సంక్షిప్త వార్తలు (5)
ఓ వైపు తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవం.. మరోవైపు వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి హరీశ్రావు జన్మదినం.
హరీశ్ జన్మదినం.. రైతు సంబురం
ఓ వైపు తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవం.. మరోవైపు వైద్యారోగ్య, ఆర్థికశాఖల మంత్రి హరీశ్రావు జన్మదినం.. శనివారం ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు, రైతులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డులో నవధాన్యాలతో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావు చిత్రాలను 34 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో భారీగా తీర్చిదిద్దారు. దీని కోసం దాదాపు 8 గంటలపాటు శ్రమించారు. ఆరు క్వింటాళ్ల నవధాన్యాలు వినియోగించినట్లు కమిటీ అధ్యక్షురాలు మచ్చ విజిత, భారాస నాయకుడు మచ్చ వేణుగోపాల్రెడ్డి తెలిపారు.
- న్యూస్టుడే, సిద్దిపేట
19 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి
ఈనాడు, హైదరాబాద్: అడ్హాక్ పద్ధతిలో 19 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా రెవెన్యూశాఖ పదోన్నతులు కల్పించింది. 2020 నాటి సవరించిన వేతనాలు అమలు చేస్తూ రూపొందించిన పదోన్నతుల ఉత్తర్వులను రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్ శనివారం విడుదల చేశారు. పదోన్నతులు పొందిన వారంతా భూ పరిపాలన ప్రధాన కమిషనర్కు రిపోర్టు చేయాలని ఆదేశించారు.
గిరిజన సంక్షేమశాఖ దశాబ్ది ఉత్సవాల్లో ప్రదర్శనలు
ఈనాడు, హైదరాబాద్: గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని బంజారాభవన్లో ఈ నెల 22 వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయని గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ నెల 5, 6 తేదీల్లో కోయ, నాయక్పోడ్, 8, 9 తేదీల్లో తోటి, కొలామ్, కొండారెడ్డి, చెంచు, 12, 13 తేదీల్లో గోండ్, పర్ధాన్, ఆంధ్ ఆదిమజాతుల హస్తకళలు, నృత్యాల ప్రదర్శన ఉంటుందని వివరించారు. ఈ నెల 14, 15 తేదీల్లో సదస్సులు, 21, 22 తేదీల్లో భాష, సంస్కృతి, ఆహార అలవాట్లు, సంప్రదాయ వైద్యంపై ప్రదర్శనలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
వ్యవసాయ వ్యాపార కేంద్రాలపై ఉచిత శిక్షణ
ఈనాడు, హైదరాబాద్: వ్యవసాయ వ్యాపార కేంద్రాలు, అగ్రిక్లినిక్ల స్థాపనపై జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య నిర్వహణ సంస్థ (మేనేజ్) సహకారంతో హైదరాబాద్లో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పారిశ్రామిక అభివృద్ధి కేంద్రం ప్రకటించింది. వ్యవసాయం, పశువైద్య విజ్ఞానం, పట్టు పరిశ్రమలు, చేపల పెంపకం, విత్తన, బయో టెక్నాలజీలో డిగ్రీ, డిప్లొమా, పీజీ చేసిన వారికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు సమన్వయకర్త చంద్రకిరణ్ (ఫోన్ నంబరు 7036666425)ను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సీఈడీ కోరింది. శిక్షణ పొందిన వారికి మేనేజ్ నుంచి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని తెలిపింది.
బోధన తీరు స్వరూపం మారాలి
సైయెంట్ వ్యవస్థాపక ఛైర్మన్ బీవీఆర్ మోహన్రెడ్డి
ఈనాడు, అమరావతి: బోధన తీరు స్వరూపం మారాలని సైయెంట్ వ్యవస్థాపక ఛైర్మన్, ఐఐటీ కాన్పుర్ బోర్డు సభ్యుడు బి.వి.ఆర్.మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. విద్యారంగం సాంకేతికత ఆధారంగా మారినందున అధ్యాపకులు పాఠాలు చెబుతాం..వినండి అని కాకుండా.. ప్రశ్నలు, జవాబుల రూపంలో బోధన సాగిస్తే...విద్యార్థుల్లో నైపుణ్యాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విజయవాడలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మోహన్రెడ్డి మాట్లాడారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా బోధన రంగంలోనూ మార్పులు తెచ్చేందుకు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు కృషి చేయాలని సూచించారు. రానున్న పదేళ్లలో పది కోట్ల మంది చదువులు ముగించుకొని వస్తారని...వీరికి ఉద్యోగాలు లభించాలంటే...ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఖ్య బాగా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ డాక్టర్ వినోద్కుమార్, నాగార్జున వర్సిటీ వీసీ వేణుగోపాలరెడ్డి, ఏపీ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రేమచంద్రారెడ్డి, విద్యాశాఖ సలహాదారు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా