మాంద్యాన్ని అధిగమించి.. రాష్ట్ర ఐటీ పరిశ్రమ దూకుడు
ఐటీ వృద్ధిరేటులో తెలంగాణ దూసుకెళ్తోంది. కరోనా, ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఐటీ రంగంపై కనిపిస్తున్నా.. తెలంగాణ మాత్రం పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల కార్యకలాపాల విస్తరణతో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల్లో గణనీయ వృద్ధి సాధించింది.
వార్షిక నివేదికలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ఐటీ వృద్ధిరేటులో తెలంగాణ దూసుకెళ్తోంది. కరోనా, ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఐటీ రంగంపై కనిపిస్తున్నా.. తెలంగాణ మాత్రం పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల కార్యకలాపాల విస్తరణతో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల్లో గణనీయ వృద్ధి సాధించింది. ఐటీ పెట్టుబడుల్లో 31.44 శాతం, ఉద్యోగాల్లో 16.2 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. 2022-23 సంవత్సరానికి దేశంలో కొత్తగా వచ్చిన ఉద్యోగాల్లో 44 శాతం తెలంగాణకే వచ్చాయి. 2013-14లో ఐటీ ఎగుమతుల మొత్తం రూ.57,258 కోట్లు ఉండగా 2022-23లో పెరిగిన ఎగుమతుల విలువే రూ.57,706 కోట్లుగా ఉంది. 2022-23 నాటికి తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ రూ.2,41,275 కోట్లకు, ఉద్యోగాల సంఖ్య 9,05,715కి చేరింది. తెలంగాణ 2021-26 ఐటీ విధానం ముగిసే నాటికి రూ.3 లక్షల కోట్ల ఎగుమతులు, 10 లక్షల ఐటీ ఉద్యోగాల సాధనను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రెండేళ్ల ముందుగానే ఈ లక్ష్యాన్ని అధిగమించాలని ప్రభుత్వం భావిస్తోంది.
నివేదికలో ప్రధాన అంశాలు...
* తొమ్మిదేళ్ల క్రితంతో పోల్చితే ఐటీ ఎగుమతులు నాలుగింతలు పెరిగాయి. కొత్తగా 5,82,319 ఉద్యోగాలు రావడంతో ఐటీ ఉద్యోగాలు దాదాపు మూడింతలయ్యాయి.
* తెలంగాణలో తొమ్మిదేళ్లలో ఐటీ ఎగుమతుల వృద్ధిరేటు (సీఏజీఆర్-కాంపౌండ్ యాన్యుల్ గ్రోత్ రేట్) 17.31 శాతంగా ఉంది.
* దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగాల్లో 2022లో తెలంగాణ వాటా 33 శాతం ఉండగా.. 2023 నాటికి 44 శాతానికి చేరింది. జాతీయ ఐటీ ఎగుమతుల్లో వృద్ధిరేటు 9.36 శాతమే ఉంది.
* గడిచిన ఏడాదిలో టీహబ్ 75 హెచ్ఎన్ఐల(హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్) నుంచి 8.5 మిలియన్ డాలర్ల సీడ్ క్యాపిటల్ను సమీకరించింది. 39 స్టార్టప్లకు నిరంతర సమాచార అవగాహన, స్టార్టప్లతో అనుసంధానం, కార్పొరేట్ సంబంధాలు నిర్వహించింది. పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటుతో 100 స్టార్టప్ల అనుసంధానం కోసం సహకారం అందించింది. 2016 నుంచి ఇప్పటివరకు ప్రాంతీయ స్టార్టప్ల సంఖ్య 400 నుంచి 2500కు పెరిగింది. రుబ్రిఎక్స్ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 325 స్టార్టప్ ఆలోచనలు రాగా.. వాటిలో 13 ఎంపికయ్యాయి.
* వీహబ్ 21 స్టార్టప్ కార్యక్రమాలు నిర్వహించి 5,288 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు సహాయం అందించింది. కొత్తగా 2,833 ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఓపెన్హౌస్, గర్ల్స్ ఇన్స్టెమ్, వీఆల్ఫా, జీఐజెడ్, ట్రైకార్, లాంచ్ప్యాడ్, ప్రాజెక్ట్ ఉజాగర్ కార్యక్రమాలతో బాలికలు, మహిళలకు స్టార్టప్లపై అవగాహన కల్పిస్తోంది.
* టీఎస్ఐసీ ద్వారా 100 స్టార్టప్లకు ప్రభుత్వం రూ.2 లక్షల గ్రాంటు మంజూరు చేసింది. యునిసెఫ్తో కలిసి యువత కోసం వైహబ్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది.
* ఇమేజ్ ద్వారా 2 దశల్లో మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు నిర్వహించి 43 స్టార్టప్లను ఎంపిక చేసింది. టీ-వర్క్స్ కేంద్రం ప్రారంభమైంది. రోబోటిక్ విధానం సిద్ధమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
Bapatla: రహదారిపై యుద్ధవిమానాల ల్యాండింగ్
బాపట్ల జిల్లా మీదుగా వెళ్లే 16వ నంబరు జాతీయ రహదారిపై వైమానిక దళం విన్యాసాలు చేపట్టింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అత్యవసర సమయాల్లో రహదారిపైనే ఉన్న రన్వేపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేసే సామర్థ్యాన్ని మదింపు చేశారు. -
తెలంగాణ సొమ్ము దిల్లీకి
భారాస, కాంగ్రెస్ల బంధాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాళేశ్వరం కుంభకోణంలో కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియదు? మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలేదు. -
గవర్నర్ తమిళిసై రాజీనామా
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) పదవికి సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సోమవారం పంపించారు. -
దాతలూ స్పందించండి.. ఈ చిన్నారిని ఆదుకోండి
నిరుపేద తల్లిదండ్రులకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఏడాది వయస్సున్న కుమారుడి తలకు ఏర్పడిన భారీ కణితి ప్రాణాంతకంగా మారింది. తల్లిదండ్రులు అప్పులు చేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడుసార్లు శస్త్రచికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. -
ఆప్ నేతలకు రూ.100 కోట్ల చెల్లింపులో కవిత పాత్ర
దిల్లీ మద్యం విధానంలో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా భారాస ఎమ్మెల్సీ కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్పాల్, జస్టిస్ మౌసమీ భట్టాచార్య
-
రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్లేవారు.. పత్రాలను వెంట ఉంచుకోవాలి
-
సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్లు
రాష్ట్రంలో సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో సోమవారం వడగళ్లవాన పడింది. రాజన్న సిరిసిల్ల మండలంలో విద్యుత్ స్తంభం కూలిన ఘటనలో ఓ రైతు మరణించారు. -
రూ.లక్షలు పెట్టు.. ఫ్యాన్సీ నంబరు పట్టు!
రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసులు కురిపిస్తున్నాయి. రూ.లక్షలు పెట్టి అయినా.. వాటిని దక్కించుకునేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. -
కవిత పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
దిల్లీ మద్యం కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన సమన్లను సవాల్ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కె.కవిత గత ఏడాది మార్చి 15న దాఖలు చేసిన రిట్ పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. -
తల్లీ వందనం.. తపనకు అభినందనం
దివ్యాంగుడైన కుమారుడిని పదోతరగతి పరీక్ష రాయించడానికి తల్లి పడుతున్న తపన స్ఫూర్తిదాయకం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి(బి)కి చెందిన చరణ్కు పోలియోతో కాళ్లు చచ్చుబడగా, చేతుల కదలికలూ పరిమితంగానే ఉన్నాయి. -
యాదగిరీశుడి కల్యాణ వైభోగం
యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. గజ వాహనంపై నారసింహుడు, పల్లకినెక్కి అమ్మ లక్ష్మీదేవి.. మండపానికి చేరుకోగా, పూజారులు ఎదుర్కొని కల్యాణ తతంగాలను చేపట్టారు. -
బోరుతోనే ఊరికి పేరు.. 40 ఏళ్లుగా ఇంకని తీరు
ఆదిలాబాద్ గ్రామీణ మండలం తిప్ప పంచాయతీ పరిధిలోని బోరింగ్గూడ గ్రామంలో ఉన్న చేతిపంపు నుంచి నిరంతరం నీరు ఉబికివస్తోంది. గ్రామంలో 40 ఏళ్ల క్రితం బోరు వేసి.. ఈ చేతిపంపు ఏర్పాటు వేశారు. దీని కారణంగానే గ్రామానికి బోరింగ్గూడ అని పేరొచ్చిందని తిప్ప మాజీ సర్పంచి కిషన్ తెలిపారు. -
ఎల్లక్కపేట దసిలిపట్టు గుడ్డు.. దేశంలోనే వెరీగుడ్
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట సమీపంలోని దసిలిపట్టు గుడ్ల తయారీ కేంద్రం దేశంలోనే నంబర్వన్గా నిలిచింది. ఐదేళ్ల నుంచి ఏటా సుమారు 2.80 లక్షలకుపైగా ఈ గుడ్లు ఉత్పత్తి చేస్తుండగా.. ఈ ఏడాది(ఫిబ్రవరితో గుడ్ల తయారీ ముగుస్తుంది) 3.27 లక్షలతో అగ్రస్థానాన్ని పొందింది. -
ఎన్నికల తర్వాతే వీసీల నియామకాలు
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతుల నియామక ప్రక్రియ లోక్సభ ఎన్నికల తర్వాతే చేపట్టనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయింది. -
TS News: భర్తీ చేస్తున్నా.. భారీగా ఖాళీలు
ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు విశేష ప్రతిభతో రెండు, మూడు, నాలుగు, అయిదేసి పోస్టులకు ఎంపికవడం మిగిలిన వారికి అశనిపాతంగా మారుతోంది. -
గొత్తికోయల ఆక్రమణలో 26 వేల ఎకరాలు
గొత్తికోయలు రాష్ట్రంలో 26 వేల ఎకరాల అటవీ ప్రాంతాల్ని ఆక్రమించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ వివరాల్ని కొద్దిరోజుల క్రితం నిర్వహించిన సమీక్షలో ఆ శాఖ మంత్రి కొండా సురేఖకు నివేదించారు. -
‘స్టేట్మెంట్’ దాఖలు విషయంలో అనిశ్చితి!
తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి విచారణ చేపట్టిన కృష్ణా ట్రైబ్యునల్-2 వద్ద రెండు రాష్ట్రాలూ దాఖలు చేయాల్సిన ‘స్టేట్మెంట్ ఆఫ్ కేస్’ విషయమై అనిశ్చితి నెలకొంది. ఈ నెల 20వ తేదీన దాఖలు చేయడానికి కేడబ్ల్యూడీటీ-2 రెండు రాష్ట్రాలకూ గడువు ఇచ్చింది. -
20 నుంచి మళ్లీ అయ్యర్ కమిటీ పర్యటన
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల్లో లోటుపాట్లపై పరిశీలనకు నియమించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్.డి.ఎస్.ఎ.) నిపుణుల కమిటీ ఈనెల 20న హైదరాబాద్కు రానుంది. -
ప్రభుత్వ ఆదేశాలనే అమలు చేస్తున్నాం
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగించే ఇళ్లకు జీరో బిల్లులకు విద్యుత్తు చట్ట ప్రకారం రాయితీ నిధులు ఇస్తామని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తెలిపింది. దీనికి సంబంధించిన వివరణ పత్రాన్ని సోమవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
IPL: హామీ ఇస్తున్నా.. అప్పటిలోపు కేకేఆర్ను బెటర్ పొజిషన్లో ఉంచుతా: గంభీర్
-
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
-
AP News: ఈ ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెప్తాం: మందకృష్ణ మాదిగ
-
Harish Rao: ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ఇవ్వాలి: హరీశ్రావు
-
TCS: టీసీఎస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో వేతన పెంపు!
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే