Yadadri: యాదాద్రిలో భక్తులకు బ్యాటరీ వాహన సేవలు

యాదాద్రిలో భక్తుల సౌకర్యార్థం బ్యాటరీతో నడిచే వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తరఫున స్థానిక బ్రాంచ్‌ మేనేజర్‌ సోమవారం మూడు బ్యాటరీ వాహనాలను ఆలయ ఈవో గీతకు విరాళంగా అందజేశారు. 

Updated : 06 Jun 2023 07:32 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రిలో భక్తుల సౌకర్యార్థం బ్యాటరీతో నడిచే వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తరఫున స్థానిక బ్రాంచ్‌ మేనేజర్‌ సోమవారం మూడు బ్యాటరీ వాహనాలను ఆలయ ఈవో గీతకు విరాళంగా అందజేశారు.  ఈ వాహనాలకు పూజలు నిర్వహించిన అనంతరం  ఈవో మాడవీధుల్లో ప్రయాణించారు. ఆలయ సన్నిధి పడమటి దిశలోని మహారాజగోపురం చెంత నుంచి శివాలయం మెట్లదారి వరకు భక్తులకు ఈ వాహన సదుపాయం కల్పిస్తామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని