నగరంలో ప్రతి శనివారం రీథింక్ దినం
పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగంలో ఉండటం గర్వకారణమని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ అగ్రగామి
త్వరలో హైదరాబాద్లో వందశాతం మురుగునీటి పునర్వినియోగం
నిధుల ఖర్చు కంటే.. ప్రజల్లో సామాజిక మార్పే ముఖ్యం
ఆస్కీలో రీథింక్, ఎన్విరాన్మెంటల్ సర్వేలెన్స్ లేబొరేటరీలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఖైరతాబాద్, న్యూస్టుడే: పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగంలో ఉండటం గర్వకారణమని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ సంస్థ తెలిపిందన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖైరతాబాద్లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ)లో రీథింక్, ఎన్విరాన్మెంటల్ సర్వేలెన్స్ లేబొరేటరీలను మంత్రి ప్రారంభించారు. వీటి నిర్వహణకు సంబంధించి ఆయన సమక్షంలో ఆస్కీతో ప్రభుత్వ అధికారులు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తొమ్మిదేళ్ల కిందట హైదరాబాద్ నగరం, రాష్ట్ర భవిష్యత్తు, పాలనపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికి దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు. ‘‘ హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా మారాలంటే అనేక అంశాల్లో మరింత పని చేయాల్సి ఉంది. నగర వాసుల్లో ఇల్లు మాత్రమే నాది.. అనే బాధ్యతారాహిత్యం ఉన్నన్ని రోజులు ఎన్ని నిధులు ఖర్చుపెట్టినా ప్రయోజనం ఉండదు. సోఫాలు, పరుపులు, దిండ్లు, కుర్చీల్లాంటి అనేక వస్తువులు నాలాల్లో కనిపిస్తున్నాయి. రెడ్యూజ్, రీసైకిల్, రీయూజ్ అనే ట్రిపుల్ ఆర్ అంశాన్ని ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడే పట్టణాల్లో మార్పు సాధ్యమవుతుంది.
నగరంలో ప్రతి శనివారాన్ని రీథింక్ దినంగా పాటిద్దాం. ఇందుకోసం ఉన్నతాధికారులు సమావేశం ఏర్పాటు చేసి సిబ్బందికి అవసరమైన సూచనలు చేయాలి. హైదరాబాద్లో ఉత్పత్తయ్యే తడిచెత్త ద్వారా ఏటా రూ.200 కోట్లకుపైగా ఆదాయం వస్తోంది. నగరంతోపాటు పలు పురపాలికల్లో చెత్త నుంచి బయోగ్యాస్ తయారీని ప్రారంభించబోతున్నాం. 141 పురపాలికల్లో రూ.178 కోట్లతో బయో మైనింగ్ ప్రారంభించాం. మానవ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లనూ ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో దేశంలో వంద శాతం మురుగునీటి పునరుపయోగించే(రీసైకిల్) నగరంగా హైదరాబాద్ మారబోతోంది. ఆస్కీ ఛైర్మన్ పద్మనాభయ్య మాట్లాడుతూ.. పురపాలకశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ సత్యనారాయణ, జలమండలి ఎండీ దానకిషోర్ ఆయా సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఆస్కీ సెంటర్ డైరెక్టర్ ప్రొ.వి.శ్రీనివాసచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్కుమార్, ఆస్కీ కోర్ట్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ రిచర్డ్ బి.సల్దన్హా, యునిసెఫ్ ఇన్ఛార్జి అధికారి సీమాకుమార్ పాల్గొన్నారు. అతిథులు ఆస్కీ ఆవరణలో మొక్కలు నాటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM