అంతస్తులు పైపైకి.. పన్ను చెల్లింపులు గాలికి..
రాష్ట్రంలో రాజధానితో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆధ్వర్యంలో ఇళ్లు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.
నిర్మాణాల లెక్కల్లో నిలువెత్తు లొసుగులు!
రెరా, రిజిస్ట్రేషన్, మున్సిపల్ కార్యాలయాల వివరాలతో పోల్చి చూడాలి
రూ.300 కోట్ల జీఎస్టీ అదనంగా రాబట్టాలి
ప్రభుత్వానికి వాణిజ్య పన్నులశాఖ నివేదిక
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో రాజధానితో పాటు ఇతర నగరాలు, పట్టణాల్లో రియల్ ఎస్టేట్ సంస్థల ఆధ్వర్యంలో ఇళ్లు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అంతస్తులైతే పైపైకి లేస్తున్నా.. వాటి విక్రయంపై ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీ మాత్రం పూర్తిస్థాయిలో వసూలు కావడంలేదు. నిర్మాణాలు, విక్రయాల వివరాలపై సంబంధిత శాఖల సమన్వయంతో కూడిన నిఘా లేకపోవడమే దీనికి కారణం. ఈ విషయంపై దృష్టి సారించాలని వాణిజ్య పన్నులశాఖ తాజాగా నిర్ణయించింది. గత ఏడాది (2022-23)లో రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థల నుంచి రూ.970 కోట్ల జీఎస్టీ వసూలైంది. అంతకుముందు ఏడాది (2021-22)తో పోలిస్తే ఇది 20 శాతం అధికమని తేలింది. కానీ నిర్మాణ సంస్థల బోగస్ లెక్కల కారణంగా మరో రూ.300 కోట్ల దాకా జీఎస్టీ ఆదాయం చేజారుతున్నట్లు తాజా అంచనా. పకడ్బందీ తనిఖీ చర్యల ద్వారా ఆ మొత్తాన్ని కూడా రాబట్టాలని వాణిజ్య పన్నులశాఖ నిపుణుల బృందం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.
ఆదాయం పెరగాలంటే..
ప్రతి రియల్ ఎస్టేట్ సంస్థకు ‘జీఎస్టీ గుర్తింపు సంఖ్య’ (జీఎస్టీఐఎన్) ఉండాలి. బిల్డర్ లేదా రియల్ ఎస్టేట్ సంస్థ అపార్టుమెంటు లేదా ఇంటిని విక్రయించినప్పుడు ఆ సంస్థ జీఎస్టీ నంబరును రిజిస్ట్రేషన్ శాఖ నమోదు చేయాలి. భవన నిర్మాణానికి ముందు సంబంధిత సంస్థ ‘రెరా’ కార్యాలయంలో నమోదు చేయించుకోవాలి. ఆ సమయంలో బిల్డర్ ఇస్తున్న జీఎస్టీ నంబరును వాణిజ్య పన్నులశాఖ తీసుకోవాలి. నిర్మాణం పూర్తయిన తరువాత బిల్డర్ మున్సిపల్ కార్యాలయం నుంచి ‘ఆక్యుపెన్సీ సర్టిఫికెట్’ (ఓసీ) తీసుకుంటారు. ఆ సమయంలో మున్సిపల్ కార్యాలయంలో జీఎస్టీ నంబరు ఇవ్వాలి. ఇలా రిజిస్ట్రేషన్, రెరా, మున్సిపల్ కార్యాలయాల్లో రియల్ ఎస్టేట్ సంస్థ ఇచ్చే జీఎస్టీ నంబరు ఆధారంగా విక్రయ వివరాలను వాణిజ్య పన్నుల శాఖ పోల్చిచూస్తే జీఎస్టీ ఎంత కట్టారనేది పక్కాగా తేలుతుంది. కానీ ఇది జరగడం లేదు. మున్సిపల్ కార్యాలయం నుంచి బిల్డర్ ఓసీ తీసుకునే సమయానికి మిగిలిపోయిన ఫ్లాట్లు లేదా ఇళ్లను ఆ తరువాత అమ్ముకున్నా జీఎస్టీ చెల్లించడంలేదు. ఉదాహరణకు ఇటీవల హైదరాబాద్లో ఒక బిల్డర్ 70 ఫ్లాట్లతో పెద్ద అపార్టుమెంటు నిర్మించారు. అందులో భూమి యజమానికి వాటా కింద 35 ఫ్లాట్లు ఇచ్చారు. నిర్మాణం పూర్తయిన తరువాత బిల్డర్ మున్సిపల్ కార్యాలయం నుంచి ఓసీ తీసుకుని భూ యజమానికి 35 ఫ్లాట్లు అప్పగించి వెళ్లిపోయారు. ఆ తరువాత భూమి యజమాని తాపీగా ధరలు పెంచుతూ తన వాటా 35 ఫ్లాట్లను అమ్ముకుంటూ జీఎస్టీ కట్టలేదు. ఇలాంటివి తనిఖీలు చేస్తే తప్ప బయటపడవు.
తనిఖీలే లేవు
2017 నుంచి ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ విక్రయాల్లో జీఎస్టీ వసూళ్లపై వాణిజ్య పన్నులశాఖ తనిఖీలు చేయలేదు. మున్సిపల్, సబ్ రిజిస్ట్రార్, రెరా కార్యాలయాల్లో నమోదయ్యే వివరాలను సేకరించడంలేదు. కొందరు బిల్డర్లు రెరా అనుమతులే తీసుకోవడంలేదని.. ఇక వివరాలు ఎక్కడి నుంచి వస్తాయని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. ప్రతి దశలో బిల్డర్ ఇచ్చే జీఎస్టీ నంబరు సేకరించి వాణిజ్య పన్నుల శాఖ రిజిస్ట్రేషన్, రెరా, మున్సిపల్ కార్యాలయాల వివరాలను పోల్చి చూస్తే ఎంత పన్ను ఎగవేస్తున్నారో స్పష్టంగా తేలిపోతుందని ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