Khammam: ఒక్క కాలే అయినా.. మొక్కవోని ఆత్మవిశ్వాసం
రోడ్డు ప్రమాదం కారణంగా ఓ కాలు కోల్పోయినా.. ఆ బుడతడి ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం చిన్నబోతోంది. తన తోటి పిల్లల్లాగే ఆటలు ఆడుతూ.. చదువులోనూ రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు.
రోడ్డు ప్రమాదం కారణంగా ఓ కాలు కోల్పోయినా.. ఆ బుడతడి ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం చిన్నబోతోంది. తన తోటి పిల్లల్లాగే ఆటలు ఆడుతూ.. చదువులోనూ రాణిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఖమ్మం జిల్లా కల్లూరు ఎన్నెస్పీ ప్రాంతానికి చెందిన మల్లి రాంబాబు, నాగలక్ష్మి కూలీలు. వారికి ఆరేళ్ల శివకుమార్తో పాటు మరో ఇద్దరు కుమారులున్నారు. స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శివకుమార్ ఒకటో తరగతి చదువుతున్నాడు. గతేడాది నవంబరులో అతన్ని ప్రమాదవశాత్తు లారీ ఢీకొంది. ఎడమకాలిపై నుంచి టైరు వెళ్లడంతో శస్త్రచికిత్స చేసి.. తొడ వరకు తొలగించాల్సి వచ్చింది. చిన్న వయసులోనే ఓ కాలు కోల్పోయినా అతడి ఆత్మస్థైర్యం సడలలేదు. పాఠశాలలో తోటి పిల్లలతో కలిసి ఒంటి కాలితోనే ఫుట్బాల్ ఆడుతున్నాడు. కారమ్స్లో ప్రతిభ చూపుతున్నాడు. శివకుమార్కు ఆధార్ కార్డు లేకపోవడంతో అతడికి ఆర్థికంగా అండగా ఉండేందుకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయలేని పరిస్థితి ఉంది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొల్లిపర శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు రూ.1.2 లక్షలు సేకరించారు. ఆధార్ మంజూరయ్యేలా చూడాలని అధికారులను తల్లిదండ్రులు కోరుతున్నారు.
న్యూస్టుడే, కల్లూరు, పెనుబల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర బలగాల అధీనంలోకి సాగర్
నాగార్జునసాగర్ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్రం ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. -
పుడమి కడుపు చల్లగా!
దేశవ్యాప్తంగా భూగర్భ జలాలు 2.62% పెరిగినట్లు కేంద్ర జల్శక్తి శాఖ వెల్లడించింది. గత ఏడాది 437.6 శతకోటి ఘనపు మీటర్ల (బీసీఎంల) మేర ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది 449.08 బీసీఎంలకు చేరినట్లు తెలిపింది. -
జీఎస్టీ వసూళ్లలో వృద్ధి
నవంబరు నెలలో జీఎస్టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్లో 31%, తెలంగాణలో 18% వృద్ధిని నమోదు చేశాయి. కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన నవంబరు నెల లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వసూళ్లు గతేడాది నవంబరుతో పోలిస్తే ఈ నవంబరులో రూ.3,134 కోట్ల నుంచి రూ.4,093 కోట్లకు పెరిగాయి. -
తగ్గిన రాబడులు.. పెరిగిన అప్పులు!
రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల ప్రకారం రుణ సేకరణలో అత్యధిక మొత్తాన్ని సర్కారు ఇప్పటికే సేకరించిందని కాగ్ వెల్లడించింది. -
సొంత వైద్యంతో.. ప్రాణం మీదకు..
ఏ చిన్న అనారోగ్యం వచ్చినా.. చాలామంది సొంతంగా మందులు కొని వేసుకుంటారు. కొందరైతే గూగుల్లో వెతికి ఆ మందులు వాడేస్తుంటారు. -
సైన్స్ సైతం ఆధ్యాత్మికత వైపు మళ్లిస్తుంది
ఆధ్యాత్మికత వైపు మళ్లేందుకు సైన్స్ సైతం ఒక మార్గమని ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. -
పర్యాటకాభివృద్ధి సంస్థ కార్యాలయంలో మంటలు
హైదరాబాద్ హిమాయత్నగర్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) కార్యాలయంలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో దస్త్రాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. -
ఆంధ్రా పోలీసులపై కేసులు
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద మూడో రోజు శుక్రవారం కూడా ఉద్రిక్తత కొనసాగింది. బుధవారం అర్ధరాత్రి ఏపీ పోలీసులు భారీ సంఖ్యలో సాగర్ ప్రాజెక్టుపైకి వచ్చి, 13 గేట్లను ఆక్రమించి, తెలంగాణ అధికారుల అనుమతి లేకుండానే కుడికాల్వకు రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. -
5 రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ వైపే: రాబర్ట్ వాద్రా
తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వైపే నిలిచారని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు, జాతీయ నాయకురాలు ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా ధీమా వ్యక్తం చేశారు. -
ఈశ్వరీబాయి జీవితం యువతకు ఆదర్శం
ధీరవనిత ఈశ్వరీబాయి జీవితాన్ని నవతరానికి పరిచయం చేస్తే వారు ప్రశ్నించడం, సమస్యలపై పోరాడటం నేర్చుకుంటారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక పేర్కొన్నారు. -
ఇక జోరుగా యాసంగి సాగు
తెలంగాణలో యాసంగి పంటల సాగు ముమ్మరం కానుంది. గత నెలారంభం నుంచి సాగు ప్రారంభం కాగా.. నెల రోజుల వ్యవధిలో 8 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. -
మళ్లీ జైలుకు వైఎస్ భాస్కరరెడ్డి
తన మధ్యంతర బెయిలు గడువు ముగిసిపోవడంతో... మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు వై.ఎస్.భాస్కరరెడ్డి తిరిగి జైలుకు వెళ్లారు. -
దక్షిణ మధ్య రైల్వేకు రెండు పురస్కారాలు
సివిల్ ఇంజినీరింగ్, నిర్మాణ రంగాల్లో 2022-2023 ఏడాదికిగాను ద.మ.రైల్వేకు రెండు ‘ఆల్ ఇండియా పెర్ఫార్మెన్స్ ఎఫిషియెన్సీ షీల్డ్’లు వచ్చినట్లు ఆ సంస్థ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. -
పాలిటెక్నిక్కు సరికొత్త సిలబస్
రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యకు వచ్చే విద్యాసంవత్సరం (2024-25) నుంచి కొత్త సిలబస్ అమలు కానుంది. తొలిసారిగా విదేశాల్లోని డిప్లొమా చదువులకు అమలు చేస్తున్న పాఠ్యప్రణాళికను కూడా పరిశీలించి.. వచ్చే అయిదేళ్ల కోసం నూతన సిలబస్ను రూపొందించనున్నారు. -
తితిదే అధికారులతో సమావేశ తీర్మానాలు సమర్పించండి
అధికారిక విధుల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులతో జరిపిన సమావేశం తీర్మానాలను సమర్పించాలంటూ తెలంగాణ పర్యాటకశాఖను హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. -
రాతపూర్వక వాదనలు ఉంటే సమర్పించండి
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో నమోదైన సీబీఐ, ఈడీ కేసుల్లోని నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లన్నింటిలో వాదనలు దాదాపు పూర్తయ్యాయి. -
వన్యప్రాణుల వేట నిరోధానికి ప్రత్యేక డ్రైవ్
వన్యప్రాణుల వేటను నిరోధించడానికి ‘క్యాచ్ ది ట్రాప్’ పేరుతో ప్రత్యేక డ్రైవ్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించినట్లు అటవీశాఖ తెలిపింది. -
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈ నెల 3 నాటికి సచివాలయం పూర్తిస్థాయిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా, పర్యావరణహితంగా మారనుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
టీచర్ అవుదామనుకొని..
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!