తిరుమలకు వచ్చిన కారులో శిలువ గుర్తు

తిరుమలలో మంగళవారం అన్యమత చిహ్నంతో కూడిన కారు తిరిగింది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన రవికుమార్‌(38) తన కారులో అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి తిరుమలకు చేరుకున్నారు.

Published : 31 May 2023 03:43 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమలలో మంగళవారం అన్యమత చిహ్నంతో కూడిన కారు తిరిగింది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన రవికుమార్‌(38) తన కారులో అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి తిరుమలకు చేరుకున్నారు. కారు ముందు భాగంలోనే క్రైస్తవ శిలువ బొమ్మ ఉంది. స్థానిక సీఆర్వో కేంద్రం వద్ద స్థానికులు ఆ విషయం గుర్తించి తితిదే భద్రతా సిబ్బందికి తెలిపారు. సిబ్బంది అతడిని పట్టుకుని విచారిస్తున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలు, స్టిక్కర్లు గుర్తిస్తే తితిదే భద్రతా సిబ్బంది తొలగించి వాహనాలు తిరుమలకు పంపాలి. అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంతోనే శిలువ గుర్తుతో కారు తిరుమలకు చేరుకుందని భక్తులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు