బడిబాట సరే.. బోధించే వారేరి?
రాష్ట్రంలో పాఠశాలలు ఈ నెల 12న పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు కోసం విద్యాశాఖ ఈ నెల 3వ తేదీ నుంచి ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
సర్కారు బడుల్లో 15 వేల వరకు ఉపాధ్యాయ ఖాళీలు
అయినా విద్యాశాఖ మౌనం
12న ప్రారంభం కానున్న పాఠశాలలు
ఈనాడు - హైదరాబాద్
* జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ధోనూర్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు- మన బడి పథకం కింద డ్యూయల్ డెస్కులు, గ్రీన్ బోర్డులు సహా అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. ఇక్కడ 101 మంది విద్యార్థులు ఉండగా ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం పిల్లల సంఖ్య ఆధారంగా నలుగురు ఉపాధ్యాయులు ఉండాలి.
* కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సవరాన్ ఉన్నత పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో 130 మంది, ఆంగ్ల మాధ్యమంలో 200 మంది విద్యార్థులున్నారు. ఇంగ్లిష్, సోషల్ సబ్జెక్టులకు ఇద్దరు చొప్పున ఉండాల్సి ఉండగా ఒక్కొక్కరే ఉన్నారు.ఇక్కడ రూ.57 లక్షలతో మన ఊరు-మన బడి పనులు జరుగుతున్నాయి.
రాష్ట్రంలో పాఠశాలలు ఈ నెల 12న పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు కోసం విద్యాశాఖ ఈ నెల 3వ తేదీ నుంచి ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మన ఊరు- మన బడి కార్యక్రమం కింద తొలి విడతలో రూ.3,497 కోట్లతో 9,145 పాఠశాలల్లో వసతులు కల్పిస్తుండటం, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, యూనిఫాం పంపిణీ, పాఠ్యపుస్తకాలతోపాటు ఈసారి 6-10 తరగతుల విద్యార్థులకు నోటు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తుండటం వంటి అంశాలను బడిబాటలో ఇంటింటా ప్రచారం చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. అంతా బాగానే ఉన్నా ఉపాధ్యాయుల కొరత నేపథ్యంలో విద్యాశాఖ సిబ్బంది గ్రామాల్లో తిరిగేందుకు తటపటాయిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఈ విషయాన్ని గ్రామస్థులు ప్రస్తావిస్తుండటంతో సమాధానం చెప్పలేక వెనుదిరుగుతున్న పరిస్థితీ ఉందని ఉపాధ్యాయులే చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26,074 ప్రభుత్వ పాఠశాలల్లో 15 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం 2022 మార్చిలోనే విద్యాశాఖలో 13 వేల ఖాళీలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించింది. అందులో 10 వేల వరకు ఉపాధ్యాయ ఖాళీలే ఉన్నాయి. ఆ ఖాళీల భర్తీ కోసమే 2022 జూన్లో టెట్ నిర్వహించింది. ఏడాది గడిచినా కనీసం ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కనీసం ఆర్థిక శాఖ నుంచి ఖాళీల భర్తీకి అనుమతి కూడా పొందలేదు.
విద్యావాలంటీర్లూ లేరు
2020 మార్చి వరకు సర్కారు బడుల్లో 12 వేల మంది విద్యా వాలంటీర్లు పనిచేసేవారు. ఖాళీలు ఉన్న చోట అధికారులు వారి సేవలు వినియోగించుకునేవారు. గత మూడేళ్ల నుంచి వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోదు. అర్హులైన టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వకుండా, విద్యా వాలంటీర్లు లేకుండా సబ్జెక్టు నిపుణుల కొరత ఎలా తీరుతుందని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నా ఫలితం లేకపోయింది. పైపెచ్చు ఒక సబ్జెక్టు నిపుణుడైన ఉపాధ్యాయునితో మరో సబ్జెక్టు చెప్పించడం, ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే వారిని హైస్కూళ్లకు డిప్యుటేషన్పై పంపి బోధించడం... తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉన్నా ఒకే టీచర్తో పాఠాలు చెప్పించడం...ఇలా విద్యాశాఖ ప్రయోగాలు చేస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో టీచర్లు లేకుండా ఎలా చదువు వస్తుందని బడిబాటలో తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారని పలువురు ఉపాధ్యాయులు ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
ఏకోపాధ్యాయ బడులు 6,392
రాష్ట్రవ్యాప్తంగా 6,392 ప్రాథమిక పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడే పనిచేస్తున్నారు. వారు సెలవు పెడితే చాలాచోట్ల బడికి సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి. కనీసం ఇద్దరు టీచర్లనైనా ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు ఎప్పట్నుంచో ఏకరవు పెడుతున్నాయి. ఇక శౌచాలయాలను శుభ్రం చేయడానికి, తరగతి గదులను ఊడ్చడానికి స్వచ్ఛ కార్మికులు లేరు.
టీచర్లు లేకుండా పాఠాలు చెప్పేదెలా..
- కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి, టీఆర్టీఎఫ్
బడుల్లో వసతులను మెరుగుపరిచేందుకు తొలి విడతలో రూ.3,500 కోట్లు ఖర్చు చేస్తుండటం శుభపరిణామం. అంత చేసినా ఉపాధ్యాయులు లేకుండా పాఠాలు చెప్పేదెవరు? తల్లిదండ్రులు అదే విషయంపై ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి? తాత్కాలికంగా కనీసం 10 వేల మంది విద్యా వాలంటీర్లను నియమిస్తే బోధన గాడిన పడుతుంది. అందుకు రూ.150 కోట్లు ఖర్చు చేస్తే చాలు. ఆ దిశగా విద్యాశాఖ త్వరగా నిర్ణయం తీసుకోవాలి. అదే సమయంలో కొత్త నియామకాల నోటిఫికేషన్ జారీ చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్