80 ఏళ్లు దాటినవారికి ఇంటి నుంచే ఓటు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటినవారు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అమలు
పోస్టల్ బ్యాలెట్లపై ఉత్తర్వులు జారీచేసిన ఎన్నికల సంఘం
ఈనాడు, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటినవారు ఇంటివద్దే ఓటుహక్కు వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ సదుపాయాన్ని కోరుకున్నవారికి ముందస్తుగా పోస్టల్బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగానికి అవకాశం కల్పించాలని త్వరలో ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారాన్ని పంపింది. తెలంగాణలో ఈ ఏడాది చివరిలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పోస్టల్బ్యాలెట్ విధానంలో ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎవరు అర్హులన్న విషయమై ఎన్నికల సంఘం తాజాగా రాష్ట్రానికి సమాచారం పంపింది. 80 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు కేంద్ర బలగాల్లో పనిచేస్తున్నవారు, ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది, పోలింగు ఏజెంట్లు, ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఇలా 11 రకాల వారికి పోస్టల్బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. అయితే 80 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు కావాలనుకుంటే ఇంటినుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయి అభ్యర్థులు ఖరారయిన మీదట పోస్టల్ బ్యాలెట్లను అధికారులు సిద్ధం చేస్తారు. ఇంటినుంచి ఓటువేసే వారికి సంబంధించి ప్రత్యేక రంగులో బ్యాలెట్ పత్రాన్ని రూపొందించనున్నారు.
కాగా ఇంటినుంచి ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసేందుకు విధివిధానాలను ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు పంపనుంది. ఈమేరకు రానున్న ఎన్నికల్లో ఇంటినుంచి ఓటు విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకున్న వారు లిఖిత పూర్వకంగా ఆ ప్రాంత ఎన్నికల అధికారికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులు ఆయా ఓటర్ల ఇంటికి వెళ్లి ఓటు వేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. నాగార్జునసాగర్, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లోనూ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ విధానాన్ని అమలు చేశారు. ఈ ప్రయత్నం ప్రయోజనకరంగా ఉండటంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి 5న విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 80 ఏళ్లు దాటిన ఓటర్లు రాష్ట్రంలో 4,87,950 మంది ఉన్నారు. వచ్చే నెలలో విడుదల చేసే తుది ఓటర్ల జాబితాలో ఇలాంటి ఓటర్లు ఎంతమంది ఉంటారన్నది స్పష్టం అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. -
JEE Main: జేఈఈ మెయిన్ దరఖాస్తుకు గడువు రేపే
2024 జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే జేఈఈ మెయిన్ తొలి విడత ఆన్లైన్ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈ నెల 30వ తేదీ రాత్రి 9 గంటలకు ముగియనుంది. -
Chandrababu: సభలు, సమావేశాల్లో పాల్గొనొచ్చు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈనెల 20న ఇచ్చిన పూర్తిస్థాయి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు డిసెంబరు 8కి వాయిదా వేసింది. -
Margadarsi Chit Fund Case: లుక్ఔట్ సర్క్యులర్ కోర్టు ధిక్కరణ కాదా?
ఎలాంటి కఠిన చర్యలూ చేపట్టరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా.. మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా లుక్ఔట్ సర్క్యులర్(ఎల్ఓసీ)ను ఎలా జారీ చేశారని ఏపీ సీఐడీని తెలంగాణ హైకోర్టు నిలదీసింది. -
Vizag: సాగర సర్పం.. కాటేస్తే కష్టం
విశాఖ నగర పరిధి సాగర్నగర్ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు మంగళవారం ఓ విషపూరిత పాము చిక్కింది. -
ఇదీసంగతి!
-
ఇందూరులో వడగళ్ల బీభత్సం
నిజామాబాద్ జిల్లాలో మంగళవారం వడగళ్లు బీభత్సం సృష్టించాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో గాలివాన పడింది. -
ప్రలోభాల అడ్డుకట్టకు మరింత నిఘా
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపించడంతో నిఘాను మరింత విస్తృతం చేశామని, గురువారం పోలింగ్ ముగిసేంత వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ వెల్లడించారు. -
దీక్షాదివస్ స్ఫూర్తిగా... రాష్ట్రంకోసం పునరంకితం
తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం దీక్షా దివస్ స్ఫూర్తిగా పునరంకింతమవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివస్ అని, నాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని పేర్కొన్నారు. -
ఆర్మీ క్విజ్ ఫైనల్స్కు తేజ విద్యాలయ విద్యార్థులు
భారత సైనిక దళం ఆధ్వర్యంలో మంగళవారం చెన్నైలోని ఆఫీసర్స్ శిక్షణ అకాడమీ ఆడిటోరియంలో ఆర్మీ క్విజ్ సౌతిండియా సెమీ ఫైనల్స్ నిర్వహించారు. -
స్మితా సభర్వాల్కు నీటిపారుదల శాఖ బాధ్యతలు
నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ కార్యదర్శిగా సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ను పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్ఏసీ) ప్రభుత్వం నియమించింది. -
నేడు, రేపు సర్కారు బడులకు ఎన్నికల సెలవులు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బుధ, గురువారాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న పలువురు కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో డీఈఓలు ఎస్ఎంఎస్ల ద్వారా ఆదేశాలిచ్చారు. -
అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: గవర్నర్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళిసై కోరారు. -
‘మేడిగడ్డ’పై నిపుణుల కమిటీ!
కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు నేపథ్యంలో సమగ్ర అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.


తాజా వార్తలు (Latest News)
-
Uttarakhand tunnel: సొరంగం ఆపరేషన్ను లైవ్లో చూసి.. మోదీ భావోద్వేగం
-
సొరంగంలోని బిడ్డకోసం 16 రోజులు నిరీక్షించి.. బయటకొచ్చే కొద్ది గంటల ముందే..!
-
Pragathi: ఆర్థిక కష్టాలు.. కన్నీళ్లు.. నటి ప్రగతి ఇంత ‘స్ట్రాంగ్’గా ఉండటానికి కారణాలివే..!
-
Stock Market: సెన్సెక్స్కు 728 పాయింట్ల లాభం.. 21,000 చేరువకు నిఫ్టీ
-
Naga Chaitanya: వైఫల్యాలు నేర్పినన్ని పాఠాలు ఎవరూ నేర్పరు..: నాగచైతన్య
-
TS Elections: కల్వకుర్తిలో కాంగ్రెస్, భారాస శ్రేణుల ఘర్షణ