డేటా సెంటర్లకు రాచబాట
అంతర్జాతీయ డేటా కేంద్రాలకు హైదరాబాద్ హబ్గా మారుతోంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలకు అమెరికా వెలుపల భారీ కార్యకలాపాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతోంది.
హబ్గా మారుతున్న హైదరాబాద్
అమెజాన్ కార్యకలాపాలు మొదలు
సిద్ధమవుతోన్న మైక్రోసాఫ్ట్ 3 కేంద్రాలు
ఆ కంపెనీ నుంచే రూ. 24 వేల కోట్లతో మరో మూడు
ప్రభుత్వంతో మరికొన్ని సంస్థల సంప్రదింపులు
ఈనాడు, హైదరాబాద్: అంతర్జాతీయ డేటా కేంద్రాలకు హైదరాబాద్ హబ్గా మారుతోంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సంస్థలకు అమెరికా వెలుపల భారీ కార్యకలాపాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఆయా కంపెనీలు ఐటీ, దాని ఆధారిత కార్యకలాపాల కోసం భారీ పెట్టుబడులతో ప్రధాన డేటా కేంద్రాలను ఇక్కడ నెలకొల్పుతున్నాయి. దాదాపు రూ.21 వేల కోట్లతో అమెజాన్ వెబ్సర్వీసెస్ సంస్థ నిర్మించిన మూడు డేటా కేంద్రాల నుంచి ఇటీవల తొలిదశ కార్యకలాపాలు మొదలయ్యాయి. పలు దేశాలకు డేటా సర్వీసులు హైదరాబాద్ నుంచే అందుతున్నాయి. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ప్రకటించిన మూడు డేటా కేంద్రాల నిర్మాణం జరుగుతుండగానే.. భారీ పెట్టుబడితో మరో మూడు డేటా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. త్వరలోనే వీటి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఎయిర్టెల్ కంపెనీ కూడా త్వరలో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పాటు దేశీయ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తమ డేటా కేంద్రాలను విస్తరిస్తున్నాయి. వీటిలో హైపర్స్కేల్ డేటా సెంటర్లు సర్వర్ల నిర్వహణ, హార్డ్వేర్ సేవలు.. సర్వీసు ఆధారిత డేటా సెంటర్లు పలురకాల సేవలు అందిస్తాయి. వీటిపై ఆధారపడి పలు హార్డ్వేర్, అనుబంధ రంగాల పరిశ్రమల వృద్ధి జరుగుతుందని, తద్వారా ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఐటీశాఖ పేర్కొంటోంది.
నిరంతర విద్యుత్తు.. అందుబాటులో నీరు..
డేటా సెంటర్ల నిర్వహణకు విద్యుత్తు, నీళ్లు కీలకం. డేటా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో ఈ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ కేంద్రాల వరకు డేటా కనెక్టివిటీ కేబుల్ పటిష్ఠంగా ఉందని, సంబంధిత సంస్థల రక్షణాత్మక ఏర్పాట్ల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపాయి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా షాబాద్లోని చందన్వెల్లి, మహేశ్వరంలోని ఫ్యాబ్సిటీ అంతర్జాతీయ డేటా కేంద్రాలకు చిరునామాగా మారుతున్నాయి. అత్యధిక డేటా కేంద్రాలు ఇక్కడే రానున్నాయి.
మైక్రోసాఫ్ట్: మైక్రోసాఫ్ట్ సంస్థ భారీ పెట్టుబడితో డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. తొలుత ప్రకటించిన మూడు కేంద్రాల నిర్మాణం 2022 జనవరిలో ప్రారంభమైంది. చందన్వెల్లి, ఎలికట్ట, మేకగూడలలో నిర్మితమవుతున్న ఆ కేంద్రాలు ఈ ఏడాది చివరి నాటికి పూర్తికానున్నాయి. మరో మూడు డేటా సెంటర్లను రూ.24 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం కుదుర్చుకుంది.
అమెజాన్: అమెజాన్ వెబ్సర్వీసెస్ రూ.21 వేల కోట్లతో రంగారెడ్డి జిల్లా చందనవెల్లి, ఫ్యాబ్సిటీ, ఫార్మాసిటీల్లో మూడు డేటా సెంటర్లను నిర్మించింది. 2020లో నిర్మాణ పనులు ప్రారంభించగా.. ఈ కేంద్రాల సేవలు గత నెల నుంచి అందుబాటులోకి వచ్చాయి. వీటిని మరింత విస్తరించాలని ఆ సంస్థ యోచిస్తోంది.
కంట్రోల్ ఎస్: దేశీయ సంస్థ కంట్రోల్ ఎస్ ఐటీ కారిడార్లో కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ సంస్థలో రెండు వేల మందికిపైగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ డేటా కేంద్రాల విస్తరణకు ప్రణాళికలు రచిస్తోంది.
కోస్తా తీరాలను కాదని..
