బెళగావి ఎక్స్ప్రెస్ మణుగూరుకు పొడిగింపు
బెళగావి- సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడిచే బెళగావి ఎక్స్ప్రెస్(07335/07336)ను మణుగూరు వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
ఈనాడు, హైదరాబాద్: బెళగావి- సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య నడిచే బెళగావి ఎక్స్ప్రెస్(07335/07336)ను మణుగూరు వరకు పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. బెళగావి, సికింద్రాబాద్ మధ్య ప్రస్తుతం ఉన్న ప్రయాణ వేళల్లో ఎలాంటి మార్పు లేదు. ఉదయం 5.25కు సికింద్రాబాద్కు చేరుకునే ఈ రైలు 5.40కి బయల్దేరి మధ్యాహ్నం 12.50కి మణుగూరుకు చేరుకుంటుంది. మధ్యలో భువనగిరి, జనగామ, కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, గాంధీపురం, భద్రాచలం రోడ్ స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో మణుగూరు నుంచి సాయంత్రం 3.40కి బెళగావి ఎక్స్ప్రెస్ బయల్దేరుతుంది. రాత్రి 10.10కి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ నిర్ణయం జులై 1 వరకు అమల్లో ఉంటుందని ద.మ.రైల్వే శుక్రవారం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కన్నవారి నడుమ కుదరని ఏకాభిప్రాయం.. మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టిన హైకోర్టు
-
Chandrababu: జైలులో నేడు చంద్రబాబు దీక్ష
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు