నీటి వనరులకు నీరాజనం
‘ఒకప్పుడు చుక్కనీటి కోసం అల్లాడిన నేలకు ఇప్పుడు ప్రతినిత్యం జలాభిషేకం’ అంటూ సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు రాష్ట్రంలో మంత్రులు, అధికారులు, రైతులు.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించారు.
అట్టహాసంగా సాగునీటి దినోత్సవం
వివిధ ప్రాజెక్టుల వద్ద పాల్గొన్న ప్రజాప్రతినిధులు
ఈనాడు, హైదరాబాద్: ‘ఒకప్పుడు చుక్కనీటి కోసం అల్లాడిన నేలకు ఇప్పుడు ప్రతినిత్యం జలాభిషేకం’ అంటూ సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు రాష్ట్రంలో మంత్రులు, అధికారులు, రైతులు.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవ కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించారు. అన్ని ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల వద్ద సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు ఏర్పాటు చేసి.. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు వేడుకలు నిర్వహించారు. నీటిపారుదలశాఖ ప్రధాన కార్యాలయంలో మహిళా ఇంజినీర్లు, ఉద్యోగినులు బతుకమ్మ ఆడారు. కాళేశ్వరం, దేవాదుల, శ్రీరామసాగర్, శ్రీరామసాగర్ రెండోదశ, వరదకాలువ, ఎల్లంపల్లి, సీతారామ ఎత్తిపోతల, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఇలా అన్ని ప్రాజెక్టుల వద్ద పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితే సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలమవుతుందని తెలిపారు. సంగమేశ్వర పథకానికి భూములిచ్చిన రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.
* నిజామాబాద్ జిల్లాలోని సిద్దాపూర్ రిజర్వాయర్ వద్ద జరిగిన కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ నాయకులు నీళ్లు లేని చోట కాలువలు తవ్వి కాంట్రాక్టర్ల జేబులు నింపారని, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్లలోనే నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని అన్నారు. ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. గోదావరిలో వృథాగా పోతున్న నీటిని కాళేశ్వరం వద్ద ఒడిసిపట్టి అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా వరద కాలువ మీదుగా ఎస్సారెస్పీ ప్రాజెక్టును నింపుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా.. ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి పథకానికి సంబంధించిన అంశాలను రైతులకు మంత్రి వివరించారు. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ఏ గ్రామంలో చూసినా చెరువుల్లో నిండు కుండల్లా నీళ్లుండడం అద్భుతమన్నారు.
* వనపర్తిలో మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వాగులపై నిర్మించిన చెక్డ్యాములు రైతులకు అక్కరకొచ్చాయని తెలిపారు. 35 ఏళ్ల తర్వాత కృష్ణమ్మ నీళ్లతో గణపసముద్రం అలుగు పారిందని, 24 కిలోమీటర్ల కాలువ 11 నెలల్లో పూర్తి చేశామని తెలిపారు. కీసర మండలంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. సాగు, తాగునీటి గోసను తీర్చిన కేసీఆర్ వెంట ప్రజలు నిలబడాలని కోరారు. నిజామాబాద్లో జరిగిన సాగునీటి దినోత్సవంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ అంటే కాలువలు, చెక్డ్యాములు రిజర్వాయర్లని అభివర్ణించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు.. కాళేశ్వర చంద్రశేఖర్ రావని, దేశానికే గర్వకారణమైన ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరారు.
యావత్ ప్రపంచానికి ఆదర్శం: కేటీఆర్
తెలంగాణ జల విధానం యావత్ ప్రపంచానికే ఆదర్శమని మంత్రి కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో వ్యవసాయరంగం సంక్షోభంలో ఉంటే.. నేడు సాగునీటి రంగంలో స్వర్ణయుగమని, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి అంటే, కేసీఆర్ తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేశారన్నారు.
ఇది తెలంగాణ జలవిజయం: హరీశ్రావు
నాడు ఎటు చూసినా తడారిన నేలలు దర్శనమిస్తే, నేడు ఎటు చూసినా గోదావరి పరవళ్లు తొక్కుతోందని మంత్రి హరీశ్రావు ట్విటర్లో పేర్కొన్నారు. ఇది సీఎం కేసీఆర్ సాధించిన ఘన విజయమన్నారు.
రికార్డు స్థాయిలో జనహారతి
సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో ‘కాళేశ్వరం జలాలకు లక్ష జనహారతి’ పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చివ్వెంల మండల కేంద్రం వద్ద ఆయన కాళేశ్వరం జలాలకు హారతులు పట్టి.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేవలం ఆరువేల క్యూసెక్కుల నీటిని 350 కి.మీ. దూరం పారించడం అసాధ్యమని, మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించడమే సరైనదని ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి రాగానే దాన్ని సాకారం చేసి చూపారని జగదీశ్రెడ్డి అన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ -2 కాల్వ పొడవునా రైతులు, మహిళలు బోనాలు, బతుకమ్మలతో వెళ్లి.. కాళేశ్వర జలాలకు పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి వండర్ వరల్డ్బుక్ రికార్డ్స్లో చోటు దక్కినట్లు నిర్వాహకులు వెల్లడించారు. 126 పంచాయతీల పరిధిలో మొత్తం 107 కెమెరాలు, ఎనిమిది డ్రోన్లు పెట్టి చిత్రీకరించామని.. మొత్తం 68 కి.మీ. పరిధిలో 1,16,142 మంది ప్రజలు పాల్గొన్నట్లు వెల్లడించారు. అవార్డును మంత్రి జగదీశ్రెడ్డి, జిల్లా కలెక్టరు వెంకటరావుకు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.