గోల్కొండ కోటలో రాష్ట్ర అవతరణ వేడుకలు

హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది.

Published : 31 May 2023 02:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి జూన్‌ 2న ఉదయం 6.30 గంటలకు కోటలో జాతీయ పతాకాన్ని ఎగరేయనున్నట్లు సమాచారం. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గాయకుడు శంకర్‌ మహదేవన్‌, జానపద గాయని మంగ్లీ తదితరులను ఆహ్వానించారు. గతేడాది సెప్టెంబరు 17న కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని