15 ఎకరాలను అప్పనంగా అప్పగించినట్లుంది
హెటిరో పార్థసారథిరెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్కు లీజు ప్రాతిపదికన జరిపిన భూకేటాయింపును రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.
ప్రజాప్రయోజనాలకే ప్రభుత్వంపెద్దపీట వేయాలి
30 ఏళ్లనాటి నిబంధనలు ప్రామాణికమా?
హెటిరో గ్రూపు సాయిసింధు ఫౌండేషన్కు భూకేటాయింపు రాజ్యాంగవిరుద్ధం
రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు
ప్రభుత్వ విధానాన్నిపునఃపరిశీలించాలని ఆదేశం
ఈనాడు - హైదరాబాద్
హెటిరో పార్థసారథిరెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్కు లీజు ప్రాతిపదికన జరిపిన భూకేటాయింపును రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లో 15 ఎకరాల భూమిని నామమాత్రపు లీజుకు కేటాయిస్తూ ప్రభుత్వం 2018లో జారీ చేసిన జీవో 59, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదే ఏడాది ఆగస్టులో జారీ చేసిన మెమోను కొట్టివేసింది. వ్యక్తులు, సంస్థలు చేసే దరఖాస్తుల ఆధారంగా ప్రభుత్వ విధానాన్ని మార్చుకోరాదని స్పష్టం చేసింది. 30 ఏళ్ల నాటి మార్కెట్ విలువను ఆధారంగా చేసుకుని హెటిరో పార్థసారథిరెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్కు భూకేటాయింపు జరిగిన విధానాన్ని చూస్తే అప్పనంగా పళ్లెంలో పెట్టి అప్పగించినట్లుందని వ్యాఖ్యానించింది. ఈ కేటాయింపు చెల్లదని.. 2012, 2015లలో జారీ చేసిన 571, 218 జీవోలకు అనుగుణంగా పునఃపరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాయిసింధు ఫౌండేషన్కు 15 ఎకరాల భూమి కేటాయించడాన్ని సవాలు చేస్తూ డాక్టర్ ఊర్మిళా పింగ్లే తదితరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి సోమవారం 125 పేజీల తీర్పును వెలువరించింది.
కలెక్టర్ చేసిన ప్రతిపాదనలకు, భూకేటాయింపు అథారిటీ ఆమోదించినదానికి, జీవో 571లోని లీజు మార్గదర్శకాలకు విరుద్ధంగా భూమి కేటాయించినట్లు ఉందని పేర్కొంది. మార్కెట్ విలువను అథారిటీ చదరపు గజానికి రూ.75 వేలుగా నిర్ణయించిందని, అయితే ప్రభుత్వం బసవతారకం ఆసుపత్రికి 1989లో జరిపిన 7.5 ఎకరాల కేటాయింపునే ఇందుకు ప్రాతిపదికగా తీసుకుందని తెలిపింది. కలెక్టర్, అథారిటీల సిఫారసులను, ప్రభుత్వ విధానాన్ని పక్కనపెట్టి భూమి కేటాయించడానికి ఎలాంటి కారణాలు పేర్కొనలేదంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని భూకేటాయింపుపై నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో లేదంది. బసవతారకం ఆసుపత్రికి 1989లో భూమి కేటాయించినప్పుడు భూకేటాయింపుపై ఎలాంటి విధానం లేదంది. అప్పటి లీజు నిబంధనలనే సాయిసింధు ఫౌండేషన్ విషయంలో యథాతథంగా ఏడాదికి రూ.50 వేలు, మూడేళ్లకోసారి 5 శాతం పెంచేలా నిర్ణయించే ముందు హైదరాబాద్లో 30 ఏళ్ల తరువాత పెరిగిన భూముల విలువను పట్టించుకోలేదంది. విద్య, వైద్య సంస్థల ఏర్పాటుకు బహిరంగ వేలం, టెండరు విధానం అవసరం లేకపోయినా కనీసం ప్రభుత్వం రూపొందించిన విధానాన్నయినా అనుసరించాల్సి ఉందని తెలిపింది. ప్రస్తుతం సాయిసింధు ఫౌండేషన్కు భూకేటాయింపులో అథారిటీ వాణిజ్య అవసరాల భూమి విలువ చదరపు అడుగుకు రూ.70 వేల నుంచి 80 వేలుగా ఉందని పేర్కొందని తెలిపింది.
ఆసుపత్రి నిర్మాణానికి 10 ఎకరాలు చాలని అథారిటీ సిఫారసు చేసినా ప్రభుత్వం 15 ఎకరాలను ఏడాదికి కేవలం రూ.1.47 లక్షలకే అంటే నామమాత్రపు విలువకే లీజుకు కేటాయించిందని పేర్కొంది. ఇదేం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కాదని వ్యాఖ్యానించింది. రాష్ట్ర వనరులకు ధర్మకర్త లాంటి ప్రభుత్వం ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా పెట్టుకుని కేటాయింపులు జరపాల్సి ఉందని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ప్రభుత్వం, అధికారులు తమకు నచ్చిన వ్యక్తి, సంస్థలకు కేటాయించడానికి వీల్లేదని.. ప్రతి కేటాయింపూ పారదర్శకంగా, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉందని తెలిపింది. పెద్దమొత్తంలో భూమి కేటాయించే ముందు పారదర్శకత, సమన్యాయం పాటించాలని.. వ్యక్తులు, సంస్థలు పెట్టుకునే దరఖాస్తుల ఆధారంగా రాష్ట్ర విధానాలను తిరస్కరించేలా ఉండరాదంది. వ్యక్తులు, సంస్థలు పెద్దమొత్తంలో భూమి కేటాయింపు కోసం దరఖాస్తు చేసుకున్నపుడు.. అర్హత ఉండి పోటీకి వచ్చేవారిని మినహాయించడం సరికాదంది. ఒకరికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఏకపక్షంగా కేటాయించడం, మరొకరిపై వివక్ష చూపడం రాజ్యాంగంలోని అధికరణ 14కు విరుద్ధమని పేర్కొంది. విద్య, వైద్య సంస్థలకు భూమిని కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఉందని.. అయితే సమానత్వ సిద్ధాంతానికి అనుగుణంగా కేటాయించేలా కసరత్తు జరగాల్సి ఉందని సుప్రీంకోర్టు పేర్కొందని తెలిపింది. ప్రస్తుత భూకేటాయింపు ఏకపక్షం, అసమంజసమని.. ఇది ప్రభుత్వ విధానానికి వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.
భూకేటాయింపును సమర్థిస్తూ అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ ప్రస్తావించిన తీర్పులు ఇక్కడ వర్తించవని, వాటితో ఏకీభవించలేమంది. ఆసుపత్రి నిర్మాణం 2023 సెప్టెంబరుకల్లా పూర్తవుతున్న దృష్ట్యా భూకేటాయింపుపై జోక్యం చేసుకోరాదంటూ హెటిరో ఛైర్మన్ పార్థసారథిరెడ్డి, సాయిసింధు ఫౌండేషన్ తరఫు సీనియర్ న్యాయవాది, వైకాపా ఎంపీ ఎస్.నిరంజన్రెడ్డి చేసిన వాదనతో ఏకీభవించడం లేదంది. 2021 ఫిబ్రవరి 11న ఈ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఏ నిర్మాణం జరిగినా తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసిందని ధర్మాసనం గుర్తుచేసింది. నిర్మాణం జరిగిందన్న కారణంగా చట్ట ఉల్లంఘనలను విస్మరించలేమని, మధ్యంతర ఉత్తర్వులు ఫౌండేషన్కు ఎలాంటి అదనపు హక్కులు సృష్టించవని తేల్చిచెప్పింది. నిర్మాణం జరిగిందన్న కారణంగా మినహాయింపులు కుదరవంది. ఈ నేపథ్యంలో భూమి కేటాయిస్తూ జారీ చేసిన జీవో 59ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ విధానం ప్రకారం పునఃపరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, కొత్త కస్టమర్లు చేర్చుకోవడంపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