ఎన్ఐఆర్ఎఫ్ జాబితాలో... తెలంగాణకు మిశ్రమ ర్యాంకులు
కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన 8వ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు తమ సత్తా చాటలేకపోయాయి.
5 విభాగాల్లో టాప్-10లో హైదరాబాద్లోని కేంద్ర విద్యా సంస్థలు
రాష్ట్ర విద్యాసంస్థలకు దక్కని చోటు
ఏపీ నుంచి ఒక్కటీ కనిపించని వైనం
ఈనాడు, దిల్లీ, హైదరాబాద్: కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన 8వ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు తమ సత్తా చాటలేకపోయాయి. 2023 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన ర్యాంకుల్లో టాప్ 10లో తెలంగాణ విద్యాసంస్థలు కనిపించినా, ఏపీ ఆనవాళ్లు అసలే లేవు. మొత్తం 13 విభాగాల్లో... వ్యవస్థాగతంగా అయిదు(ఓవరాల్, కాలేజెస్, యూనివర్సిటీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, ఇన్నోవేషన్)... సబ్జెక్టుల వారీగా ఎనిమిది(ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, లా, మెడికల్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, డెంటల్, అగ్రికల్చర్ అండ్ అలైడ్) ర్యాంకులు కట్టబెట్టారు. వీటిలోని 5విభాగాల్లో తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు టాప్-10లో నిలిచాయి. వాటిలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(యూనివర్సిటీల కేటగిరీలో 10వ ర్యాంకు), హైదరాబాద్ నైపర్ (ఫార్మసీ విభాగంలో 1వ ర్యాంకు), హైదరాబాద్ ఐఐటీ (ఇంజినీరింగ్ విభాగంలో 8, ఇన్నోవేషన్ విభాగంలో 3వ ర్యాంకు), హైదరాబాద్ నల్సార్ (లా విభాగంలో 3వ ర్యాంకు) ఉన్నాయి. దేశంలోని విద్యా సంస్థల ప్రతిభను కొలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి ర్యాంకులిస్తోంది. తొలి పోటీలో 3,565 విద్యాసంస్థలు పాల్గొనగా 2023 నాటికి వాటి సంఖ్య 8,686కి పెరిగింది. ఇందులో ఓవరాల్ టాప్-10 ర్యాంకుల్లో ఐఐటీలు ఏడు, దిల్లీ ఎయిమ్స్, దిల్లీ జేఎన్యూ, బెంగళూరు ఐఐఎస్సీ ఒక్కో ర్యాంకు చేజిక్కించుకున్నాయి. ఇంజినీరింగ్ విభాగంలోనూ ఐఐటీలు ఎనిమిది ర్యాంకులు గెలుచుకున్నాయి. మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎంలు 8, ఎక్స్ఎల్ఆర్ఐ, ముంబయి ఎన్ఐఐటీ ఒక్కో ర్యాంకును కైవసం చేసుకున్నాయి. కాలేజీ విభాగంలో టాప్10లో అయిదు ర్యాంకులను దిల్లీలోని విద్యాసంస్థలు చేజిక్కించుకున్నాయి. అగ్రికల్చర్ అండ్ అల్లాయిడ్ విభాగంలో... ది ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దిల్లీ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. ఓవరాల్ విభాగంలో మద్రాస్ ఐఐటీ వరుసగా అయిదేళ్లుగా తొలి స్థానంలోనే ఉంటోంది.
తగ్గిన తెలంగాణ విద్యా సంస్థల వాసి...
ప్రతి లక్ష మంది జనాభాకు 50 కళాశాలలతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ... ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో సత్తా చాటలేకపోతోంది. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో మూడు ఈసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. కానీ... రాష్ట్ర పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల ర్యాంకింగ్ పెరగకపోగా నిరుటికంటే మరింత పడిపోవడం గమనార్హం. ట్రిపుల్ఐటీ మాత్రం టాప్-100 వర్సిటీల్లో చోటు దక్కించుకుంది. ఆ సంస్థ ఇంజినీరింగ్ విభాగంలోనూ 62 నుంచి 55కి చేరుకుంది. తొలిసారిగా హెచ్సీయూలోని ఇంజినీరింగ్ కళాశాల 71వ స్థానంలో నిలిచింది. మరోవైపు ఇంజినీరింగ్ విభాగంలో ఎస్ఆర్ వర్సిటీ తప్ప మరో ప్రైవేట్ సంస్థ స్థానం సంపాదించలేకపోయింది. ఫార్మసీ కళాశాలలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. నైపర్ను మినహాయిస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వ, మూడు ప్రైవేట్ విద్యాసంస్థలు టాప్-100లో స్థానాన్ని పొందాయి. ఈ తీరుపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి మాట్లాడుతూ... మరిన్ని రాష్ట్ర విద్యాసంస్థలు టాప్-100లో చేరేందుకు ప్రణాళిక రూపొందించుకొని, ముందుకెళతామన్నారు.
100 విద్యా సంస్థలు... 1.42 లక్షల పరిశోధనా పత్రాలు
వాటిలో 53% ఐఐటీలు, ఎన్ఐటీల నుంచే
ఈనాడు, హైదరాబాద్: దేశంలో ఇంజినీరింగ్ రంగంలో కేవలం ఒక్క ఏడాదిలో ప్రచురితమయ్యే పరిశోధనా పత్రాల్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో తొలి 100 స్థానాల్లో నిలిచిన విద్యాసంస్థల నుంచే 62.95% ప్రచురితమమయ్యాయి. వాటిలోనూ 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు... 54 సంస్థల నుంచే 53% రావడం విశేషం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కోసం దేశవ్యాప్తంగా 1238 విద్యాసంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటి నుంచి మొత్తం 2,26,506 రీసెర్చ్ పబ్లికేషన్లు ఆయా జర్నళ్లలో ప్రచురితమయ్యాయి. అందులో 1,42,588 పత్రాలు టాప్-100 సంస్థల నుంచే వచ్చాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ల సందర్భంగా కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. వాస్తవానికి దేశంలో మొత్తం 3,600 వరకు ఇంజినీరింగ్ విద్యాసంస్థలు ఉండగా...అందులో 1,238 మాత్రమే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కు దరఖాస్తు చేశాయి. టాప్-100 మినహా మిగిలిన 1138 విద్యాసంస్థల అధ్యాపకులు/ఆచార్యుల నుంచి 83,918 పత్రాలు(37.05 శాతం) ప్రచురితమయ్యాయి.
44.51% మందికే పీహెచ్డీ
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న 1238 ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో మొత్తం 1,61,195 మంది బోధనా సిబ్బంది ఉండగా అందులో 71,745 మంది(44.51%) పీహెచ్డీ విద్యార్హత కలిగి ఉన్నారు. మిగిలిన 89,450 మందికి పీజీ డిగ్రీ ఉంది. టాప్-100 విద్యాసంస్థల్లో 33,891 మంది పనిచేస్తుండగా వారిలో 27,247 మంది(81.20%)కి పీహెచ్డీ పట్టా ఉంది. మిగిలిన 1138 ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో 1,27,296 మంది అధ్యాపకులు ఉంటే... వారిలో 44,479 మందే(34.94%) పీహెచ్డీ కలిగి ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!