అయ్యో.. అన్నదాత
మరోసారి అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాగం చేశాయి. సోమవారం అర్ధరాత్రి, మంగళవారం ఉదయం ఈదురుగాలులతో కురిసిన వానలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.
రైతన్నపై మళ్లీ వరుణుడి ప్రతాపం
పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
వివిధ ప్రాంతాల్లో అన్నదాతల రాస్తారోకోలు
ఈనాడు, హైదరాబాద్ - న్యూస్టుడే యంత్రాంగం: మరోసారి అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాగం చేశాయి. సోమవారం అర్ధరాత్రి, మంగళవారం ఉదయం ఈదురుగాలులతో కురిసిన వానలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఆ ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ అకాల వర్షాలతో అవస్థలు పడుతున్నామని.. కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అన్నదాతలు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోడ్డెక్కారు. లారీలు అందుబాటులో ఉండేలా చూడాలంటూ రాస్తారోకోలు చేశారు.
* పెద్దపల్లి జిల్లా ఓదెల ఐకేపీ కేంద్రంలో అమ్మకానికి పోసిన ధాన్యం వరద తాకిడికి కొట్టుకుపోయింది. కొమిరలో పలువురు రైతులు ఆరబోసుకున్న మొక్కజొన్న పంట నీటి పాలైంది. జగిత్యాల జిల్లా కోరుట్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో తూకం వేసిన సుమారు 2 వేల బస్తాల ధాన్యంతో పాటు తూకం వేయని ధాన్యం కుప్పలు తడిసినట్లు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
* ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలోని ధాన్యం, మక్కల రాశులు, కాంటాలు వేసిన బస్తాలు తడిసి ముద్దయ్యాయి. నర్సంపేట మార్కెట్లో మక్కలు వరదకు కొట్టుకుపోయాయి. నెక్కొండ మార్కెట్ యార్డులో వర్షపు నీరు నిలిచింది. జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పిడుగుపాట్లకు ఒక పాడిగేదె, మూడు కాడెద్దులు మృతి చెందాయి. పర్వతగిరి మండలం కొంకపాకలో విద్యుదాఘాతంతో రెండు పాడి గేదెలు చనిపోయాయి.
* మంచిర్యాల జిల్లా భీమారం, జైపూర్, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్, నెన్నెల, భీమిని మండలాలు, నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం, సోన్, కుంటాల, లక్ష్మణచాంద తదితర మండలాల్లో వర్షం పడింది. పలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాల పక్కన నీరు నిలిచింది.
రైతుల ఆగ్రహం..
* మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాబ్పేటలో రైతులు.. లారీల కొరత తీర్చాలంటూ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం బస్తాలను రోడ్డుపై పెట్టి ఆందోళన నిర్వహించారు. చేగుంట మండలం వడియారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేశారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడపలో రైతులు రోడ్డుఫై బైఠాయించారు.
* హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి రైతులు ఆందోళనకు దిగారు. కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని మిల్లులకు త్వరగా తరలించాలంటూ సంగెం, కమలాపూర్, చెన్నారావుపేట, నెక్కొండ తదితర ప్రాంతాల్లోని అన్నదాతలు రోడ్డెక్కి నిరసన తెలిపారు.
* యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిలో ఏర్పాటుచేసిన కేంద్రంలో నెల రోజుల నుంచి కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదు. వేగవంతం కాకపోవడంతో రైతులు భూదాన్పోచంపల్లి రహదారిపై బైఠాయించారు.
* నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో రైతులు ధర్నా చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM