గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు
గ్రూప్-1 నియామకాల కోసం జూన్ 11న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు శనివారం తీర్పు వెలువరించింది. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించడంలో కమిషన్ విఫలమైందని పేర్కొంది.
హైకోర్టు తీర్పు
పరీక్ష తిరిగి నిర్వహించాలని టీఎస్పీఎస్సీకి ఆదేశం
పరీక్షల నిర్వహణలో కమిషన్ వైఫల్యం
హాజరైన అభ్యర్థుల వివరాల నమోదులోనూ జాగ్రత్తల్లేవు
నోటిఫికేషన్లోని నిబంధనలు కమిషన్కూ వర్తిస్తాయి
వాటిని సవరించాలంటే అనుబంధ ప్రకటన ఇవ్వాలన్న న్యాయమూర్తి
బయోమెట్రిక్ నమోదుకుగాను అభ్యర్థులు పరీక్షకు 30 నిమిషాల ముందే చేరుకోవాలన్న ఒక నిబంధన నోటిఫికేషన్లో ఉంది. తాను పేర్కొన్న నిబంధనను కమిషన్ అమలు చేయాల్సి ఉంది. దీన్ని గత ఏడాది అక్టోబరు 16న జరిగిన పరీక్షల్లో అమలు చేశారు. ఈ ఏడాది జూన్ 11న విస్మరించారు.
టీఎస్పీఎస్సీ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లోని మొదటి నివేదిక ప్రకారం పరీక్షకు హాజరైనవారి సంఖ్య 2,33,248గా ఉండగా జూన్ 28నాటి వెబ్నోట్ ప్రకారం వారి సంఖ్యను 2,33,506గా పేర్కొన్నారు. జులై 12న దాఖలు చేసిన కౌంటరులో 2,33,248గా సూచించారు. దీన్నిబట్టి పరీక్ష నిర్వహణలోగానీ, అభ్యర్థుల హాజరు వివరాలను సరిచూడటంలోగానీ కమిషన్ జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టమవుతోంది.
తీర్పులో న్యాయమూర్తి
ఈనాడు, హైదరాబాద్: గ్రూప్-1 నియామకాల కోసం జూన్ 11న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు శనివారం తీర్పు వెలువరించింది. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించడంలో కమిషన్ విఫలమైందని పేర్కొంది. పరీక్షలకు హాజరైన అభ్యర్థుల వివరాల నమోదులోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించలేదని వ్యాఖ్యానించింది. గ్రూప్-1 పోస్టులకు నిర్ణయాత్మకమైన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణలో వైఫల్యం కారణంగా అర్హులు అవకాశాలను కోల్పోరాదన్న ఉద్దేశంతోనే పరీక్షను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. బయోమెట్రిక్ సహా నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం పరీక్షను తిరిగి నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ను ఆదేశించింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకుండా, హాల్టికెట్ నంబరు లేకుండా ఓఎంఆర్ షీట్లు జారీ చేశారని, ఈ పరీక్షలను రద్దు చేయాలంటూ బి.ప్రశాంత్, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ పి.మాధవీదేవి శనివారం తీర్పు వెలువరించారు. నోటిఫికేషన్లో కమిషన్ జారీ చేసిన సూచనలు, నిబంధనలు అభ్యర్థులతోపాటు కమిషన్కూ వర్తిస్తాయని, వాటిని కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. నోటిఫికేషన్లో నిబంధనలను మార్చే అధికారం కమిషన్కు ఉందని, అలా చేయదలిస్తే గ్రూపు-4 పరీక్షల్లో మాదిరి అనుబంధంగా జారీ చేయవచ్చన్నారు. ప్రిలిమ్స్ అన్నది కేవలం స్క్రీనింగ్ పరీక్ష మాత్రమేనని, ఒకవేళ పరీక్షల నిర్వహణలో లోపాల కారణంగా కొందరు అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినప్పటికీ వారు మెయిన్స్ను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న కమిషన్ వాదన ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారంతా మెయిన్ పరీక్షకు హాజరు కాలేరని, మెరిట్ ఆధారంగా 1:50 నిష్పత్తిలో మాత్రమే అనుమతిస్తారన్నారని, దీనివల్ల మెరిట్ ఉన్న అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలను కోల్పోయే అవకాశం ఉందన్నారు. జూన్ 11న జరిగిన ప్రిలిమ్స్కు పెద్దఎత్తున అభ్యర్థులు హాజరై మెయిన్స్కు సిద్ధమవుతున్నందున ప్రిలిమ్స్ అన్నది నిర్ణయాత్మక పరీక్షగా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అందువల్ల మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరగకుండా చూడాలన్న ఉద్దేశంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. బయోమెట్రిక్తో సహా నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని రకాల సూచనలు, నిబంధనలను అమలు చేస్తూ ప్రిలిమ్స్ పరీక్షను తిరిగి నిర్వహించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఆదేశించారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల వివరాలను ధ్రువీకరించుకోకుండా కమిషన్ దాఖలు చేసిన కౌంటరుపై న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌంటరుపై అసంతృప్తి వ్యక్తం చేయని పక్షంలో కోర్టు తన విధుల్లో విఫలమైనట్లేనని వ్యాఖ్యానించారు.
