మాంద్యాన్ని అధిగమించి.. రాష్ట్ర ఐటీ పరిశ్రమ దూకుడు
ఐటీ వృద్ధిరేటులో తెలంగాణ దూసుకెళ్తోంది. కరోనా, ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఐటీ రంగంపై కనిపిస్తున్నా.. తెలంగాణ మాత్రం పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల కార్యకలాపాల విస్తరణతో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల్లో గణనీయ వృద్ధి సాధించింది.
వార్షిక నివేదికలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ఐటీ వృద్ధిరేటులో తెలంగాణ దూసుకెళ్తోంది. కరోనా, ప్రపంచ ఆర్థిక మాంద్యం పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఐటీ రంగంపై కనిపిస్తున్నా.. తెలంగాణ మాత్రం పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల కార్యకలాపాల విస్తరణతో ఐటీ ఎగుమతులు, ఉద్యోగాల్లో గణనీయ వృద్ధి సాధించింది. ఐటీ పెట్టుబడుల్లో 31.44 శాతం, ఉద్యోగాల్లో 16.2 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. 2022-23 సంవత్సరానికి దేశంలో కొత్తగా వచ్చిన ఉద్యోగాల్లో 44 శాతం తెలంగాణకే వచ్చాయి. 2013-14లో ఐటీ ఎగుమతుల మొత్తం రూ.57,258 కోట్లు ఉండగా 2022-23లో పెరిగిన ఎగుమతుల విలువే రూ.57,706 కోట్లుగా ఉంది. 2022-23 నాటికి తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ రూ.2,41,275 కోట్లకు, ఉద్యోగాల సంఖ్య 9,05,715కి చేరింది. తెలంగాణ 2021-26 ఐటీ విధానం ముగిసే నాటికి రూ.3 లక్షల కోట్ల ఎగుమతులు, 10 లక్షల ఐటీ ఉద్యోగాల సాధనను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రెండేళ్ల ముందుగానే ఈ లక్ష్యాన్ని అధిగమించాలని ప్రభుత్వం భావిస్తోంది.
నివేదికలో ప్రధాన అంశాలు...
* తొమ్మిదేళ్ల క్రితంతో పోల్చితే ఐటీ ఎగుమతులు నాలుగింతలు పెరిగాయి. కొత్తగా 5,82,319 ఉద్యోగాలు రావడంతో ఐటీ ఉద్యోగాలు దాదాపు మూడింతలయ్యాయి.
* తెలంగాణలో తొమ్మిదేళ్లలో ఐటీ ఎగుమతుల వృద్ధిరేటు (సీఏజీఆర్-కాంపౌండ్ యాన్యుల్ గ్రోత్ రేట్) 17.31 శాతంగా ఉంది.
* దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగాల్లో 2022లో తెలంగాణ వాటా 33 శాతం ఉండగా.. 2023 నాటికి 44 శాతానికి చేరింది. జాతీయ ఐటీ ఎగుమతుల్లో వృద్ధిరేటు 9.36 శాతమే ఉంది.
* గడిచిన ఏడాదిలో టీహబ్ 75 హెచ్ఎన్ఐల(హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్) నుంచి 8.5 మిలియన్ డాలర్ల సీడ్ క్యాపిటల్ను సమీకరించింది. 39 స్టార్టప్లకు నిరంతర సమాచార అవగాహన, స్టార్టప్లతో అనుసంధానం, కార్పొరేట్ సంబంధాలు నిర్వహించింది. పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటుతో 100 స్టార్టప్ల అనుసంధానం కోసం సహకారం అందించింది. 2016 నుంచి ఇప్పటివరకు ప్రాంతీయ స్టార్టప్ల సంఖ్య 400 నుంచి 2500కు పెరిగింది. రుబ్రిఎక్స్ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 325 స్టార్టప్ ఆలోచనలు రాగా.. వాటిలో 13 ఎంపికయ్యాయి.
* వీహబ్ 21 స్టార్టప్ కార్యక్రమాలు నిర్వహించి 5,288 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు సహాయం అందించింది. కొత్తగా 2,833 ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఓపెన్హౌస్, గర్ల్స్ ఇన్స్టెమ్, వీఆల్ఫా, జీఐజెడ్, ట్రైకార్, లాంచ్ప్యాడ్, ప్రాజెక్ట్ ఉజాగర్ కార్యక్రమాలతో బాలికలు, మహిళలకు స్టార్టప్లపై అవగాహన కల్పిస్తోంది.
* టీఎస్ఐసీ ద్వారా 100 స్టార్టప్లకు ప్రభుత్వం రూ.2 లక్షల గ్రాంటు మంజూరు చేసింది. యునిసెఫ్తో కలిసి యువత కోసం వైహబ్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది.
* ఇమేజ్ ద్వారా 2 దశల్లో మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు నిర్వహించి 43 స్టార్టప్లను ఎంపిక చేసింది. టీ-వర్క్స్ కేంద్రం ప్రారంభమైంది. రోబోటిక్ విధానం సిద్ధమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం