తెల్లకోటుపై ‘ర్యాగింగ్’ మరక
కొత్త కళాశాల.. చదవాల్సింది ఎంబీబీఎస్.. భిన్నమైన వాతావరణం.. వేర్వేరు ప్రాంతాల నేపథ్యం... మనసులో బెరుకు... పైగా తొలిసారిగా హాస్టల్లో ఉండాల్సిన పరిస్థితి... వంటివాటితో సతమతం అవుతున్న మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులను ర్యాగింగ్ భూతం మరింత భయపెడుతోంది.
వైద్య కళాశాలల్లో వికృత రూపం
కఠిన నిబంధనలున్నా బేఖాతరు
హింసాత్మకంగా కొందరు సీనియర్ల చేష్టలు
ఇప్పటికే రెండుచోట్ల 17 మందిపై వేటు
ఈనాడు - హైదరాబాద్
కొత్త కళాశాల.. చదవాల్సింది ఎంబీబీఎస్.. భిన్నమైన వాతావరణం.. వేర్వేరు ప్రాంతాల నేపథ్యం... మనసులో బెరుకు... పైగా తొలిసారిగా హాస్టల్లో ఉండాల్సిన పరిస్థితి... వంటివాటితో సతమతం అవుతున్న మొదటి సంవత్సరం వైద్య విద్యార్థులను ర్యాగింగ్ భూతం మరింత భయపెడుతోంది. కొన్నిచోట్ల వికృత రూపం దాలుస్తోంది. రాష్ట్రంలోని అత్యధిక వైద్య కళాశాలల్లో సీనియర్ విద్యార్థుల వేధింపులు జరుగుతున్నా... శ్రుతిమించిన చోట మాత్రమే బహిర్గతం అవుతున్నాయి. అదుపు తప్పితే జీవితాలు తలకిందులవుతాయని ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నా... సీనియర్లు బేఖాతరు చేస్తున్నారు. హైదరాబాద్లోని గాంధీ, వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలల్లో చోటుచేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. పరిచయం పేరిట పలకరింపులు ప్రారంభిస్తూ... ప్రథమ సంవత్సరం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొంతకాలం సర్దుకుంటే సరిపోతుందని కొందరు భావిస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో బాధితులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేక, కళాశాలలో ఫిర్యాదు చేయలేక అల్లాడుతున్నారు. తాము చెప్పినట్లు వినకుంటే చేయి చేసుకోవడం లేదంటే విచిత్రమైన పనిష్మెంట్లు, కఠిన శిక్షలు వేస్తుండటంతో జూనియర్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. కొన్నిసార్లు మొదటి సంవత్సరం విద్యార్థులు, సీనియర్ల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి.
హాస్టళ్లలో... భరించలేని స్థాయిలో....
వసతి గృహాల్లో ర్యాగింగ్ బెడద ఎక్కువగా ఉంటోందని, రాత్రిపూట, సెలవు రోజుల్లో అక్కడ ఉండాలంటేనే భయపడుతున్నామని ప్రథమ సంవత్సరం విద్యార్థులు వాపోతున్నారు. సీనియర్ల చేష్టలు అవమానకరంగా, ఇబ్బందికరంగా, కొన్నిసార్లు హింసాత్మకంగా ఉంటున్నాయని జూనియర్లు చెబుతున్నారు. వేసుకున్న దుస్తులు, వాడుతున్న చెప్పులు, తలకట్టు, తల దువ్వుకునే విధానం, మాటలు, నడక సహా ప్రతి అంశంలోనూ ఇలా ఉండకూడదు, ఇలాగే ఉండాలంటూ సతాయిస్తున్నారని విద్యార్థినీ, విద్యార్థులు వాపోతున్నారు. అసభ్యకర పదజాలం ఉపయోగించడం, గోడకుర్చీ వేయించడం, గుంజీలు తీయించడం, మగపిల్లల దుస్తులు విప్పించడం, బయట నుంచి ఆహారం తేవాలని ఆదేశించడం, కొన్ని సందర్భాల్లో మద్యం తేవాలని ఒత్తిడి చేస్తున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. ఇంటర్లో వచ్చిన మార్కులు... నీట్ ర్యాంకుతో ఆరాలు ప్రారంభించి వ్యక్తిగత అంశాలు, ప్రవర్తనపై విచిత్రమైన ప్రశ్నలు సాధారణంగా మారాయి. హాస్టల్ రూంలకు వచ్చి వేధిస్తున్నారు. చెప్పులు తుడవాలని, షూపాలిష్ చేయాలని, ఆదేశిస్తారు. వారి రూంకు వచ్చి అసైన్మెంట్లు రాయాలని, అందుకు విముఖత చూపినా, సక్రమంగా రాయకున్నా దౌర్జన్యం చేయడం, కొట్టడం వంటివి చేస్తున్నారు.
నేరుగా ఫిర్యాదుకు అవకాశం
ప్రతి వైద్య కళాశాలలో ర్యాగింగ్ నిరోధక బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఫిర్యాదులు ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాళ్లకు మాత్రమే చేరేలా కంప్లయింట్ బాక్సులు పెట్టారు. మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసేందుకూ అవకాశముంది. ఎన్ఎంసీ, యూజీసీలకు నేరుగా ఫిర్యాదు పంపించేందుకు వీలు కల్పించారు. అన్ని కళాశాలల్లోనూ ర్యాగింగ్కు వ్యతిరేకంగా బోర్డులు ఏర్పాటు చేశారు. వాటిపై వివిధ స్థాయుల్లోని అధికారులు, పోలీసుల ఫోన్ నంబర్లు రాస్తున్నారు.
ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో బహిర్గతం
గాంధీ వైద్య కళాశాలలో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ శ్రుతిమించడంతో ఇటీవల జూనియర్లు నేరుగా యూజీసీకి ఫిర్యాదు చేశారు. విచారణలో ప్రథమ సంవత్సరం విద్యార్థుల గదుల్లోనే ర్యాగింగ్ జరిగినట్లు రూఢీ కావడం, తీవ్రత ఎక్కువగా ఉండటంతో పది మంది సీనియర్లను ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలోనూ ర్యాగింగ్కు పాల్పడిన ఏడుగురు సీనియర్లను మూడు నెలలపాటు తరగతుల నుంచి, ఏడాదిపాటు హాస్టల్ నుంచి బహిష్కరించారు. మరో 20 మందికి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.
విద్యార్థుల చదువులపై ప్రభావం
తొలి సంవత్సరం విద్యార్థులు తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని, సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని ఓ వైద్య కళాశాలలో మెంటార్గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ స్పష్టంచేశారు. అయితే, ర్యాగింగ్ భయంతో విద్యార్థులు మొదటి రెండు, మూడు నెలలు తరగతులకు సక్రమంగా హాజరు కావడంలేదన్నారు. భయం, ఆందోళన, ఒత్తిడి కారణంగా వారు చదువులపై దృష్టి సారించడం లేదని తెలిపారు. దీని ప్రభావం వారి తర్వాత చదువులపై పడుతోందని, మొదటి మూడు నెలల ఒత్తిడి తర్వాత కూడా కొనసాగి ఫస్టియర్ ఎంబీబీఎస్ ఫలితాలను ప్రభావితం చేస్తోందన్నారు. దీంతో మెరిట్ విద్యార్థులు కూడా మార్కుల్లో వెనుకబడి తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురవుతున్నారు.
కఠిన చర్యలకు అవకాశం
కళాశాలల్లో వేధింపులు ఏ రూపంలో ఉన్నా బాధ్యులు కఠిన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. జాతీయ వైద్య మండలి, యూజీసీ మార్గదర్శకాలతోపాటు పోలీసు చట్టాలు కూడా వర్తిస్తాయి. కళాశాల నుంచి, హాస్టల్ నుంచి పాక్షికంగా, పూర్తిగా తొలగించే వరకు శిక్షలు ఉంటాయి. అందుకే కొన్నిచోట్ల కళాశాలల బోధనా సిబ్బంది, ప్రిన్సిపాళ్లు... సీనియర్ విద్యార్థులను హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఒక వైద్య కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ... తాము సీనియర్లను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నామని, వారిపై నిఘా పెడుతునామన్నారు. ప్రధానంగా వైద్య విద్యలో జూనియర్లకు... సీనియర్ల తోడ్పాటు, మార్గదర్శకత్వం అవసరమవుతాయని అందుకే కొన్ని సందర్భాల్లో హెచ్చరికలకే పరిమితం అవుతున్నట్లు తెలిపారు.
ర్యాగింగ్ ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదు
-కె.రమేశ్రెడ్డి, రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ)
వైద్య కళాశాలల్లో ర్యాగింగ్ ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, హెచ్ఓడీలకు ఆదేశాలిచ్చాం. కళాశాలల్లో విద్యార్థులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూడాల్సిన బాధ్యత వారిదే. ప్రతి విభాగంలోనూ ఫిర్యాదులను పరిష్కరించే విధానం పక్కాగా ఉండేలా చూస్తాం. ర్యాగింగ్కు పాల్పడితే కళాశాల నుంచి బహిష్కరించడమే కాకుండా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకుంటున్న వాట్సప్ గ్రూపుల్లో ప్రొఫెసర్లు, హెచ్ఓడీలు భాగస్వాములుగా ఉండి మెసేజ్లను పరిశీలిస్తున్నారు. కళాశాలలు, హాస్టళ్లలో ఎవరైనా విద్యార్థులు మద్యం తాగినా, మత్తు పదార్థాలు తీసుకున్నా... పూర్తిగా బహిష్కరిస్తాం. క్రమశిక్షణపరమైన చర్యలూ ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Jogi ramesh: ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
సుమారు 16 లక్షల మందికి ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రులు జోగి రమేశ్, మేరుగు నాగార్జున అన్నారు. -
సిరా చుక్క.. తీర్పు రాసే వేళ..
పార్టీల పోటాపోటీ ప్రచారాలు.. హామీలు.. నేతల విమర్శలు ప్రతివిమర్శలు.. వార్రూమ్లలో ఎత్తులు పైఎత్తులు.. అన్నీ చూసి... చెప్పినవి విని... ఆకళింపు చేసుకున్న తెలంగాణ ఓటరు వచ్చే అయిదేళ్లకు తమ ప్రతినిధులను ఎన్నుకునే ఘడియలు వచ్చేశాయి. -
7 గంటల నుంచి పోలింగ్
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుంది. సిబ్బంది బుధవారం సాయంత్రానికి ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. -
ఓటు బాటలో పోటెత్తారు
సొంతూరిలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి ఓటర్లు బుధవారం పెద్దఎత్తున తరలివెళ్లారు. నగరంలో చదువుకుంటున్న విద్యార్థులు.. ఉద్యోగాలు చేస్తున్న యువత.. ఉపాధి నిమిత్తం ఇక్కడ స్థిరపడినవారు స్వగ్రామాలకు వెళ్లేందుకు రావడంతో.. జూబ్లీ బస్స్టేషన్(జేబీఎస్), మహాత్మా గాంధీ బస్స్టేషన్(ఎంజీబీఎస్)లతో పాటు రైల్వే స్టేషన్లూ కిక్కిరిశాయి. -
కృత్రిమ మేధతో సమస్యలకు చెక్!
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు కృత్రిమ మేధ శ్రేష్ఠతర కేంద్రాల(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్)ను నెలకొల్పేందుకు సమాయత్తమైంది. -
విదేశాల్లో దీక్షా దివస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని భారాస ప్రవాస విభాగాల ఆధ్వర్యంలో బుధవారం 52 దేశాల్లో దీక్షా దివస్ నిర్వహించారు. -
నేడు తిరుమలకు చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. -
ఓటేసేందుకు వీరు.. ఓటేయించేందుకు వారు
రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటున్నవారు, విద్యార్థులు తమ సొంతూళ్లలో ఓటేసేందుకు బస్సుల్లో ప్రయాణమయ్యారు. -
ఓట్ల వేటపై కాసుల ఆట
-
చంద్రబాబు ముందస్తు బెయిలుపై విచారణ వాయిదా
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. -
తెలంగాణలో ఓటర్లుగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు
తెలంగాణలో గురువారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఓటర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. -
అకాల వర్షానికి దెబ్బతిన్న పత్తి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పలు ప్రాంతాల్లో పంటలు, ఆస్తులు దెబ్బతిన్నాయి. భారీ వడగళ్లు పడటంతో నిజామాబాద్ గ్రామీణ, కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలో పత్తి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. -
ఆర్జీయూకేటీకి గ్రీన్ యూనివర్సిటీ పురస్కారం
బాసరలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ప్రతిష్ఠాత్మక ‘గ్రీన్ యూనివర్సిటీ అవార్డు-2023’కి ఎంపికైంది. -
పాస్పోర్టు దరఖాస్తుల విచారణ విధానంలో మార్పు
పాస్పోర్టు పెండింగ్ దరఖాస్తుల విచారణ అపాయింట్మెంట్లను 250కి పెంచుతున్నట్లు ప్రాంతీయ పాస్పోర్టు అధికారిణి (ఆర్పీవో) స్నేహజ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
నేడు సుప్రీంకోర్టు ముందుకు ఫైబర్నెట్ ముందస్తు బెయిల్ కేసు
ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో గురువారం విచారణకు రానుంది. -
సీబీఐకి స్కిల్ కేసు అప్పగింత పిల్పై విచారణ వాయిదా
నైపుణ్యాభివృద్ధి సంస్థ (స్కిల్) కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ హైకోర్టులో వేసిన పిల్పై విచారణ డిసెంబరు 13కు వాయిదా పడింది. -
సినీనటి జయప్రదకు సుప్రీంకోర్టులో ఉపశమనం
సినిమా థియేటర్ కార్మికుల వేతనాల నుంచి మినహాయించుకున్న ఈఎస్ఐ విరాళాన్ని ఆ సంస్థకు జమ చేయలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి, మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. -
హైదరాబాద్లో డీసీపీ, ఏసీపీ సస్పెన్షన్
ఎన్నికల్లో డబ్బు తరలింపు విషయంలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం రచ్చకెక్కింది. ఈ వ్యవహారంలో నలుగురు సస్పెన్షన్కు గురి కాగా.. మరొకరిని సర్వీసు నుంచి తొలగించారు. -
ఇదీ సంగతి!


తాజా వార్తలు (Latest News)
-
Air India: విమానంలో నీటి లీకేజీ.. క్యాబిన్ పైకప్పునుంచి ధార!
-
Ashish Reddy: దిల్ రాజు ఇంట వేడుక.. హీరో ఆశిష్ నిశ్చితార్థం
-
Vikasraj: ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ప్రత్యేక సెలవు: వికాస్రాజ్
-
Visakhaptnam: విశాఖ ఫిషింగ్ హార్బర్లో మరో అగ్ని ప్రమాదం
-
Manickam Tagore: భాజపా ఓడితే గోవా సర్కార్ కూలడం ఖాయం: కాంగ్రెస్ ఎంపీ
-
COP28: చేతల్లో చేసి చూపెట్టాం.. ‘వాతావరణ చర్యల’పై ప్రధాని మోదీ