చెన్నూరు కాదు.. తుమ్మిడిహట్టి మేలు
గ్రావిటీ ద్వారా ఆయకట్టుకు నీళ్లు వచ్చేందుకు అవకాశమున్న తుమ్మిడిహట్టి పథకాన్ని వదిలేసి చెన్నూరు ఎత్తిపోతల శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారంటూ వివిధ సంఘాలు, పార్టీల నేతలు ఆక్షేపించారు.
అక్కడ నిర్మిస్తే ఆయకట్టుకు గ్రావిటీ ద్వారా నీరివ్వొచ్చు
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
ఖైరతాబాద్, న్యూస్టుడే: గ్రావిటీ ద్వారా ఆయకట్టుకు నీళ్లు వచ్చేందుకు అవకాశమున్న తుమ్మిడిహట్టి పథకాన్ని వదిలేసి చెన్నూరు ఎత్తిపోతల శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారంటూ వివిధ సంఘాలు, పార్టీల నేతలు ఆక్షేపించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘గ్రావిటీతో నీళ్లు వస్తుంటే.. చెన్నూరు ఎత్తిపోతలకు సీఎం ఎందుకు శంకుస్థాపన చేస్తున్నారు?’ అనే అంశంపై తెలంగాణ జల సమితి ఆధ్వర్యంలో ప్రొ.వినాయకరెడ్డి అధ్యక్షతన అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ జల సమితి నాయకుడు నైనాల గోవర్ధన్ చెన్నూరు ఎత్తిపోతలకు ప్రత్యామ్నాయంపై టోపో సర్వే ఆఫ్ ఇండియా పటాలతో ప్రదర్శన ఇచ్చారు. నెహ్రూ ప్రణాళిక ప్రకారం శ్రీరామ్సాగర్ ఉత్తర కాలువ రెండో దశ, ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన రెండో దశలోని మందాకిని కాలువతో చెన్నూరు ప్రాంతం అంతటికీ గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వవచ్చన్నారు. తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం మాట్లాడుతూ... తుమ్మిడిహట్టిని మొదటే నిర్మించి ఉంటే రూ.1.25 లక్షల కోట్లు ఆదా అయ్యేవన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ... ఖర్చు లేనటువంటి గ్రావిటీ పథకాలకు ప్రణాళికలు వేసే అవకాశమున్నా ప్రభుత్వం ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శివర్గ సభ్యులు వేములపల్లి వెంకట్రామయ్య, కిసాన్ కాంగ్రెస్ జాతీయ నాయకులు కోదండరెడ్డి, విశ్రాంత ఇంజినీర్లు విఠల్రావు, లక్ష్మీనారాయణ, సీపీఐ నేత పశ్య పద్మ, ఆదిలాబాద్ అభివృద్ధి వేదిక అధ్యక్షుడు కొండేటి సత్యనారాయణ, తెలంగాణ లోక్సత్తా అధ్యక్షుడు మన్నారం నాగరాజు, విశ్రాంత ఆచార్యులు ప్రొ.వెంకటనారాయణ, బీసీ సంఘం నాయకులు శ్రీనివాస్ యాదవ్, జలసాధన సమితి నేత సారయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
భద్రాచలంలో 44 డిగ్రీలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత గురువారం కొనసాగింది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
ఎవరి కోసం చేశారు ఇదంతా...?
రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది. -
నాణ్యమైన విత్తనాలనే వాడాలి
పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. -
ఆయిల్పామ్ రైతులను చైతన్యపరచాలి
వేసవికాలంలో ఎండ తీవ్రత, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గునందున ఆయిల్పామ్ మొక్కల సంరక్షణపై రైతులు ఆందోళన చెందకుండా వారిని చైతన్యపరచాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా