గవర్నర్‌కు ప్రధాని పుట్టినరోజు శుభాకాంక్షలు

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైౖ పుట్టినరోజు(జూన్‌ 2) సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక లేఖ పంపించారు.

Published : 02 Jun 2023 04:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైౖ పుట్టినరోజు(జూన్‌ 2) సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక లేఖ పంపించారు. ‘‘మానవ, సామాజిక, జాతీయ విలువల నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు పుట్టినరోజు ఒక ప్రత్యేక సందర్భం. ఈ విలువలతో సామాన్య ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు పనిచేస్తున్న తీరు అందరికీ స్ఫూర్తిదాయకం. రాజ్యాంగ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తూ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాల వైపు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, రాష్ట్రానికి, దేశానికి మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాను’’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని