TSLPRB: తప్పులు సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం
పోలీసుశాఖలో ఉద్యోగాలకు పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు.
పోలీసు ఉద్యోగార్థులకు నియామక మండలి నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: పోలీసుశాఖలో ఉద్యోగాలకు పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ సదుపాయం ఈనెల 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం 0.38 శాతం మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారన్నారు. పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల కోసం నియామక మండలి నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఇటీవల తుది ఫలితాలు వెల్లడయిన సంగతి తెలిసిందే. దీంతో నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కటాఫ్ మార్కులు ప్రకటించడమే తరువాయి. ఈ దశలో అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఏవైనా తప్పులు దొర్లి ఉంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు. ఈ తప్పులను మూడు రకాలుగా విభజించారు. ‘ఎ’ కేటగిరీ తప్పులను నియామక మండలి ఉద్యోగుల సమక్షంలో మాత్రమే సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. ఇందులో అభ్యర్థి పేరు, జెండర్, కులం, స్థానికత, ఫొటో, సంతకం, వయసు వెసులుబాటు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, క్రీడలకు సంబంధించిన రిజర్వేషన్ పొందడం వంటి అంశాలు ఉంటాయి.
‘బి’ కేటగిరీ తప్పులను ధ్రువపత్రాల పరిశీలన సమయంలో సంబంధిత ఎస్పీ, కమిషనర్ల సమక్షంలో సరిదిద్దుకోవచ్చు. అభ్యర్థి ఇంటిపేరు, ఆధార్ నంబరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ వంటివి ఈ తరగతిలో ఉంటాయి. ఇక అభ్యర్థి లాగిన్ ఐడీ వంటివి ‘సి’ కేటగిరీ కిందికి వస్తాయని, వీటిని ఇప్పుడు సరిదిద్దుకోవడం సాధ్యంకాదని ఈ ప్రకటనలో వెల్లడించారు. ‘ఎ’ తరగతి తప్పులకైతే ఎస్సీఎస్టీలు రూ.3 వేలు, ఇతరులు రూ.5 వేలు, ‘బి’ కేటగిరి తప్పులకైతే ఎస్సీఎస్టీలు రూ.2వేలు, ఇతరులు రూ.3వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. తమ దరఖాస్తు సరిదిద్దుకోవాల్సిన అభ్యర్థులు వారికి కేటాయించిన లాగిన్ ఐడీ ద్వారా నిర్ణీత తేదీల్లో ఈ సదుపాయం వినియోగించుకోవాలని, కేటగిరీని బట్టి ఫీజు చెల్లిస్తే నియామక మండలి సిద్ధం చేసిన టెంప్లెంట్ కనిపిస్తుందని, దాన్ని పూర్తి చేసి సబ్మిట్ చేయగానే మరో పత్రం వస్తుందని, దాన్ని ప్రింట్ తీసుకొని ధ్రువపత్రాల పరిశీలన సమయంలో తమ వెంట తీసుకొని రావాల్సి ఉంటుందన్నారు. రెండు కేటగిరీల్లో తప్పులు సరిదిద్దుకోవాలంటే రెండింటికీ సంబంధించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుందని శ్రీనివాసరావు వివరించారు. తప్పులు దొర్లినట్లు భావిస్తున్న వాటికి సంబంధించిన ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాల్సి ఉంటుందని, దీనికి సంబంధించిన తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
అలానే కుల ధ్రువీకరణ పత్రం 2014 జూన్ 2, నాన్ క్రీమీలేయర్ పత్రం 2021 ఏప్రిల్ 1, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ధ్రువపత్రం కూడా 2021 ఏప్రిల్1 తర్వాత జారీ చేసి ఉన్నవాటిని మాత్రమే అనుమతిస్తామన్నారు.నియామక మండలి నిర్వహించిన అన్ని పరీక్షల్లో రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్లకు సంబంధించి 0.38 వినతులు మాత్రమే వచ్చాయన్నారు. అన్ని పరీక్షలకు కలిపి మొత్తం 3,55,387 జవాబు పత్రాలు ఉండగా వాటిలో కేవలం 1338 జవాబు పత్రాలకు సంబంధించి మాత్రమే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ల దరఖాస్తులు వచ్చాయని నియామక మండలి ఛైర్మన్ తెలిపారు. వ్యాసరూప సమాధానాలకైతే కేవలం జవాబుపత్రంలో వేసిన మార్కులను లెక్కిస్తామని, ఓఎమ్మార్ షీట్లో అయితే తప్పులు, ఒప్పులు, ఖాళీగా వదిలేసిన వాటిని పరిశీలించి, అభ్యర్థికి సమంజసమైన మార్కులే వచ్చాయా అన్నది పరిశీలిస్తారని శ్రీనివాసరావు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
Bapatla: రహదారిపై యుద్ధవిమానాల ల్యాండింగ్
బాపట్ల జిల్లా మీదుగా వెళ్లే 16వ నంబరు జాతీయ రహదారిపై వైమానిక దళం విన్యాసాలు చేపట్టింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అత్యవసర సమయాల్లో రహదారిపైనే ఉన్న రన్వేపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేసే సామర్థ్యాన్ని మదింపు చేశారు. -
తెలంగాణ సొమ్ము దిల్లీకి
భారాస, కాంగ్రెస్ల బంధాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాళేశ్వరం కుంభకోణంలో కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియదు? మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలేదు. -
గవర్నర్ తమిళిసై రాజీనామా
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి ఇన్ఛార్జి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) పదవికి సైతం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సోమవారం పంపించారు. -
దాతలూ స్పందించండి.. ఈ చిన్నారిని ఆదుకోండి
నిరుపేద తల్లిదండ్రులకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఏడాది వయస్సున్న కుమారుడి తలకు ఏర్పడిన భారీ కణితి ప్రాణాంతకంగా మారింది. తల్లిదండ్రులు అప్పులు చేసి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడుసార్లు శస్త్రచికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. -
ఆప్ నేతలకు రూ.100 కోట్ల చెల్లింపులో కవిత పాత్ర
దిల్లీ మద్యం విధానంలో పొందిన ప్రయోజనాలకు ప్రతిఫలంగా భారాస ఎమ్మెల్సీ కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో భాగస్వామి అయ్యారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ సుజయ్పాల్, జస్టిస్ మౌసమీ భట్టాచార్య
-
రూ.50 వేలకు పైగా నగదు తీసుకెళ్లేవారు.. పత్రాలను వెంట ఉంచుకోవాలి
-
సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో వడగళ్లు
రాష్ట్రంలో సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాల్లో సోమవారం వడగళ్లవాన పడింది. రాజన్న సిరిసిల్ల మండలంలో విద్యుత్ స్తంభం కూలిన ఘటనలో ఓ రైతు మరణించారు. -
రూ.లక్షలు పెట్టు.. ఫ్యాన్సీ నంబరు పట్టు!
రాష్ట్రంలో నూతన రిజిస్ట్రేషన్ కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసులు కురిపిస్తున్నాయి. రూ.లక్షలు పెట్టి అయినా.. వాటిని దక్కించుకునేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. -
కవిత పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
దిల్లీ మద్యం కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన సమన్లను సవాల్ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కె.కవిత గత ఏడాది మార్చి 15న దాఖలు చేసిన రిట్ పిటిషన్ మంగళవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. -
తల్లీ వందనం.. తపనకు అభినందనం
దివ్యాంగుడైన కుమారుడిని పదోతరగతి పరీక్ష రాయించడానికి తల్లి పడుతున్న తపన స్ఫూర్తిదాయకం. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం చించోలి(బి)కి చెందిన చరణ్కు పోలియోతో కాళ్లు చచ్చుబడగా, చేతుల కదలికలూ పరిమితంగానే ఉన్నాయి. -
