అయ్యో.. అన్నదాత
మరోసారి అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాగం చేశాయి. సోమవారం అర్ధరాత్రి, మంగళవారం ఉదయం ఈదురుగాలులతో కురిసిన వానలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.
రైతన్నపై మళ్లీ వరుణుడి ప్రతాపం
పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
వివిధ ప్రాంతాల్లో అన్నదాతల రాస్తారోకోలు
ఈనాడు, హైదరాబాద్ - న్యూస్టుడే యంత్రాంగం: మరోసారి అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాగం చేశాయి. సోమవారం అర్ధరాత్రి, మంగళవారం ఉదయం ఈదురుగాలులతో కురిసిన వానలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఆ ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరచూ అకాల వర్షాలతో అవస్థలు పడుతున్నామని.. కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అన్నదాతలు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోడ్డెక్కారు. లారీలు అందుబాటులో ఉండేలా చూడాలంటూ రాస్తారోకోలు చేశారు.
* పెద్దపల్లి జిల్లా ఓదెల ఐకేపీ కేంద్రంలో అమ్మకానికి పోసిన ధాన్యం వరద తాకిడికి కొట్టుకుపోయింది. కొమిరలో పలువురు రైతులు ఆరబోసుకున్న మొక్కజొన్న పంట నీటి పాలైంది. జగిత్యాల జిల్లా కోరుట్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో తూకం వేసిన సుమారు 2 వేల బస్తాల ధాన్యంతో పాటు తూకం వేయని ధాన్యం కుప్పలు తడిసినట్లు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
* ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలోని ధాన్యం, మక్కల రాశులు, కాంటాలు వేసిన బస్తాలు తడిసి ముద్దయ్యాయి. నర్సంపేట మార్కెట్లో మక్కలు వరదకు కొట్టుకుపోయాయి. నెక్కొండ మార్కెట్ యార్డులో వర్షపు నీరు నిలిచింది. జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పిడుగుపాట్లకు ఒక పాడిగేదె, మూడు కాడెద్దులు మృతి చెందాయి. పర్వతగిరి మండలం కొంకపాకలో విద్యుదాఘాతంతో రెండు పాడి గేదెలు చనిపోయాయి.
* మంచిర్యాల జిల్లా భీమారం, జైపూర్, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్, నెన్నెల, భీమిని మండలాలు, నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం, సోన్, కుంటాల, లక్ష్మణచాంద తదితర మండలాల్లో వర్షం పడింది. పలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాల పక్కన నీరు నిలిచింది.
రైతుల ఆగ్రహం..
* మెదక్ జిల్లా శివ్వంపేట మండలం నవాబ్పేటలో రైతులు.. లారీల కొరత తీర్చాలంటూ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం బస్తాలను రోడ్డుపై పెట్టి ఆందోళన నిర్వహించారు. చేగుంట మండలం వడియారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రహదారిపై రాస్తారోకో చేశారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం మునిగడపలో రైతులు రోడ్డుఫై బైఠాయించారు.
* హనుమకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి రైతులు ఆందోళనకు దిగారు. కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని మిల్లులకు త్వరగా తరలించాలంటూ సంగెం, కమలాపూర్, చెన్నారావుపేట, నెక్కొండ తదితర ప్రాంతాల్లోని అన్నదాతలు రోడ్డెక్కి నిరసన తెలిపారు.
* యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిలో ఏర్పాటుచేసిన కేంద్రంలో నెల రోజుల నుంచి కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదు. వేగవంతం కాకపోవడంతో రైతులు భూదాన్పోచంపల్లి రహదారిపై బైఠాయించారు.
* నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో రైతులు ధర్నా చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
Bapatla: రహదారిపై యుద్ధవిమానాల ల్యాండింగ్
బాపట్ల జిల్లా మీదుగా వెళ్లే 16వ నంబరు జాతీయ రహదారిపై వైమానిక దళం విన్యాసాలు చేపట్టింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అత్యవసర సమయాల్లో రహదారిపైనే ఉన్న రన్వేపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేసే సామర్థ్యాన్ని మదింపు చేశారు. -
తెలంగాణ సొమ్ము దిల్లీకి
భారాస, కాంగ్రెస్ల బంధాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాళేశ్వరం కుంభకోణంలో కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియదు? మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలేదు. -
గవర్నర్ తమిళిసై రాజీనామా
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) పదవికి సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సోమవారం పంపించారు. -
దాతలూ స్పందించండి.. ఈ చిన్నారిని ఆదుకోండి
నిరుపేద తల్లిదండ్రులకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఏడాది వయస్సున్న కుమారుడి తలకు ఏర్పడిన భారీ కణితి ప్రాణాంతకంగా మారింది. తల్లిదండ్రులు అప్పులు చేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడుసార్లు శస్త్రచికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. -
ఆప్ నేతలకు రూ.100 కోట్ల చెల్లింపులో కవిత పాత్ర
దిల్లీ మద్యం విధానంలో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా భారాస ఎమ్మెల్సీ కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్పాల్, జస్టిస్ మౌసమీ భట్టాచార్య
-
రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్లేవారు.. పత్రాలను వెంట ఉంచుకోవాలి
-
సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్లు
రాష్ట్రంలో సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో సోమవారం వడగళ్లవాన పడింది. రాజన్న సిరిసిల్ల మండలంలో విద్యుత్ స్తంభం కూలిన ఘటనలో ఓ రైతు మరణించారు. -
రూ.లక్షలు పెట్టు.. ఫ్యాన్సీ నంబరు పట్టు!
రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసులు కురిపిస్తున్నాయి. రూ.లక్షలు పెట్టి అయినా.. వాటిని దక్కించుకునేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. -
కవిత పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
దిల్లీ మద్యం కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన సమన్లను సవాల్ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కె.కవిత గత ఏడాది మార్చి 15న దాఖలు చేసిన రిట్ పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. -
తల్లీ వందనం.. తపనకు అభినందనం
దివ్యాంగుడైన కుమారుడిని పదోతరగతి పరీక్ష రాయించడానికి తల్లి పడుతున్న తపన స్ఫూర్తిదాయకం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి(బి)కి చెందిన చరణ్కు పోలియోతో కాళ్లు చచ్చుబడగా, చేతుల కదలికలూ పరిమితంగానే ఉన్నాయి. -
యాదగిరీశుడి కల్యాణ వైభోగం
యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. గజ వాహనంపై నారసింహుడు, పల్లకినెక్కి అమ్మ లక్ష్మీదేవి.. మండపానికి చేరుకోగా, పూజారులు ఎదుర్కొని కల్యాణ తతంగాలను చేపట్టారు. -
బోరుతోనే ఊరికి పేరు.. 40 ఏళ్లుగా ఇంకని తీరు
ఆదిలాబాద్ గ్రామీణ మండలం తిప్ప పంచాయతీ పరిధిలోని బోరింగ్గూడ గ్రామంలో ఉన్న చేతిపంపు నుంచి నిరంతరం నీరు ఉబికివస్తోంది. గ్రామంలో 40 ఏళ్ల క్రితం బోరు వేసి.. ఈ చేతిపంపు ఏర్పాటు వేశారు. దీని కారణంగానే గ్రామానికి బోరింగ్గూడ అని పేరొచ్చిందని తిప్ప మాజీ సర్పంచి కిషన్ తెలిపారు. -
ఎల్లక్కపేట దసిలిపట్టు గుడ్డు.. దేశంలోనే వెరీగుడ్
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట సమీపంలోని దసిలిపట్టు గుడ్ల తయారీ కేంద్రం దేశంలోనే నంబర్వన్గా నిలిచింది. ఐదేళ్ల నుంచి ఏటా సుమారు 2.80 లక్షలకుపైగా ఈ గుడ్లు ఉత్పత్తి చేస్తుండగా.. ఈ ఏడాది(ఫిబ్రవరితో గుడ్ల తయారీ ముగుస్తుంది) 3.27 లక్షలతో అగ్రస్థానాన్ని పొందింది. -
ఎన్నికల తర్వాతే వీసీల నియామకాలు
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతుల నియామక ప్రక్రియ లోక్సభ ఎన్నికల తర్వాతే చేపట్టనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయింది. -
TS News: భర్తీ చేస్తున్నా.. భారీగా ఖాళీలు
ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు విశేష ప్రతిభతో రెండు, మూడు, నాలుగు, అయిదేసి పోస్టులకు ఎంపికవడం మిగిలిన వారికి అశనిపాతంగా మారుతోంది. -
గొత్తికోయల ఆక్రమణలో 26 వేల ఎకరాలు
గొత్తికోయలు రాష్ట్రంలో 26 వేల ఎకరాల అటవీ ప్రాంతాల్ని ఆక్రమించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ వివరాల్ని కొద్దిరోజుల క్రితం నిర్వహించిన సమీక్షలో ఆ శాఖ మంత్రి కొండా సురేఖకు నివేదించారు. -
‘స్టేట్మెంట్’ దాఖలు విషయంలో అనిశ్చితి!
తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి విచారణ చేపట్టిన కృష్ణా ట్రైబ్యునల్-2 వద్ద రెండు రాష్ట్రాలూ దాఖలు చేయాల్సిన ‘స్టేట్మెంట్ ఆఫ్ కేస్’ విషయమై అనిశ్చితి నెలకొంది. ఈ నెల 20వ తేదీన దాఖలు చేయడానికి కేడబ్ల్యూడీటీ-2 రెండు రాష్ట్రాలకూ గడువు ఇచ్చింది. -
20 నుంచి మళ్లీ అయ్యర్ కమిటీ పర్యటన
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల్లో లోటుపాట్లపై పరిశీలనకు నియమించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్.డి.ఎస్.ఎ.) నిపుణుల కమిటీ ఈనెల 20న హైదరాబాద్కు రానుంది. -
ప్రభుత్వ ఆదేశాలనే అమలు చేస్తున్నాం
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగించే ఇళ్లకు జీరో బిల్లులకు విద్యుత్తు చట్ట ప్రకారం రాయితీ నిధులు ఇస్తామని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తెలిపింది. దీనికి సంబంధించిన వివరణ పత్రాన్ని సోమవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
-
Flight Journey: ‘బరువు ఉన్నామని విమానం నుంచి దించేశారు’
-
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్కు సీఎంవో నుంచి పిలుపు
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే