వేద పండితుల గౌరవ భృతి పెంపు
బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేదపండితులకు ప్రతి నెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నామని, అర్హత వయసును 75 ఏళ్ల నుంచి 65కు తగ్గిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
అర్హత వయసు 65కు తగ్గింపు
మరో 2,796 దేవాలయాలకు ధూప, దీప నైవేద్య పథకం వర్తింపు
బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ వెల్లడి
అనువంశిక అర్చకుల సమస్యల పరిష్కారానికి హామీ
ఈనాడు, హైదరాబాద్: బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేదపండితులకు ప్రతి నెలా ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నామని, అర్హత వయసును 75 ఏళ్ల నుంచి 65కు తగ్గిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గోపన్పల్లిలో తొమ్మిది ఎకరాల్లో నిర్మించిన ‘విప్రహిత’ బ్రాహ్మణ సంక్షేమ సదనాన్ని సీఎం బుధవారం ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి నేరుగా యాగశాలకు చేరుకున్న సీఎం కేసీఆర్.. తొలుత పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆసీనులైన పీఠాధిపతుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు వేదపండితులు కిరీటం ధరింపజేసి, శాలువాలు కప్పి సంప్రదాయ పద్ధతిలో శంఖారావం, వేదమంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం అక్కడి సభలో సీఎం ప్రసంగించారు. బ్రహ్మజ్ఞానం పొందిన వారెవరికైనా బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందని పెద్దలు చెప్పారని, వేదవాజ్ఞ్మయ విజ్ఞానాన్ని సమాజానికి అదించేవారే విప్రులని అన్నారు. బ్రాహ్మణుల మనసు, మాట, పని లోకహితం కోసమే అన్నారు.
ఏటా రూ.100 కోట్లతో సంక్షేమం
పేదబ్రాహ్మణులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును 2017 ఫిబ్రవరి 1న ఏర్పాటు చేసి ఏడాదికి రూ.100 కోట్లతో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. వివేకానంద స్కాలర్షిప్ ద్వారా 780 మంది విద్యార్థులు లబ్ధి పొందారన్నారు. పేద బ్రాహ్మణుల జీవనోపాధి కోసం బ్రాహ్మిణ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ (బెస్ట్) ద్వారా పెట్టుబడి సాయంగా గరిష్ఠంగా రూ.5 లక్షల గ్రాంటు ఇస్తుండగా.. ఇప్పటివరకు రూ.150 కోట్లు ఖర్చు చేశామన్నారు. రూ.12 కోట్లతో బ్రాహ్మణ సదనం నిర్మించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ సదనం సనాతన సంస్కృతి కేంద్రంగా, ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రానికి వచ్చే పీఠాధిపతులు, ధర్మాచార్యుల విడిది కేంద్రంగా, పేద బ్రాహ్మణుల కల్యాణాలకు ఉచిత వేదికగా ఉపయోగపడుతుందన్నారు. కులమతాలకతీతంగా పేదవారి ఇళ్లలో జరిగే శుభాశుభ కార్యాలకు పురోహితుల సేవలు కోరితే.. ఇక్కడి నుంచి వెళ్లి కార్యక్రమాలు జరిపించి రావాలని సీఎం కోరారు. ‘విప్రహిత’.. సకల జనహితగా విఖ్యాతి పొందాలన్నదే తన అభిమతమన్నారు. దేవతా ప్రతిష్ఠలు, వివిధ క్రతువులు, ఆలయాల నిర్మాణాలు, ఆగమశాస్త్ర నియమాలకు సంబంధించిన ప్రత్యేక లైబ్రరీని సదనంలో ఏర్పాటు చేయాలని, అరుదైన పుస్తకాలు, డిజిటల్ వీడియోలు ఏర్పాటు చేయాలన్నారు.
కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం
సూర్యాపేట జిల్లాలో డాక్టర్ ఎ.రామయ్య ఇచ్చిన ఎకరా స్థలంలో నిర్మించిన బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. ఖమ్మం, మధిర, బీచుపల్లి ప్రాంతాల్లో బ్రాహ్మణ భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయం ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 3,645 దేవాలయాలకు ధూప, దీప నైవేద్య పథకం వర్తిస్తుండగా.. మరో 2,796 దేవాలయాలకు విస్తరిస్తామని సీఎం వెల్లడించారు. దేవాలయాల నిర్వహణ కోసం అర్చకులకు నెలకు రూ.6 వేల చొప్పున అందిస్తున్న మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతున్నామని ప్రకటించారు.
బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్
వేద పాఠశాలల నిర్వహణ కోసం ఇస్తున్న రూ.2 లక్షలను ఇకపై వార్షిక గ్రాంటుగా విడుదల చేస్తామని తెలిపారు. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదివే బ్రాహ్మణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వర్తింపజేసేలా నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు. అనువంశిక అర్చకుల సమస్యలను త్వరలో కేబినెట్లో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కె.వి.రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ డీజీపీలు అనురాగ్శర్మ, అరవిందరావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, దేవీప్రసాద్, జస్టిస్ భాస్కర్రావు, వివిధ పీఠాధిపతులు, ఆల్ ఇండియా బ్రాహ్మిణ్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రదీప్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల నుంచి అర్చకులు పాల్గొన్నారు.
స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసిన సీఎం
చందానగర్, న్యూస్టుడే: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని సీఎం కేసీఆర్ కలిశారు. బుధవారం చందానగర్ వేంకటేశ్వర దేవాలయంలోని గురునిలయానికి సీఎం కేసీఆర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ విచ్చేశారు. స్వరూపానందేంద్ర సరస్వతి, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. సుమారు గంటసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. తర్వాత మరో గంటసేపు ఆధ్యాత్మిక విషయాలపై స్వాములతో సీఎం కేసీఆర్ ఏకాంతంగా మాట్లాడారు. సార్వత్రిక భారతదేశం ఎలా ఉండాలి, నదులు ఎక్కడెక్కడ పుట్టాయి, వాటి పుట్టుక నేపథ్యం, నేటి ఆధునిక సమాజంలో ఆధ్యాత్మిక అంశాలపై పిల్లల్లో పరివర్తన ఎలా రావాలన్న అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించారని స్వాత్మానందేంద్ర సరస్వతి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!