డేటా కేంద్రాలు ఎక్కువగా కోస్తా తీరాల్లో ఏర్పాటయ్యేవి. సముద్రగర్భ కేబుల్ కనెక్టివిటీ తదితర సానుకూలాంశాలే అందుకు కారణం. దేశంలో ముంబయి, చెన్నైలలో తొలుత ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కానీ హైదరాబాద్కు డేటా కనెక్టివిటీ మెరుగ్గా ఉంది. ముంబయి, చెన్నై, దిల్లీ నగరాలతో పోల్చితే ఇక్కడ భూముల లభ్యత మెరుగ్గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం డేటా సెంటర్లకు ప్రత్యేక విధానంతో పాటు పన్ను రాయితీలు కల్పిస్తోంది. మానవ వనరుల లభ్యత, మౌలిక సదుపాయాలు, వివిధ పెట్టుబడులు.. వీటన్నిటి దృష్ట్యా ప్రముఖ సంస్థలు హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దీంతో అంతర్జాతీయ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భానుడి భగభగ.. ‘ఆరెంజ్’ హెచ్చరికల జారీ
రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా... మంగళవారం మరింత అధికమయ్యాయి. ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. -
న్యాయవాదులు సామాజిక ఇంజినీర్లు
‘నేను చదువుకునే రోజుల్లో మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం వైద్య విద్య, ఇంజినీరింగ్ కోర్సులను తొలి ప్రాధాన్యంగా ఎంపికచేసేవారు. -
అనుమానాస్పదంగా ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటెయినర్
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం ఒక కంటెయినర్ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశంగా మారింది. -
టెండర్లు లేకుండా రూ.270 కోట్ల పనులు!
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సచివాలయానికి అవసరమైన ఐటీ సామగ్రి కొనుగోలులో నిబంధనలు ఉల్లంఘించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమికంగా గుర్తించింది. -
కవితకు 15 రోజుల రిమాండ్
దిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నేరారోపణలపై అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈడీ కస్టడీ మంగళవారంతో ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆమెను ఉదయం 11 గంటలకు న్యాయస్థానం ముందు హాజరుపరిచి.. జ్యుడిషియల్ రిమాండ్ కోరారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్పాల్ బాధ్యతల స్వీకరణ
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్పాల్ మంగళవారం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే.. జస్టిస్ సుజయ్పాల్తో ప్రమాణం చేయించారు. -
నాగార్జునసాగర్ భద్రతపై సమగ్ర అధ్యయనం
నాగార్జునసాగర్ డ్యాం భద్రతపై సమగ్రంగా అధ్యయనం చేయించాలని.. జాతీయ డ్యాం సేఫ్టీ చట్టం-2021 ప్రకారం ఇది తప్పనిసరని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. -
మానేరు.. కనిపించని నీరు
వేసవికాలం ప్రారంభంలోనే నీరు అడుగంటడంతో కరీంనగర్లోని దిగువ మానేరు డ్యాం ఇలా ఎడారిని తలపిస్తోంది. -
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్.వి.రమణ
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, శివమాల దంపతులు, ఇతర కుటుంబసభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. -
భక్తులకు అందుబాటులో తితిదే పంచాంగం
శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని భక్తులకు తితిదే అందుబాటులో ఉంచింది. ప్రతి ఏడాది తరహాలోనే ఈ నూతన తెలుగు సంవత్సరాది పంచాంగాన్ని తితిదే ముద్రించింది. -
యాగ్జిలరీ పదోన్నతులపై ఆరా
పోలీసు శాఖలో ప్రణీత్రావు వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయన మాదిరిగానే యాగ్జిలరీ పదోన్నతులు పొందిన వారి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. -
రామప్ప ఆలయంలో సోమసూత్రం సమస్యకు పరిష్కారం
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప ఆలయంలో సోమసూత్రం (శివలింగ అభిషేక జలం బయటకు వెళ్లే మార్గం) సమస్య పరిష్కారమైంది. -
ఐఎంజీ భూకేటాయింపు వ్యవహారం.. సీబీఐ దర్యాప్తు చేయాలన్న పిటిషన్ విచారణ వాయిదా
ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 850 ఎకరాల భూమి కేటాయింపు వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు ఏప్రిల్ మొదటివారానికి వాయిదా వేసింది. -
గ్రూపు 1 దరఖాస్తుల సవరణకు నేడు తుది గడువు
టీఎస్పీఎస్సీ గ్రూపు-1 దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు కల్పించిన గడువు బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుందని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. -
చెత్త శుద్ధి టెండర్లు ఏమైనట్లు..?
రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో రెండేళ్లుగా ఘన వ్యర్థాలు(చెత్త) ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. రోజువారీగా చెత్తను శుద్ధి చేసేందుకు ఆహ్వానించిన టెండర్లు కొలిక్కి రావడం లేదు. -
9.14 లక్షల ఓట్ల తొలగింపు
రాష్ట్రంలో 9,14,354 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
బిల్లులు ఇవ్వాలి.. అనుమతులు రావాలి..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పెండింగ్ బిల్లులు మంజూరు కావాల్సి ఉండటంతోపాటు పలు అనుమతులు రావాల్సి ఉందని ఇంజినీర్లు పేర్కొన్నారు. -
వాలంటీర్ల ‘సాక్షి’ కొనుగోలుపై నేడు దిల్లీ హైకోర్టు విచారణ
ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల సాక్షి దినపత్రిక కొనుగోలు వ్యవహారంపై తదుపరి విచారణను దిల్లీ హైకోర్టు బుధవారం చేపట్టనుంది. -
హార్డ్డిస్క్ల విశ్లేషణతో ఆధారాల సేకరణ!
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానంపై పోలీసులు దృష్టి సారించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ)లో వినియోగించిన సాంకేతికతను ఎలా సమకూర్చుకున్నారు..? -
నూతన హైకోర్టుకు నేడు సీజేఐ శంకుస్థాపన
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ బుధవారం సాయంత్రం 5.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. -
ఏప్రిల్లో జలాశయాల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్
వేసవి నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాపై రోజూ టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
-
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
-
దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది ‘రాజకీయ ప్రతీకారమే’ - ఆప్
-
మథుర కాకపోతే పోటీ చేసేదాన్ని కాదు : హేమమాలిని
-
ఆరు నెలల్లో.. రూ.7.5 లక్షల కోట్ల రుణానికి కేంద్రం సిద్ధం
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