భారత్‌లో మహిళలకు బైపాస్‌ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!

అభివృద్ధి చెందిన దేశాల్లో.. పురుషులతో పోలిస్తే మహిళల్లో బైపాస్‌ సర్జరీ అనంతర ముప్పు 2-3 శాతం ఎక్కువ ఉంటోందని, భారత్‌లో పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ ఈ  ముప్పు ఒక శాతంలోపేనని తాజా అధ్యయనం చెబుతోంది.

Updated : 09 Jun 2023 03:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: అభివృద్ధి చెందిన దేశాల్లో.. పురుషులతో పోలిస్తే మహిళల్లో బైపాస్‌ సర్జరీ అనంతర ముప్పు 2-3 శాతం ఎక్కువ ఉంటోందని, భారత్‌లో పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ ఈ  ముప్పు ఒక శాతంలోపేనని తాజా అధ్యయనం చెబుతోంది. సొసైటీ ఆఫ్‌ కరోనరీ సర్జన్‌ అధ్యక్షులు, స్టార్‌ ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ లోకేశ్వరరావు సజ్జా తమ బృందంతో కలిసి ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ ఫలితాలు ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ థొరాసిక్‌ అండ్‌ కార్డియో వాస్క్యులర్‌ సర్జరీ సంచికలో ప్రచురితమయ్యాయి. 14 వేల బైపాస్‌ సర్జరీలను వీరు పరిశీలించారు. అందులో 1825 మంది మహిళలు ఉన్నారు. ఈ డేటా ఆధారంగా శస్త్రచికిత్సల అనంతర ముప్పు శాతాన్ని అధ్యయనం చేశారు. భారత మహిళల్లో బైపాస్‌ శస్త్రచికిత్స తర్వాత ముప్పు.. విదేశీ మహిళలతో పోలిస్తే తక్కువని నిర్ధారణకు వచ్చారు. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల మార్పు, ఊబకాయం తదితర సమస్యలతో భారత్‌లోనూ మున్ముందు ఈ సమస్య పెరిగే అవకాశం ఉందని వివరించారు. ‘హృదయ సమస్యల బారిన పడుతున్న పురుషుల సరాసరి వయసు 58.5 ఏళ్లు ఉండగా.. మహిళల్లో ఈ సరాసరి వయసు 59.5 ఏళ్లుగా ఉంది’ అని డాక్టర్‌ సజ్జా వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని