పాలమూరుపై ఏపీ దరఖాస్తు తిరస్కరణ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తు(ఐ.ఎ) పరిశీలన తమ పరిధిలోకి రాదని బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునల్ తేల్చిచెప్పింది.
ఎత్తిపోతల పథకం తమ పరిధిలోకి రాదన్న బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునల్
డీపీఆర్ ఆమోదానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని అంచనా వేస్తున్న తెలంగాణ నీటి పారుదల శాఖ
ఈనాడు, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుపై ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తు(ఐ.ఎ) పరిశీలన తమ పరిధిలోకి రాదని బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునల్ తేల్చిచెప్పింది. ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన దరఖాస్తును తిరస్కరించింది. అయితే, దీనిపై సరైన వేదికకు వెళ్లే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్కు ఉందని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 75 శాతం నీటి లభ్యత కింద 90 టీఎంసీల నీటిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 18న జీఓ 246ను జారీ చేసింది. చిన్న నీటి వనరుల కింద కేటాయింపు ఉండీ వినియోగించుకోని 45 టీఎంసీలు, గోదావరి నుంచి పోలవరం ద్వారా కృష్ణా బేసిన్కు మళ్లించే నీటిలో నాగార్జునసాగర్ ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వినియోగించుకోవడానికి అవకాశం ఉన్న 45 టీఎంసీలు కలిపి మొత్తం 90 టీఎంసీలను పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయించింది. ఈ ఉత్తర్వును నిలిపివేసేలా మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ మధ్యంతర దరఖాస్తు(ఐ.ఎ) దాఖలు చేసింది. మిషన్ కాకతీయ కింద చెరువులను మరమ్మతు చేసి మొత్తం నీటిని తెలంగాణ వినియోగించుకుంటోందని, కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు వివరాలే దీనికి సాక్ష్యమని పేర్కొంది. గోదావరి నుంచి మళ్లించే నీటిని కేటాయించుకోవడం వల్ల దిగువన ఉన్న రాయలసీమ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయంది. దీనిపై తెలంగాణ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ వాదన సరైంది కాదని అందులో పేర్కొంది. నీటిని మళ్లీ కేటాయించుకోవడం అక్రమమేమీ కాదని వాదించింది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేపట్టిన ప్రాజెక్టు తప్ప కొత్తది కాదని, 2016 సెప్టెంబరులో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రాజెక్టు గురించి చర్చ జరిగిందని, నిలిపివేయాలని అపెక్స్ కౌన్సిల్ చెప్పలేదంది.
రెండు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత ట్రైబ్యునల్ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 2015లో ఇచ్చిన ఉత్తర్వులో వరద నీటి వినియోగమన్నారు తప్ప.. 75 శాతం నీటి లభ్యత కింద అని వినియోగించుకోవచ్చని పేర్కొనలేదంది. ఇది 2014లో జరిగిన రాష్ట్ర పునర్విభజనకు ముందు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు అన్న వాదనతోనూ ఏకీభవించలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని యాక్ట్ 6 సెక్షన్ 89 ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తు తమ పరిధిలోకి రాదని ట్రైబ్యునల్ పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా కచ్చితమైన నీటి కేటాయింపులు జరగకపోతే చేయడం, నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఎలా వినియోగించుకోవాలో ఆపరేషన్ ప్రొటోకాల్ రూపొందించడం మాత్రమే తమ పని అని స్పష్టం చేసింది. దీనిపై సరైన వేదికకు వెళ్లడానికి ఏపీకి స్వేచ్ఛ ఉందని పేర్కొంది. ట్రైబ్యునల్ ఆదేశాలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల డీపీఆర్ను కేంద్ర జల సంఘం పరిగణనలోకి తీసుకోవడానికి అవకాశం ఏర్పడిందని తెలంగాణ నీటిపారుదలశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అటవీ, పర్యావరణ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ, కేంద్ర విద్యుత్తు ప్రాధికార సంస్థ తదితర అనుమతులు ఇప్పటికే వచ్చాయి. నీటి లభ్యతకు సంబంధించి సీడబ్ల్యూసీ అనుమతి రావాల్సి ఉంది.
ఇది పాలమూరు, రంగారెడ్డి ప్రజల విజయం
-మంత్రి నిరంజన్రెడ్డి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై ఏపీ ప్రభుత్వం వేసిన మధ్యంతర దరఖాస్తును బ్రిజేశ్కుమార్ ట్రైబ్యునల్ కొట్టివేయడం పాలమూరు విజయమని, దీని ద్వారా ప్రాజెక్టుకు అడ్డంకులన్నీ తొలగిపోయాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలే ఈ విజయానికి కారణమన్నారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం కృష్ణా నదిలో తెలంగాణ నీటి వాటాను వెంటనే తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
త్వరలో కాలువల పనులు
-మంత్రి శ్రీనివాస్గౌడ్
ఏపీ ప్రభుత్వం వేసిన మధ్యంతర దరఖాస్తును ట్రైబ్యునల్ కొట్టివేయడంతో ధర్మానిదే గెలుపు అని మరోసారి రుజవైందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ శాఖల మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. త్వరలో కాలువల పనులను చేపడతామని, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Jogi ramesh: ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
సుమారు 16 లక్షల మందికి ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రులు జోగి రమేశ్, మేరుగు నాగార్జున అన్నారు. -
సిరా చుక్క.. తీర్పు రాసే వేళ..
పార్టీల పోటాపోటీ ప్రచారాలు.. హామీలు.. నేతల విమర్శలు ప్రతివిమర్శలు.. వార్రూమ్లలో ఎత్తులు పైఎత్తులు.. అన్నీ చూసి... చెప్పినవి విని... ఆకళింపు చేసుకున్న తెలంగాణ ఓటరు వచ్చే అయిదేళ్లకు తమ ప్రతినిధులను ఎన్నుకునే ఘడియలు వచ్చేశాయి. -
7 గంటల నుంచి పోలింగ్
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుంది. సిబ్బంది బుధవారం సాయంత్రానికి ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. -
ఓటు బాటలో పోటెత్తారు
సొంతూరిలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి ఓటర్లు బుధవారం పెద్దఎత్తున తరలివెళ్లారు. నగరంలో చదువుకుంటున్న విద్యార్థులు.. ఉద్యోగాలు చేస్తున్న యువత.. ఉపాధి నిమిత్తం ఇక్కడ స్థిరపడినవారు స్వగ్రామాలకు వెళ్లేందుకు రావడంతో.. జూబ్లీ బస్స్టేషన్(జేబీఎస్), మహాత్మా గాంధీ బస్స్టేషన్(ఎంజీబీఎస్)లతో పాటు రైల్వే స్టేషన్లూ కిక్కిరిశాయి. -
కృత్రిమ మేధతో సమస్యలకు చెక్!
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు కృత్రిమ మేధ శ్రేష్ఠతర కేంద్రాల(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్)ను నెలకొల్పేందుకు సమాయత్తమైంది. -
విదేశాల్లో దీక్షా దివస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని భారాస ప్రవాస విభాగాల ఆధ్వర్యంలో బుధవారం 52 దేశాల్లో దీక్షా దివస్ నిర్వహించారు. -
నేడు తిరుమలకు చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. -
ఓటేసేందుకు వీరు.. ఓటేయించేందుకు వారు
రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటున్నవారు, విద్యార్థులు తమ సొంతూళ్లలో ఓటేసేందుకు బస్సుల్లో ప్రయాణమయ్యారు. -
ఓట్ల వేటపై కాసుల ఆట
-
చంద్రబాబు ముందస్తు బెయిలుపై విచారణ వాయిదా
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. -
తెలంగాణలో ఓటర్లుగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు
తెలంగాణలో గురువారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఓటర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. -
అకాల వర్షానికి దెబ్బతిన్న పత్తి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పలు ప్రాంతాల్లో పంటలు, ఆస్తులు దెబ్బతిన్నాయి. భారీ వడగళ్లు పడటంతో నిజామాబాద్ గ్రామీణ, కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలో పత్తి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. -
ఆర్జీయూకేటీకి గ్రీన్ యూనివర్సిటీ పురస్కారం
బాసరలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ప్రతిష్ఠాత్మక ‘గ్రీన్ యూనివర్సిటీ అవార్డు-2023’కి ఎంపికైంది. -
పాస్పోర్టు దరఖాస్తుల విచారణ విధానంలో మార్పు
పాస్పోర్టు పెండింగ్ దరఖాస్తుల విచారణ అపాయింట్మెంట్లను 250కి పెంచుతున్నట్లు ప్రాంతీయ పాస్పోర్టు అధికారిణి (ఆర్పీవో) స్నేహజ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
నేడు సుప్రీంకోర్టు ముందుకు ఫైబర్నెట్ ముందస్తు బెయిల్ కేసు
ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో గురువారం విచారణకు రానుంది. -
సీబీఐకి స్కిల్ కేసు అప్పగింత పిల్పై విచారణ వాయిదా
నైపుణ్యాభివృద్ధి సంస్థ (స్కిల్) కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ హైకోర్టులో వేసిన పిల్పై విచారణ డిసెంబరు 13కు వాయిదా పడింది. -
సినీనటి జయప్రదకు సుప్రీంకోర్టులో ఉపశమనం
సినిమా థియేటర్ కార్మికుల వేతనాల నుంచి మినహాయించుకున్న ఈఎస్ఐ విరాళాన్ని ఆ సంస్థకు జమ చేయలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి, మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. -
హైదరాబాద్లో డీసీపీ, ఏసీపీ సస్పెన్షన్
ఎన్నికల్లో డబ్బు తరలింపు విషయంలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం రచ్చకెక్కింది. ఈ వ్యవహారంలో నలుగురు సస్పెన్షన్కు గురి కాగా.. మరొకరిని సర్వీసు నుంచి తొలగించారు. -
ఇదీ సంగతి!


తాజా వార్తలు (Latest News)
-
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
-
Kiraak RP: సైలెంట్గా.. కిరాక్ ఆర్పీ వివాహం
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?
-
Expensive Cities: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే..
-
Chandrababu: ఏపీలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల
-
Supreme court: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా