9 నుంచి వెబ్‌సైట్‌లో శాఖాపరమైన పరీక్షల హాల్‌టికెట్లు

ప్రభుత్వ విభాగాల శాఖాపరమైన పరీక్షలు (మే-2023 సెషన్‌) ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 08 Jun 2023 04:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ విభాగాల శాఖాపరమైన పరీక్షలు (మే-2023 సెషన్‌) ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిస్క్రిప్టివ్‌తో కూడిన సర్వే, లాంగ్వేజీ పరీక్షలు మినహా మిగిలిన ఆబ్జెక్టివ్‌ పరీక్షలను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షల హాల్‌టికెట్లు ఈ నెల 9 నుంచి కమిషన్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని