి ఠాణాల నిర్వహణకు గతంలో నామమాత్రంగా నిధులుండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత నగర ఠాణాలకు రూ.75 వేల చొప్పున.. జిల్లా కేంద్రాల్లోని వాటికి రూ.50 వేలు.. గ్రామీణ ప్రాంత ఠాణాలకు రూ.25 వేల చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. ఇటీవలే నాలుగు నెలలకు సంబంధించిన నిధులు విడుదలయ్యాయి. వాటిపై ఆ కీలకాధికారి కన్ను పడింది. నాలుగు నెలల సొమ్ములో నుంచి ఒక నెల తనకివ్వాలంటూ తన పరిధిలో 20కిపైగా ఠాణాలున్న ఓ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. ఇదే అదనుగా ఆ జిల్లా ఉన్నతాధికారులు ప్రతి ఠాణా నుంచి వసూళ్లకు తెరలేపారు. కేసులు ఎక్కువగా నమోదయ్యే పెద్ద ఠాణా నుంచి రూ.50 వేల చొప్పున, చిన్న ఠాణా నుంచి రూ.25 వేల చొప్పున వసూలు చేసి కొంత జేబులో వేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్ల నిర్వహణ నిధులు ప్రతినెలా సక్రమంగా రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎస్హెచ్వోలకు ఈ పరిణామం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. ఆ కీలకాధికారి తన హోదాను మరిచి మరీ ఎస్సైలను పిలిచి వివిధ కారణాలతో చివాట్లు పెడుతుండటం వెనక ఆంతర్యమేమిటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒక్కో ఠాణా వంతు రూ.13,638
ఠాణా నిర్వహణ నిధుల్లో నుంచి వసూళ్ల పర్వానికి ముందే కీలకాధికారి మరో ఘనకార్యానికి తెరలేపారు. కొత్తగా ఏర్పాటు చేసుకున్న తన కార్యాలయానికి మరమ్మతులు చేయాలని ఆయన భావించారు. వాస్తవానికి ప్రభుత్వ నిధులతో మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఠాణాలకు వంతులేసేశారు. తన కార్యాలయానికి సుమారు రూ.10.5 లక్షలు వ్యయమైందని చెబుతూ.. వాటిని అన్ని ఠాణాల స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్వో)లు చెల్లించాలని హుకుం జారీ చేశారు. సొమ్ము వసూలు చేసే బాధ్యతను ఓ డీఎస్పీకి అప్పగించారు. ఒక్కో ఠాణా నుంచి రూ.13,638 చొప్పున చెల్లించాలంటూ లెక్క తేల్చి అన్ని జిల్లాల ఠాణాలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. ఏ జిల్లాలో ఎన్ని ఠాణాలున్నాయి? మొత్తం కావాల్సిన సుమారు రూ.10.5 లక్షలు చెల్లించేందుకు ఒక్కో ఠాణా ఎస్హెచ్వో ఎంత చెల్లించాలి? అనే లెక్కలు సహా జిల్లాల్లోని కీలకాధికారులకు వాట్సప్లో వివరాలు షేర్ చేయడం గమనార్హం. ఓ జిల్లా ఎస్హెచ్వోలు దాదాపు రూ.3 లక్షలకుగాను రూ.2.5 లక్షల వరకు చెల్లించారు. అదే జిల్లా నుంచి తాజాగా ఠాణా నిర్వహణ నిధుల సొమ్ము నొక్కేయడం గమనార్హం. అప్పుడు తక్కువిచ్చారనే కారణంతో ఇప్పుడు ఇలా వసూలు చేసి ఉంటారని జిల్లా పోలీస్ యంత్రాంగంలో చర్చ జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?