యాదగిరీశుడి కల్యాణ వైభోగం
యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహుల కల్యాణం సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. గజ వాహనంపై నారసింహుడు, పల్లకినెక్కి అమ్మ లక్ష్మీదేవి.. మండపానికి చేరుకోగా, పూజారులు ఎదుర్కొని కల్యాణ తతంగాలను చేపట్టారు. -
బోరుతోనే ఊరికి పేరు.. 40 ఏళ్లుగా ఇంకని తీరు
ఆదిలాబాద్ గ్రామీణ మండలం తిప్ప పంచాయతీ పరిధిలోని బోరింగ్గూడ గ్రామంలో ఉన్న చేతిపంపు నుంచి నిరంతరం నీరు ఉబికివస్తోంది. గ్రామంలో 40 ఏళ్ల క్రితం బోరు వేసి.. ఈ చేతిపంపు ఏర్పాటు వేశారు. దీని కారణంగానే గ్రామానికి బోరింగ్గూడ అని పేరొచ్చిందని తిప్ప మాజీ సర్పంచి కిషన్ తెలిపారు. -
ఎల్లక్కపేట దసిలిపట్టు గుడ్డు.. దేశంలోనే వెరీగుడ్
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఎల్లక్కపేట సమీపంలోని దసిలిపట్టు గుడ్ల తయారీ కేంద్రం దేశంలోనే నంబర్వన్గా నిలిచింది. ఐదేళ్ల నుంచి ఏటా సుమారు 2.80 లక్షలకుపైగా ఈ గుడ్లు ఉత్పత్తి చేస్తుండగా.. ఈ ఏడాది(ఫిబ్రవరితో గుడ్ల తయారీ ముగుస్తుంది) 3.27 లక్షలతో అగ్రస్థానాన్ని పొందింది. -
ఎన్నికల తర్వాతే వీసీల నియామకాలు
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతుల నియామక ప్రక్రియ లోక్సభ ఎన్నికల తర్వాతే చేపట్టనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయింది. -
భర్తీ చేస్తున్నా.. భారీగా ఖాళీలు
ప్రభుత్వ పోటీ పరీక్షల్లో కొందరు అభ్యర్థులు విశేష ప్రతిభతో రెండు, మూడు, నాలుగు, అయిదేసి పోస్టులకు ఎంపికవడం మిగిలిన వారికి అశనిపాతంగా మారుతోంది. -
గొత్తికోయల ఆక్రమణలో 26 వేల ఎకరాలు
గొత్తికోయలు రాష్ట్రంలో 26 వేల ఎకరాల అటవీ ప్రాంతాల్ని ఆక్రమించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ వివరాల్ని కొద్దిరోజుల క్రితం నిర్వహించిన సమీక్షలో ఆ శాఖ మంత్రి కొండా సురేఖకు నివేదించారు. -
‘స్టేట్మెంట్’ దాఖలు విషయంలో అనిశ్చితి!
తెలంగాణ, ఏపీల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి సంబంధించి విచారణ చేపట్టిన కృష్ణా ట్రైబ్యునల్-2 వద్ద రెండు రాష్ట్రాలూ దాఖలు చేయాల్సిన ‘స్టేట్మెంట్ ఆఫ్ కేస్’ విషయమై అనిశ్చితి నెలకొంది. ఈ నెల 20వ తేదీన దాఖలు చేయడానికి కేడబ్ల్యూడీటీ-2 రెండు రాష్ట్రాలకూ గడువు ఇచ్చింది. -
20 నుంచి మళ్లీ అయ్యర్ కమిటీ పర్యటన
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీల్లో లోటుపాట్లపై పరిశీలనకు నియమించిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్.డి.ఎస్.ఎ.) నిపుణుల కమిటీ ఈనెల 20న హైదరాబాద్కు రానుంది. -
ప్రభుత్వ ఆదేశాలనే అమలు చేస్తున్నాం
గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వినియోగించే ఇళ్లకు జీరో బిల్లులకు విద్యుత్తు చట్ట ప్రకారం రాయితీ నిధులు ఇస్తామని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) తెలిపింది. దీనికి సంబంధించిన వివరణ పత్రాన్ని సోమవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
TS News: తమిళిసై రాజీనామాకు ఆమోదం.. ఝార్ఖండ్ గవర్నర్కు అదనపు బాధ్యతలు
-
Liquor Policy Case: రూ.100కోట్ల చెల్లింపులపై ఈడీ ప్రకటన.. అక్రమంగా ఒక్క రూపాయీ లేదన్న ఆప్
-
POLL: రోహిత్ను కాదని హార్దిక్కు కెప్టెన్సీ... ముంబయి ఇండియన్స్ నిర్ణయం సరైనదేనా?
-
Modi: ‘మీవాళ్లు క్షేమంగా ఉన్నారు..త్వరలో తిరిగొస్తారు’: బల్గేరియా అధ్యక్షుడికి మోదీ రిప్లై
-
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
-
Stock Market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు