గుత్తేదారులు ముందుకొచ్చారు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో మొత్తం 17 ప్రమాదకర ప్రాంతాలను చక్కదిద్దేందుకు ఎట్టకేలకు గుత్తేదారులు ముందుకు వచ్చారు.
17 ప్రమాదకర ప్రాంతాలను చక్కదిద్దేందుకు త్వరలో చర్యలు
హైదరాబాద్-విజయవాడ రహదారి పనులకు మూడు టెండర్లు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో మొత్తం 17 ప్రమాదకర ప్రాంతాలను చక్కదిద్దేందుకు ఎట్టకేలకు గుత్తేదారులు ముందుకు వచ్చారు. అయిదు నెలలుగా సాగుతున్న వాయిదా పర్వం కొలిక్కి వచ్చింది. గడిచిన ఏడాది డిసెంబరులో టెండర్లు ఆహ్వానిస్తే ఎట్టకేలకు తాజాగా మూడు గుత్తేదారు సంస్థలు ముందుకు వచ్చినట్లు సమాచారం. సాంకేతిక, ఆర్థిక బిడ్స్ను పరిశీలించిన మీదట వచ్చే వారంలో గుత్తేదారును ఖరారు చేయనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు చెప్పారు. నెలాఖరులోగా ఒప్పంద ప్రక్రియ పూర్తయిన తరవాత గుత్తేదారు పనులు చేపడతారని తెలిపారు. రూ.333 కోట్లతో ఆయా ప్రాంతాలను ప్రమాదరహితంగా చేసేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ టెండర్లు ఆహ్వానించింది. నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని 2025 నాటికి ఆరు వరుసలకు విస్తరించాలన్నది రహదారి నిర్మాణ సమయంలో తీసుకున్న నిర్ణయం. ఏపీ విభజన తరవాత నుంచి ఈ మార్గంలో రాకపోకలు తగ్గటంతో టోల్ వసూలు వ్యవహారంలో జాతీయ రహదారుల సంస్థకు, రహదారి నిర్మాణ సంస్థకు మధ్య వివాదం తలెత్తింది. ఆ మార్గాన్ని ఆరు వరుసలకు విస్తరించాలా? వద్దా? అన్న అంశంపై నాలుగైదేళ్లుగా తర్జన భర్జనలు సాగుతున్నాయి. మునుపటితో పోలిస్తే ట్రాఫిక్ రద్దీ తగ్గిన నేపథ్యంలో ఆరు వరుసలకు విస్తరించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభ సభ్యులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. అంతేకాకుండా ఈ రహదారిలో ప్రమాదకర ప్రాంతాలను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
పెరిగిన వ్యయం...
తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను చక్కదిద్దేందుకు కేంద్రం రూ.265 కోట్లతో పనులు చేపట్టాలని తొలుత నిర్ణయించింది. ఆ తరవాత అవసరమైన చోట్ల వంతెనలు నిర్మించాలని నిర్ణయించటంతో నిర్మాణ వ్యయం రూ.333 కోట్లకు పెరిగినట్లు సమాచారం.
ప్రమాదకర ప్రాంతాలివే...
పెదకాపర్తి, చిట్యాల బైపాస్రోడ్డు, నల్గొండ క్రాస్రోడ్డు, కట్టంగూర్, కొర్లపహాడ్, సూర్యాపేట సమీపంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల, జనగామ క్రాస్రోడ్డు, సూర్యాపేట శివారున, దురాజ్పల్లి క్రాస్రోడ్, ముకుందాపురం, ఆకుపాముల బైపాస్రోడ్, కోమరబండ క్రాస్రోడ్, కటకమ్మగూడెం క్రాస్రోడ్, మేళ్లచెరువు క్రాస్రోడ్, శ్రీరాంపురం, రామాపురం క్రాస్రోడ్, నవాబ్పేట... వీటిని ప్రమాదకర ప్రాంతాలుగా గుర్తించారు. గుత్తేదారుతో ఒప్పందం చేసుకున్న నాటి నుంచి ఏడాదిన్నరలో పనులు చేసేందుకు వీలుగా టెండర్లు ఆహ్వానించారు. పదేళ్లపాటు ఆయా ప్రాంతాల నిర్వహణ బాధ్యత కూడా గుత్తేదారుదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!