సన్నద్ధత ఉంటేనే ‘ముందుకు’
పంటలను విపత్తుల బారి నుంచి కాపాడేందుకు పంటల సీజన్ను ముందుకు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకొని.. దీనిపై కార్యాచరణకు అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
ఖరీఫ్ పంటకాలం జరగాలంటే ప్రత్యేక కసరత్తు అవసరమంటున్న నిపుణులు
ఈనాడు, హైదరాబాద్: పంటలను విపత్తుల బారి నుంచి కాపాడేందుకు పంటల సీజన్ను ముందుకు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకొని.. దీనిపై కార్యాచరణకు అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ వానాకాలం నుంచే దీన్ని అమలు చేయాలని సంకల్పించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే వ్యవసాయ శాఖకు, అన్ని జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అయితే పంటల సీజన్లో మార్పులకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై చర్చ సాగుతోంది. రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. ప్రభుత్వం అన్నివిధాలా సన్నద్ధమై.. రైతులను చైతన్యవంతులను చేస్తే ఫలితాలుంటాయని నిపుణులు, రైతుసంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో కొన్నేళ్లుగా యాసంగిలో అకాల వర్షాలు, వడగళ్లు పంటలను దెబ్బతీస్తున్నాయి. ఈ సీజన్లో దాదాపు 12 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అందులో 8 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింది. రైతుల కష్టాలను చూసిన సీఎం కేసీఆర్ సీజన్ను ముందుకు జరపాలనే నిర్ణయానికి వచ్చారు. యాసంగిలో వరికోతలు మార్చి 31 లోగా పూర్తయితే రైతులకు మేలు జరుగుతుందని సీఎం భావిస్తున్నారు. రాష్ట్రంలో సాగునీటి వసతి, భూగర్భ జలాల వృద్ధి, ఉచిత విద్యుత్ వంటి సానుకూల పరిస్థితులు ఉన్నందున వర్షాల కోసం చూడకుండా కాలువల నీళ్లతో వరినాట్లు వేసుకోవాలని నిర్దేశించారు. నవంబరు 15-20 లోగా యాసంగి వరినాట్లు వేసుకోవాలని సూచించారు. యాసంగి ముందుకు జరగాలంటే వానాకాలం వరినాట్లను కూడా ముందుకు జరపాలి. రోహిణీ కార్తె ప్రారంభంలోనే అంటే మే 25 నుంచి 25 జూన్ వరకు వానాకాలం వరినాట్ల ప్రక్రియ పూర్తి కావాల్సి వుంది. ఈ దిశగా జిల్లా కలెక్టర్లు రాష్ట్ర రైతాంగాన్ని వ్యవసాయ శాఖ సహకారంతో చైతన్యం చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ప్రచారం చేపట్టింది.
నైరుతి జాప్యంతో..
ముందస్తు పంట సీజన్కు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావించినా.. ఆరంభంలోనే రుతుపవనాలు ఆలస్యం కావడం లక్ష్యానికి ప్రతిబంధకంగా మారుతోంది. జూన్ 10 నాటికి విస్తారంగా వర్షాలు కురవాల్సి ఉండగా.. వర్షపాతంలో లోటు ఏర్పడింది. మరోవైపు సీజన్ను ముందుకు జరపడంపై ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికను ప్రకటించలేదు. ముందస్తు సీజన్ అమలు చేయడానికి వీలుగా విత్తనాలు, ఎరువులను ఇప్పటికే సిద్ధం చేయాలి. ఇవి ఇంకా సమకూరలేదు. యాసంగికి సంబంధించిన ధాన్యం సేకరణ ఇంకా కొనసాగుతున్నందున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో గోదాములు ధాన్యం నిల్వలతో నిండి ఉన్నాయి. వాటిని ఖాళీచేసిన తర్వాత ఎరువులను నిల్వచేసే వీలుంది. మరోవైపు వర్షాలు ఆలస్యమయినా ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల కాలేదు. రైతుబంధును కూడా ముందుగా విడుదల చేయాల్సి ఉంది.
ఇబ్బందులున్నాయి..
- సముద్రాల కట్టమల్లు, రైతు, వరంగల్ జిల్లా
ప్రభుత్వం మా కోసమే అని చెబుతున్నా.. పంటల సీజన్ను ముందుకు జరపడానికి మాకు కొన్ని ఇబ్బందులున్నాయి. పంటలకు సమృద్ధిగా నీరుండాలి. మావద్ద ప్రాజెక్టులు లేవు. వర్షాధార భూమి. వర్షాలు పడకుండానే ముందే నాట్లువేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది.
పకడ్బందీ ప్రణాళికతోనే..
- బాసిరెడ్డి భాస్కర్రెడ్డి, వ్యవసాయ నిపుణులు
ప్రభుత్వ ఉద్దేశం మంచిదే. దీన్ని ప్రాజెక్టుల కింద వెంటనే ప్రారంభించవచ్చు. మిగిలినచోట్ల సాధ్యం కాదు. రోహిణిలో నారుపోస్తే సీజన్ అనుకూలించదు. నెలలో కనీసం 5 సెంటిమీటర్ల వర్షపాతం పడితేనే భూములు పంటలకు అనుకూలిస్తాయి. అంటే జూన్ 30 వరకు వర్షాలు పడితే గానీ నేల అనుకూలంగా మారదు. ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో కృషి చేయాలి.
రైతుల మేలు కోసమే...
- ఎం.వెంకటరమణ, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు
రైతులను పంట నష్టాల బారి నుంచి కాపాడే బృహత్తర లక్ష్యంతోనే ప్రభుత్వం సీజన్ను ముందుకు జరపాలని సంకల్పించింది. ఇందులో వ్యవసాయ విశ్వవిద్యాలయం గురుతర బాధ్యతను నిర్వర్తిస్తుంది. రైతులు ఈ సీజన్ నుంచే దీనిపై దృష్టి సారించాలి. 120-125 రోజుల్లో పండే వరి రకాలను ఎంచుకొని ఈ నెల 15 నుంచి నెలాఖరు వరకు నారు పోసుకోవాలి. తర్వాత నెల రోజుల్లో నాట్లు వేసుకోవాలి. అది నవంబరు వరకు కోతకు వస్తుంది. ఒకవైపు పంట కోతలకు సన్నద్ధమవుతూనే యాసంగి కోసం నవంబరు 15 నుంచి 25 వరకు మళ్లీ నారు పోసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగనా సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు