15 ఎకరాలను అప్పనంగా అప్పగించినట్లుంది
హెటిరో పార్థసారథిరెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్కు లీజు ప్రాతిపదికన జరిపిన భూకేటాయింపును రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.
ప్రజాప్రయోజనాలకే ప్రభుత్వంపెద్దపీట వేయాలి
30 ఏళ్లనాటి నిబంధనలు ప్రామాణికమా?
హెటిరో గ్రూపు సాయిసింధు ఫౌండేషన్కు భూకేటాయింపు రాజ్యాంగవిరుద్ధం
రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు
ప్రభుత్వ విధానాన్నిపునఃపరిశీలించాలని ఆదేశం
ఈనాడు - హైదరాబాద్
హెటిరో పార్థసారథిరెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్కు లీజు ప్రాతిపదికన జరిపిన భూకేటాయింపును రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్లో 15 ఎకరాల భూమిని నామమాత్రపు లీజుకు కేటాయిస్తూ ప్రభుత్వం 2018లో జారీ చేసిన జీవో 59, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదే ఏడాది ఆగస్టులో జారీ చేసిన మెమోను కొట్టివేసింది. వ్యక్తులు, సంస్థలు చేసే దరఖాస్తుల ఆధారంగా ప్రభుత్వ విధానాన్ని మార్చుకోరాదని స్పష్టం చేసింది. 30 ఏళ్ల నాటి మార్కెట్ విలువను ఆధారంగా చేసుకుని హెటిరో పార్థసారథిరెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్కు భూకేటాయింపు జరిగిన విధానాన్ని చూస్తే అప్పనంగా పళ్లెంలో పెట్టి అప్పగించినట్లుందని వ్యాఖ్యానించింది. ఈ కేటాయింపు చెల్లదని.. 2012, 2015లలో జారీ చేసిన 571, 218 జీవోలకు అనుగుణంగా పునఃపరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాయిసింధు ఫౌండేషన్కు 15 ఎకరాల భూమి కేటాయించడాన్ని సవాలు చేస్తూ డాక్టర్ ఊర్మిళా పింగ్లే తదితరులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి సోమవారం 125 పేజీల తీర్పును వెలువరించింది.
కలెక్టర్ చేసిన ప్రతిపాదనలకు, భూకేటాయింపు అథారిటీ ఆమోదించినదానికి, జీవో 571లోని లీజు మార్గదర్శకాలకు విరుద్ధంగా భూమి కేటాయించినట్లు ఉందని పేర్కొంది. మార్కెట్ విలువను అథారిటీ చదరపు గజానికి రూ.75 వేలుగా నిర్ణయించిందని, అయితే ప్రభుత్వం బసవతారకం ఆసుపత్రికి 1989లో జరిపిన 7.5 ఎకరాల కేటాయింపునే ఇందుకు ప్రాతిపదికగా తీసుకుందని తెలిపింది. కలెక్టర్, అథారిటీల సిఫారసులను, ప్రభుత్వ విధానాన్ని పక్కనపెట్టి భూమి కేటాయించడానికి ఎలాంటి కారణాలు పేర్కొనలేదంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని భూకేటాయింపుపై నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో లేదంది. బసవతారకం ఆసుపత్రికి 1989లో భూమి కేటాయించినప్పుడు భూకేటాయింపుపై ఎలాంటి విధానం లేదంది. అప్పటి లీజు నిబంధనలనే సాయిసింధు ఫౌండేషన్ విషయంలో యథాతథంగా ఏడాదికి రూ.50 వేలు, మూడేళ్లకోసారి 5 శాతం పెంచేలా నిర్ణయించే ముందు హైదరాబాద్లో 30 ఏళ్ల తరువాత పెరిగిన భూముల విలువను పట్టించుకోలేదంది. విద్య, వైద్య సంస్థల ఏర్పాటుకు బహిరంగ వేలం, టెండరు విధానం అవసరం లేకపోయినా కనీసం ప్రభుత్వం రూపొందించిన విధానాన్నయినా అనుసరించాల్సి ఉందని తెలిపింది. ప్రస్తుతం సాయిసింధు ఫౌండేషన్కు భూకేటాయింపులో అథారిటీ వాణిజ్య అవసరాల భూమి విలువ చదరపు అడుగుకు రూ.70 వేల నుంచి 80 వేలుగా ఉందని పేర్కొందని తెలిపింది.
