పీవోపీఎస్‌కేలు శనివారమూ పనిచేస్తాయి

పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు(పీవోపీఎస్‌కే) ఈ శనివారం పని చేస్తాయని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 07 Jun 2023 03:15 IST

ఈనాడు, హైదరాబాద్‌: పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు(పీవోపీఎస్‌కే) ఈ శనివారం పని చేస్తాయని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విదేశాంగ మంత్రిత్వశాఖ ఆదేశాలతో గత మూడు శనివారాలు సేవలందించాయని పేర్కొన్నారు. ఈ నెల 10న కూడా పీవోపీఎస్‌కేలు అందుబాటులో ఉంటాయన్నారు. 700 సాధారణ అపాయింట్‌మెంట్లు విడుదల చేస్తుండగా.. ఆ వివరాలు బుధవారం సాయంత్రం వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమవుతాయని వెల్లడించారు. పాస్‌పోర్టు ప్రీపోన్‌మెంట్‌కు ప్రయత్నించేవారు సేవల్ని వినియోగించుకోవచ్చని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని