రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించాలి
‘చెమట చిందించి, ఎన్నో కష్టాలు అధిగమించి సమాజాన్ని మేల్కొలిపేందుకు కృషి చేసిన ఆచార్య కొలకలూరి ఇనాక్ ఆశయాలను నెరవేర్చేలా రచనలు చేయడం, రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించడమే ఆయనకు మనం ఇవ్వగలిగే అసలైన గురుదక్షిణ’ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు.
కొలకలూరి ఇనాక్కు జీవన సాఫల్య పురస్కారం, స్వర్ణకంకణ ప్రదానోత్సవంలో జస్టిస్ ఎన్.వి.రమణ
నారాయణగూడ, న్యూస్టుడే: ‘చెమట చిందించి, ఎన్నో కష్టాలు అధిగమించి సమాజాన్ని మేల్కొలిపేందుకు కృషి చేసిన ఆచార్య కొలకలూరి ఇనాక్ ఆశయాలను నెరవేర్చేలా రచనలు చేయడం, రాజ్యాంగ స్ఫూర్తిని పెంపొందించడమే ఆయనకు మనం ఇవ్వగలిగే అసలైన గురుదక్షిణ’ అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. సోమవారం రాత్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో యువకళావాహిని ఆధ్వర్యంలో ప్రముఖ సాహితీవేత్త, శ్రీవేంకటేశ్వర వర్సిటీ పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య ఇనాక్కు జీవన సాఫల్య పురస్కారం, స్వర్ణకంకణ ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి అధ్యక్షతన జరిగిన సభలో జస్టిస్ ఎన్.వి.రమణ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘‘కొలకలూరి ఇనాక్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి కూడా కవిసమ్మేళనాల్లో ప్రభుత్వం మీద చురకలు అంటిస్తూ.. సందేశాత్మకమైన అంశాలు ప్రస్తావించేవారు. విశ్వనాథ, శ్రీశ్రీ, సినారె వంటి కవులున్న సందర్భంలో కూడా తన భావాలను నిర్మొహమాటంగా వ్యక్తీకరించేవారు. ఆయన కవి, నవలాకారుడు, నాటక రచయిత, కథా విమర్శకుడు, అనువాదకుడు, పరిశోధకుడు. ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండటం అరుదు. ‘నా అక్షరాలే నా అశ్రువులు’ అని ఆయన అభివర్ణించారంటే దాని వెనకాల ఉన్న ఆర్ద్రత, నిస్పృహ, నిస్సహాయతలను గుర్తించవచ్చు.కేంద్ర, రాష్ట్రాల సాహిత్య అకాడమీ పురస్కారాలు, జ్ఞానపీఠ వారి మూర్తిదేవి అవార్డు, పద్మశ్రీ వంటి ఎన్నెన్నో గౌరవాలు ఆయనకు ఊరికే దక్కలేదు. నిజాయతీగా ఆయన సాగించిన సుదీర్ఘ సాహిత్య తపస్సుకు అవి ఫలాలు’’ అని అన్నారు.
తాను భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు దేశం నలువైపులా పర్యటించి రాజ్యాంగ సంస్కృతి, హక్కుల గురించి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశానన్నారు. దేశంలో భారత రాజ్యాంగ సంస్కృతిని వ్యాప్తిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కేవలం తనలాంటి వారి ప్రసంగాలతో రాజ్యాంగ సంస్కృతిని వ్యాప్తిలోకి తేవడం సాధ్యం కాదని, ఆచార్య ఇనాక్ చూపిన బాటలో సాహితీవేత్తలు, సాంస్కృతిక సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ అధ్యక్షులు సారిపల్లి కొండలరావు ప్రారంభోపన్యాసం చేయగా, ఏపీ శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, విశ్రాంత ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, సాహితీవేత్త వోలేటి పార్వతీశం మాట్లాడారు. నిర్వాహకులు లంక లక్ష్మీనారాయణ స్వాగతం పలికారు. కొలకలూరి ఇనాక్ స్పందించారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పీఠాధిపతి (పరీక్షా విభాగం) ఆచార్య కొలకలూరి మధుజ్యోతి అభినందనలు తెలిపారు. నిర్వహణ కమిటీ సభ్యులు ఎం.ఏహమీద్ వందన సమర్పణ చేశారు. అంతకుముందు స్వర్ణయుగ సినీ సంగీత విభావరి ఆకట్టుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
పాలిటెక్నిక్ లెక్చరర్స్ జీఆర్ఎల్ వెల్లడి
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను (జీఆర్ఎల్) టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీఎంఈ పరిధిలోని.. 16,024 మంది సిబ్బంది సేవల పొడిగింపు
వైద్య విద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సిబ్బంది సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి 4 టీఎంసీలు తరలించిన ఏపీ: తెలంగాణ ఫిర్యాదు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన విద్యుత్ ఉత్పత్తికోసం నిర్మించిన టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. -
ఇచ్చంపల్లి నుంచే కావేరికి.. గోదావరి జలాలు
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపట్టి, అక్కణ్నుంచి కావేరి పరీవాహకానికి నీటిని తరలించాలని దాదాపు నిర్ణయానికొచ్చారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సరిహద్దు గ్రామాల ఓటర్లు!
కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు మధ్య 12 వివాదాస్పద గ్రామాలున్నాయి. -
కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల స్వాధీనం
వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రికార్డు స్థాయిలో వేసవి రైళ్లు
వేసవి కాలంలో పెరిగే రాకపోకలకు అనుగుణంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. -
బతుకమ్మ చీరల బకాయిలు రూ.50 కోట్లు విడుదల
బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. -
నటుడు రఘుబాబు అరెస్టు.. బెయిలు
నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై ఈ నెల 17న నల్గొండ పట్టణ సమీపంలో సినీ నటుడు ఎర్ర రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడు జనార్ధన్రావు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లపై వివరణ ఇవ్వండి
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
గురుకులంలో అల్పాహారం వికటించి 25 మందికి అస్వస్థత
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు