ఇక హైడ్రోజన్ బ్యాటరీలతో రయ్రయ్!
హైడ్రోజన్ను వాహనాలకు ఇంధనంగా ఉపయోగించే స్వదేశీ పరిజ్ఞానం ఆవిష్కృతమైంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగిస్తుండగా భారత్లో ఇప్పటివరకు ఆ సాంకేతికత వినియోగంలో లేదు.
ఆవిష్కృతమైన స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం
బాబా అణు పరిశోధన కేంద్రం... జేఎన్టీయూ సంయుక్త పరిశోధన
హైడ్రోజన్ను వాహనాలకు ఇంధనంగా ఉపయోగించే స్వదేశీ పరిజ్ఞానం ఆవిష్కృతమైంది. కొన్ని దేశాల్లో ఇప్పటికే హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగిస్తుండగా భారత్లో ఇప్పటివరకు ఆ సాంకేతికత వినియోగంలో లేదు. అతి తక్కువ ఖర్చుతో నీటిని ఆక్సిజన్, హైడ్రోజన్ (ఉదజని)గా విడగొట్టి హైడ్రోజన్ను సెల్ రూపంలో తయారు చేసి ఇంధనంగా మార్చేందుకు బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్), జేఎన్టీయూ హైదరాబాద్ సంయుక్తగా కృషి చేస్తున్నాయి. బార్క్ శాస్త్రవేత్తలు, జేఎన్టీయూలోని సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ విభాగంలోని ప్రొఫెసర్లు విజయలక్ష్మి, హిమబిందు ఆధ్వర్యంలో నాలుగేళ్ల పాటు పరిశోధనలు జరిగాయి. ఇవి పూర్తిస్థాయిలో ఫలితాలిచ్చాయి. వాహనాల్లో సీఎన్జీ సిలిండర్ తరహాలో హైడ్రోజన్ సిలిండర్ను అమర్చి ఇంధనంగా వినియోగించవచ్చు. ప్రైవేటు సంస్థలు, అంకుర సంస్థలకు తమ పరిశోధనల ఫలితాలు, పరిజ్ఞానాన్ని అవగాహన ఒప్పందాల ద్వారా ఇవ్వనున్నామని ప్రొఫెసర్ హిమబిందు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు, ఉత్తర్ప్రదేశ్ వచ్చే రెండేళ్లలో 40 శాతం బస్సులకు ఇంధనంగా హైడ్రోజన్ను వినియోగించనున్నాయని ఆమె పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ ఇంధనం
నీరు అంటే హైడ్రోజన్, ఆక్సిజన్ అణువుల కలయిక. నీటితో జలవిద్యుత్ తయారు చేసినట్టే నీటిలోని హైడ్రోజన్, ఆక్సిజన్లను విడగొట్టి వాహనాలకు ఇంధనంగా మార్చేప్రక్రియ రెండున్నర దశాబ్దాల క్రితమే దేశంలో మొదలయ్యింది. ఇప్పటికే బాబా అణు పరిశోధన సంస్థ తన సొంత అవసరాలకు, దేశ రక్షణకు అవసరమైన ప్రాజెక్టుల్లో వినియోగించే వాహనాలకు ఇంధనంగా హైడ్రోజన్ను వినియోగించుకుంటోంది. నీటిని విడగొట్టాలంటే అది స్వచ్ఛంగా ఉండాలి. అందుకు విద్యుత్ అవసరం. ఆ ఖర్చుకంటే.. హైడ్రోజన్ వినియోగానికి అయ్యే ఖర్చు తక్కువగా ఉంటేనే వాహనదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు వందల సంఖ్యలో పరిశోధనలు చేసి ఉదజనిని ఇంధనంగా మార్చేందుకు తక్కువ విద్యుత్ను వినియోగించే ఫార్ములాను రూపొందించారు. హైడ్రోజన్ బ్యాటరీ తయారు చేసేందుకు సౌరవిద్యుత్ను వినియోగిస్తున్నామని ప్రొఫెసర్ హిమబిందు తెలిపారు. పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయంగా దీన్ని ఇంధనంగా వినియోగించుకోవచ్చని పలు ప్రయోగాల్లో నిరూపితమైందని వివరించారు.కేంద్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం ‘హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ క్లస్టర్’ పేరుతో దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. తాగునీటితో పాటు ఆల్గే, వ్యర్థ జలాల్లోంచి ఉదజని, ప్రాణవాయువును వేరు చేయాలన్నది హైడ్రోజన్ వ్యాలీ లక్ష్యం.
పెట్రోలు, డీజిల్తో పోలిస్తే ఖర్చు తక్కువే..
బస్సులు, కార్లు, ఇతర భారీ వాహనాలకు వినియోగిస్తున్న పెట్రోలు, డీజిల్ ఖర్చుతో పోలిస్తే హైడ్రోజన్ ఇంధనం ఖర్చు తక్కువే. ఒక కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లినప్పుడు లీటర్ డీజిల్ 15 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే..దాదాపు అదేఖర్చుతో లభించే హైడ్రోజన్ సెల్ ఒక యూనిట్ ఇంధనంతో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లినప్పుడు 45 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. అంటే డీజిల్తో పోలిస్తే... మూడోవంతు మాత్రమే ఖర్చవుతుంది.
* విదేశాల్లో టయోటా, హ్యుందాయ్, హోండా కంపెనీలు హైడ్రోజన్ ఇంధనంతో నడిచే కార్లను ఏడేళ్ల నుంచి తయారు చేస్తున్నాయి. ఇందులో హోండా కంపెనీ సాంకేతిక కారణాలతో ఉత్పత్తిని తగ్గించుకోగా... హ్యుందాయ్, టయోటా కంపెనీలు కార్ల ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటికి పదిహేను వేల వాహనాలు హైడ్రోజన్తో నడుస్తున్నాయి.
* హైడ్రోజన్తో నడిచే టయోటా ‘మిరాయ్’ కారును కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొద్దినెలల క్రితం పార్లమెంటుకు నడుపుకొంటూ వచ్చారు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!