ఆసుపత్రి నిర్మాణానికి 10 ఎకరాలు చాలని అథారిటీ సిఫారసు చేసినా ప్రభుత్వం 15 ఎకరాలను ఏడాదికి కేవలం రూ.1.47 లక్షలకే అంటే నామమాత్రపు విలువకే లీజుకు కేటాయించిందని పేర్కొంది. ఇదేం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం కాదని వ్యాఖ్యానించింది. రాష్ట్ర వనరులకు ధర్మకర్త లాంటి ప్రభుత్వం ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా పెట్టుకుని కేటాయింపులు జరపాల్సి ఉందని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ప్రభుత్వం, అధికారులు తమకు నచ్చిన వ్యక్తి, సంస్థలకు కేటాయించడానికి వీల్లేదని.. ప్రతి కేటాయింపూ పారదర్శకంగా, ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉందని తెలిపింది. పెద్దమొత్తంలో భూమి కేటాయించే ముందు పారదర్శకత, సమన్యాయం పాటించాలని.. వ్యక్తులు, సంస్థలు పెట్టుకునే దరఖాస్తుల ఆధారంగా రాష్ట్ర విధానాలను తిరస్కరించేలా ఉండరాదంది. వ్యక్తులు, సంస్థలు పెద్దమొత్తంలో భూమి కేటాయింపు కోసం దరఖాస్తు చేసుకున్నపుడు.. అర్హత ఉండి పోటీకి వచ్చేవారిని మినహాయించడం సరికాదంది. ఒకరికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఏకపక్షంగా కేటాయించడం, మరొకరిపై వివక్ష చూపడం రాజ్యాంగంలోని అధికరణ 14కు విరుద్ధమని పేర్కొంది. విద్య, వైద్య సంస్థలకు భూమిని కేటాయించే అధికారం ప్రభుత్వానికి ఉందని.. అయితే సమానత్వ సిద్ధాంతానికి అనుగుణంగా కేటాయించేలా కసరత్తు జరగాల్సి ఉందని సుప్రీంకోర్టు పేర్కొందని తెలిపింది. ప్రస్తుత భూకేటాయింపు ఏకపక్షం, అసమంజసమని.. ఇది ప్రభుత్వ విధానానికి వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.
భూకేటాయింపును సమర్థిస్తూ అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ ప్రస్తావించిన తీర్పులు ఇక్కడ వర్తించవని, వాటితో ఏకీభవించలేమంది. ఆసుపత్రి నిర్మాణం 2023 సెప్టెంబరుకల్లా పూర్తవుతున్న దృష్ట్యా భూకేటాయింపుపై జోక్యం చేసుకోరాదంటూ హెటిరో ఛైర్మన్ పార్థసారథిరెడ్డి, సాయిసింధు ఫౌండేషన్ తరఫు సీనియర్ న్యాయవాది, వైకాపా ఎంపీ ఎస్.నిరంజన్రెడ్డి చేసిన వాదనతో ఏకీభవించడం లేదంది. 2021 ఫిబ్రవరి 11న ఈ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఏ నిర్మాణం జరిగినా తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసిందని ధర్మాసనం గుర్తుచేసింది. నిర్మాణం జరిగిందన్న కారణంగా చట్ట ఉల్లంఘనలను విస్మరించలేమని, మధ్యంతర ఉత్తర్వులు ఫౌండేషన్కు ఎలాంటి అదనపు హక్కులు సృష్టించవని తేల్చిచెప్పింది. నిర్మాణం జరిగిందన్న కారణంగా మినహాయింపులు కుదరవంది. ఈ నేపథ్యంలో భూమి కేటాయిస్తూ జారీ చేసిన జీవో 59ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ విధానం ప్రకారం పునఃపరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
Bapatla: రహదారిపై యుద్ధవిమానాల ల్యాండింగ్
బాపట్ల జిల్లా మీదుగా వెళ్లే 16వ నంబరు జాతీయ రహదారిపై వైమానిక దళం విన్యాసాలు చేపట్టింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అత్యవసర సమయాల్లో రహదారిపైనే ఉన్న రన్వేపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేసే సామర్థ్యాన్ని మదింపు చేశారు. -
తెలంగాణ సొమ్ము దిల్లీకి
భారాస, కాంగ్రెస్ల బంధాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాళేశ్వరం కుంభకోణంలో కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియదు? మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలేదు. -
గవర్నర్ తమిళిసై రాజీనామా
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) పదవికి సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సోమవారం పంపించారు. -
దాతలూ స్పందించండి.. ఈ చిన్నారిని ఆదుకోండి
నిరుపేద తల్లిదండ్రులకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఏడాది వయస్సున్న కుమారుడి తలకు ఏర్పడిన భారీ కణితి ప్రాణాంతకంగా మారింది. తల్లిదండ్రులు అప్పులు చేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడుసార్లు శస్త్రచికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. -
ఆప్ నేతలకు రూ.100 కోట్ల చెల్లింపులో కవిత పాత్ర
దిల్లీ మద్యం విధానంలో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా భారాస ఎమ్మెల్సీ కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్పాల్, జస్టిస్ మౌసమీ భట్టాచార్య
-
రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్లేవారు.. పత్రాలను వెంట ఉంచుకోవాలి
-
సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్లు
రాష్ట్రంలో సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో సోమవారం వడగళ్లవాన పడింది. రాజన్న సిరిసిల్ల మండలంలో విద్యుత్ స్తంభం కూలిన ఘటనలో ఓ రైతు మరణించారు. -
రూ.లక్షలు పెట్టు.. ఫ్యాన్సీ నంబరు పట్టు!
రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసులు కురిపిస్తున్నాయి. రూ.లక్షలు పెట్టి అయినా.. వాటిని దక్కించుకునేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. -
కవిత పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
దిల్లీ మద్యం కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన సమన్లను సవాల్ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కె.కవిత గత ఏడాది మార్చి 15న దాఖలు చేసిన రిట్ పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. -
తల్లీ వందనం.. తపనకు అభినందనం
దివ్యాంగుడైన కుమారుడిని పదోతరగతి పరీక్ష రాయించడానికి తల్లి పడుతున్న తపన స్ఫూర్తిదాయకం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి(బి)కి చెందిన చరణ్కు పోలియోతో కాళ్లు చచ్చుబడగా, చేతుల కదలికలూ పరిమితంగానే ఉన్నాయి. -
యాదగిరీశుడి కల్యాణ వైభోగం
యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. గజ వాహనంపై నారసింహుడు, పల్లకినెక్కి అమ్మ లక్ష్మీదేవి.. మండపానికి చేరుకోగా, పూజారులు ఎదుర్కొని కల్యాణ తతంగాలను చేపట్టారు. -
బోరుతోనే ఊరికి పేరు.. 40 ఏళ్లుగా ఇంకని తీరు
ఆదిలాబాద్ గ్రామీణ మండలం తిప్ప పంచాయతీ పరిధిలోని బోరింగ్గూడ గ్రామంలో ఉన్న చేతిపంపు నుంచి నిరంతరం నీరు ఉబికివస్తోంది. గ్రామంలో 40 ఏళ్ల క్రితం బోరు వేసి.. ఈ చేతిపంపు ఏర్పాటు వేశారు. దీని కారణంగానే గ్రామానికి బోరింగ్గూడ అని పేరొచ్చిందని తిప్ప మాజీ సర్పంచి కిషన్ తెలిపారు. -
ఎల్లక్కపేట దసిలిపట్టు గుడ్డు.. దేశంలోనే వెరీగుడ్
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట సమీపంలోని దసిలిపట్టు గుడ్ల తయారీ కేంద్రం దేశంలోనే నంబర్వన్గా నిలిచింది. ఐదేళ్ల నుంచి ఏటా సుమారు 2.80 లక్షలకుపైగా ఈ గుడ్లు ఉత్పత్తి చేస్తుండగా.. ఈ ఏడాది(ఫిబ్రవరితో గుడ్ల తయారీ ముగుస్తుంది) 3.27 లక్షలతో అగ్రస్థానాన్ని పొందింది. -
ఎన్నికల తర్వాతే వీసీల నియామకాలు
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతుల నియామక ప్రక్రియ లోక్సభ ఎన్నికల తర్వాతే చేపట్టనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయింది. -
భర్తీ చేస్తున్నా.. భారీగా ఖాళీలు
ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు విశేష ప్రతిభతో రెండు, మూడు, నాలుగు, అయిదేసి పోస్టులకు ఎంపికవడం మిగిలిన వారికి అశనిపాతంగా మారుతోంది. -
గొత్తికోయల ఆక్రమణలో 26 వేల ఎకరాలు
గొత్తికోయలు రాష్ట్రంలో 26 వేల ఎకరాల అటవీ ప్రాంతాల్ని ఆక్రమించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ వివరాల్ని కొద్దిరోజుల క్రితం నిర్వహించిన సమీక్షలో ఆ శాఖ మంత్రి కొండా సురేఖకు నివేదించారు. -
‘స్టేట్మెంట్’ దాఖలు విషయంలో అనిశ్చితి!
తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి విచారణ చేపట్టిన కృష్ణా ట్రైబ్యునల్-2 వద్ద రెండు రాష్ట్రాలూ దాఖలు చేయాల్సిన ‘స్టేట్మెంట్ ఆఫ్ కేస్’ విషయమై అనిశ్చితి నెలకొంది. ఈ నెల 20వ తేదీన దాఖలు చేయడానికి కేడబ్ల్యూడీటీ-2 రెండు రాష్ట్రాలకూ గడువు ఇచ్చింది. -
20 నుంచి మళ్లీ అయ్యర్ కమిటీ పర్యటన
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల్లో లోటుపాట్లపై పరిశీలనకు నియమించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్.డి.ఎస్.ఎ.) నిపుణుల కమిటీ ఈనెల 20న హైదరాబాద్కు రానుంది. -
ప్రభుత్వ ఆదేశాలనే అమలు చేస్తున్నాం
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగించే ఇళ్లకు జీరో బిల్లులకు విద్యుత్తు చట్ట ప్రకారం రాయితీ నిధులు ఇస్తామని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తెలిపింది. దీనికి సంబంధించిన వివరణ పత్రాన్ని సోమవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
AP News: అమ్మో.. అన్ని రోజులా?ఖర్చుల భారంపై నేతల తర్జనభర్జన..!
-
Gadchiroli: గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. నలుగురు మావోయిస్టుల హతం
-
మూడు కార్లలో తాయిలాల సరకు దాటిపోయిందా...?!
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు