అందరికీ సమాన అవకాశాలేవి?
‘అందరం ఒకలాగే పుట్టాం.. కానీ, అందరికీ సమాన అవకాశాలు మాత్రం లేవు’ అని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.జి.ప్రియదర్శిని అన్నారు.
పల్లె నాగేశ్వర్రావు సత్కార సభలో జస్టిస్ ఎం.జి.ప్రియదర్శిని
నారాయణగూడ, న్యూస్టుడే: ‘అందరం ఒకలాగే పుట్టాం.. కానీ, అందరికీ సమాన అవకాశాలు మాత్రం లేవు’ అని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.జి.ప్రియదర్శిని అన్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన పల్లె నాగేశ్వర్రావును పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సత్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని మాట్లాడుతూ.. ‘రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ సామాజిక న్యాయం, అందరికీ సమాన హక్కులు, అవకాశాల కోసం జీవితాంతం పోరాటం చేశారు. కానీ, నేటికీ జనాభాలో 50 శాతం మంది నిరక్షరాస్యులు, 60 శాతం మంది పేదలుంటే అందులో అత్యధికంగా దళితులే ఉన్నారు. కారణం సరైన అవకాశాలు లేకపోవడమే. దళితులకు రిజర్వేషన్లు వచ్చేశాయని, వారు ఎదిగిపోయి ఉద్యోగాలు చేస్తున్నారనే అపోహ అందరిలో ఉంది. కానీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో తక్కువ హోదా, తక్కువ జీతాలున్నవి మాత్రమే దళితులకు వస్తున్నాయి. ప్రతి 20 నిమిషాలకు ఒక దళిత మహిళ అత్యాచారానికి గురవుతోంది. కానీ, దానిపై ఎక్కడా చర్చ జరగదు’ అన్నారు. టీఎస్పీఎస్సీ మాజీ ఛైర్మన్ డా.ఘంటా చక్రపాణి మాట్లాడుతూ..అంబేడ్కర్ న్యాయవాద వృత్తిని చేపట్టి వందేళ్లు పూర్తయిందన్నారు. ఆయన స్ఫూర్తితో వేలమంది న్యాయవాదులుగా నమోదు చేసుకుంటున్నా 4 నుంచి 6 శాతం మంది కూడా నిలబడలేకపోతున్నారన్నారు. సీహెచ్ బాలకృష్ణ అధ్యక్షోపన్యాసం చేయగా బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ డా.ఎం.చేతన, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి డి.ప్రసాదరావు, అంబేడ్కరిస్టు జె.బి.రాజులు మాట్లాడారు. బి.మహేష్బాబు స్వాగతం పలకగా, ఎం.దుర్గాప్రసాద్ వందన సమర్పణ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.కోటి చొప్పున తెప్పించి ఎక్కడికి పంపారు..?
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎస్ఐబీ)లో ఆధారాల ధ్వంసం ఘటనతో మొదలై ఫోన్ ట్యాపింగ్ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చిన కేసు ఇప్పటికీ మలుపులు తిరుగుతూనే ఉంది. -
వరంగల్ విమానాశ్రయంపై కదలిక.. ప్రాథమిక సర్వేకు ఏఏఐ కసరత్తు
వరంగల్ ప్రాంతీయ విమానాశ్రయ నిర్మాణం వ్యవహారంలో కదలిక వస్తోంది. ప్రాథమిక భూ సర్వే కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) కసరత్తు చేపట్టింది. -
బొండా ఉమా పేరు చెప్పాలంటూ.. ఒత్తిడి చేశారు
‘మీ నాయకులు కానీ బొండా ఉమా కానీ.. సీఎం జగన్పై రాయి వేయించమన్నారా అని పోలీసులు నన్ను విచారణలో పదే పదే ప్రశ్నించారు. అసలు ఆ ఘటనతో నాకు సంబంధమే లేనప్పుడు.. వారు చేయమన్నారని ఎలా చెప్పేదని గట్టిగా ప్రశ్నించా.. దీనికి పోలీసులు నాపై రెండు దెబ్బలేశారు. -
తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు ప్రారంభం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో శ్రీమలయప్ప స్వామివారికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. -
ఉచితాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ప్రజలకు ఉచితాలు ఇవ్వడంపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు మోదీ సర్కారు ప్రయత్నించాలని, వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. -
ఇదీ సంగతి!
-
మెతుకు సీమలో యాపిల్ తోట
శీతల ప్రాంతాలకు పరిమితమైన పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే దీనిని పండిస్తారు. -
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్ష్రేతానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి దర్శనమార్గాలు కిక్కిరిశాయి. పూజలు నిర్వహించిన ఆర్జిత భక్తులతో మండపాలు సందడిగా మారాయి. -
ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు
నలుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు, ఇద్దరు మావోయిస్టు సభ్యులు తమ వద్ద లొంగిపోయారని భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. -
టీఎస్ఆర్జేసీ పరీక్షకు 84 శాతం హాజరు
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్ఆర్జేసీ) పరిధిలోని 35 జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఆదివారం నిర్వహించిన ప్రవేశపరీక్షలో 84 శాతం మంది హాజరయ్యారని సంస్థ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు. -
నేటినుంచి కొండగట్టు హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం నుంచి హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. -
నాలుగేళ్ల కనిష్ఠానికి శ్రీరామసాగర్
ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నీటిమట్టం నాలుగేళ్ల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. -
ఎన్నికల బందోబస్తుకు 160 కంపెనీల కేంద్ర బలగాలు
లోక్సభ ఎన్నికల బందోబస్తు కోసం రాష్ట్రంలో భారీగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్(సీఏపీఎఫ్) దళాలను మోహరించనున్నారు. -
ప్రశ్నిస్తే వ్యవస్థలతో దాడులు
ప్రభుత్వ బాధ్యతలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై వ్యవస్థలతో దాడులు చేయిస్తున్నారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్భూషణ్ అన్నారు. -
బియ్యం బకాయిలున్నా.. మళ్లీమళ్లీ ధాన్యం!
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ప్రతి సీజన్లో మిల్లర్లకు కేటాయిస్తుంది. మిల్లర్లు నిర్ణీత సమయంలో ధాన్యాన్ని మర ఆడించి, బియ్యాన్ని (కస్టమ్ మిల్లింగ్ రైస్ - సీఎంఆర్) అప్పగించాలి. -
వడగళ్ల వానతో 3,120 ఎకరాల్లో పంట నష్టం
రాష్ట్రంలో శనివారం కురిసిన అకాల వర్షాలు, వడగళ్లతో మొత్తం 3,120 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. -
పాదాలు నర్తించె.. జల పాఠాలు బోధించె
సోమవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఆదివారం ‘లేక్ క్లీన్ అప్’ కార్యక్రమం నిర్వహించింది. -
తక్కువ ధరకు ధాన్యం కొనే వ్యాపారులపై చర్యలు తీసుకోండి
రాష్ట్రంలో తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను పౌరసరఫరాలశాఖ ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
-
ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం.. వెంకయ్యనాయుడుకు ‘పద్మవిభూషణ్’ ప్రదానం
-
‘ఇలాంటి సీఎంను చూసి గర్విస్తున్నా’.. యోగిపై ప్రధాని ప్రశంసలు