ప్రిలిమ్స్ కూడా కీలకమే
కమిషన్ కేవలం పరీక్షను మాత్రమే రద్దు చేసిందని, నోటిఫికేషన్ను రద్దు చేయలేదని, అందువల్ల నోటిఫికేషన్లోని నిబంధనను అమలు చేయాల్సిందేనని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారని న్యాయమూర్తి తెలిపారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా, ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు కమిషన్ పేర్కొంటోందన్నారు. ఇలాంటి ఆరోపణలను ఆధారాలతో నిరూపిస్తే తప్ప కోర్టు విచక్షణాధికారం కింద పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఒకరి బదులు మరొకరు (నకిలీ) రాసినట్లు నిర్దిష్ట ఆరోపణ లేకపోయినప్పటికీ నిర్వహణలో లోపాలతో ఇది జరిగే అవకాశం ఉందన్నది పిటిషనర్ల వాదన అని న్యాయమూర్తి పేర్కొన్నారు. కమిషన్ సమర్పించిన వివరాలను పరిశీలిస్తే అందులో లోపాలున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. సంతకాల్లో ఉన్న కొద్దిపాటి తేడాను పరీక్షల సమయంలో కనిపెట్టలేమని, ఈ పిటిషన్లు తప్ప.. పరీక్షల నిర్వహణపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ప్రిలిమ్స్... ప్రాథమిక పరీక్ష మాత్రమేనని, నియామకానికి మెయిన్స్ కీలకమైందన్న అంశాన్ని ఈ కోర్టు పరిశీలించిందన్నారు. ప్రిలిమ్స్ ప్రాథమిక పరీక్ష అయినప్పటికీ నిర్ణయాత్మకమేనని, దీని నిర్వహణలో కమిషన్ వైఫల్యం కనిపిస్తోందన్నారు.
ఇదీ నేపథ్యం...
గ్రూప్-1లో పోస్టుల భర్తీకి 2022 ఏప్రిల్ 26న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అదే ఏడాది అక్టోబరు 16న ప్రిలిమ్స్ నిర్వహించారు. ప్రశ్నపత్రం లీకవడంతో దాన్ని రద్దు చేసి తిరిగి ఈ ఏడాది జూన్ 11న నిర్వహించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న ఒక నిబంధన ప్రకారం అభ్యర్థులు పరీక్షకు 30 నిమిషాలముందు హాజరై బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా ఫొటో, చేతి బొటనవేలి ముద్రలు ఇవ్వాల్సి ఉంది. 2022 అక్టోబరులో హాల్టికెట్లు జారీ అయినవారికి బయోమెట్రిక్లు తీసుకున్నారు. అయితే రెండోసారి పరీక్ష నిర్వహించినప్పుడు ఆ నిబంధనను విస్మరించారు. దీనివల్ల పారదర్శకంగా పరీక్షలు నిర్వహించలేదన్న ఆందోళన వ్యక్తమై వాటిని రద్దు చేయాలంటూ జూన్ 13న కమిషన్ ఛైర్మన్కు పలువురు వినతిపత్రం సమర్పించారు. దీనిపై నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Jogi ramesh: ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
సుమారు 16 లక్షల మందికి ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని మంత్రులు జోగి రమేశ్, మేరుగు నాగార్జున అన్నారు. -
సిరా చుక్క.. తీర్పు రాసే వేళ..
పార్టీల పోటాపోటీ ప్రచారాలు.. హామీలు.. నేతల విమర్శలు ప్రతివిమర్శలు.. వార్రూమ్లలో ఎత్తులు పైఎత్తులు.. అన్నీ చూసి... చెప్పినవి విని... ఆకళింపు చేసుకున్న తెలంగాణ ఓటరు వచ్చే అయిదేళ్లకు తమ ప్రతినిధులను ఎన్నుకునే ఘడియలు వచ్చేశాయి. -
7 గంటల నుంచి పోలింగ్
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుంది. సిబ్బంది బుధవారం సాయంత్రానికి ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. -
ఓటు బాటలో పోటెత్తారు
సొంతూరిలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి ఓటర్లు బుధవారం పెద్దఎత్తున తరలివెళ్లారు. నగరంలో చదువుకుంటున్న విద్యార్థులు.. ఉద్యోగాలు చేస్తున్న యువత.. ఉపాధి నిమిత్తం ఇక్కడ స్థిరపడినవారు స్వగ్రామాలకు వెళ్లేందుకు రావడంతో.. జూబ్లీ బస్స్టేషన్(జేబీఎస్), మహాత్మా గాంధీ బస్స్టేషన్(ఎంజీబీఎస్)లతో పాటు రైల్వే స్టేషన్లూ కిక్కిరిశాయి. -
కృత్రిమ మేధతో సమస్యలకు చెక్!
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు కృత్రిమ మేధ శ్రేష్ఠతర కేంద్రాల(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్)ను నెలకొల్పేందుకు సమాయత్తమైంది. -
విదేశాల్లో దీక్షా దివస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని భారాస ప్రవాస విభాగాల ఆధ్వర్యంలో బుధవారం 52 దేశాల్లో దీక్షా దివస్ నిర్వహించారు. -
నేడు తిరుమలకు చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. -
ఓటేసేందుకు వీరు.. ఓటేయించేందుకు వారు
రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటున్నవారు, విద్యార్థులు తమ సొంతూళ్లలో ఓటేసేందుకు బస్సుల్లో ప్రయాణమయ్యారు. -
ఓట్ల వేటపై కాసుల ఆట
-
చంద్రబాబు ముందస్తు బెయిలుపై విచారణ వాయిదా
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. -
తెలంగాణలో ఓటర్లుగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు
తెలంగాణలో గురువారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఓటర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. -
అకాల వర్షానికి దెబ్బతిన్న పత్తి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పలు ప్రాంతాల్లో పంటలు, ఆస్తులు దెబ్బతిన్నాయి. భారీ వడగళ్లు పడటంతో నిజామాబాద్ గ్రామీణ, కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలో పత్తి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. -
ఆర్జీయూకేటీకి గ్రీన్ యూనివర్సిటీ పురస్కారం
బాసరలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ప్రతిష్ఠాత్మక ‘గ్రీన్ యూనివర్సిటీ అవార్డు-2023’కి ఎంపికైంది. -
పాస్పోర్టు దరఖాస్తుల విచారణ విధానంలో మార్పు
పాస్పోర్టు పెండింగ్ దరఖాస్తుల విచారణ అపాయింట్మెంట్లను 250కి పెంచుతున్నట్లు ప్రాంతీయ పాస్పోర్టు అధికారిణి (ఆర్పీవో) స్నేహజ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
నేడు సుప్రీంకోర్టు ముందుకు ఫైబర్నెట్ ముందస్తు బెయిల్ కేసు
ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో గురువారం విచారణకు రానుంది. -
సీబీఐకి స్కిల్ కేసు అప్పగింత పిల్పై విచారణ వాయిదా
నైపుణ్యాభివృద్ధి సంస్థ (స్కిల్) కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ హైకోర్టులో వేసిన పిల్పై విచారణ డిసెంబరు 13కు వాయిదా పడింది. -
సినీనటి జయప్రదకు సుప్రీంకోర్టులో ఉపశమనం
సినిమా థియేటర్ కార్మికుల వేతనాల నుంచి మినహాయించుకున్న ఈఎస్ఐ విరాళాన్ని ఆ సంస్థకు జమ చేయలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి, మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. -
హైదరాబాద్లో డీసీపీ, ఏసీపీ సస్పెన్షన్
ఎన్నికల్లో డబ్బు తరలింపు విషయంలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం రచ్చకెక్కింది. ఈ వ్యవహారంలో నలుగురు సస్పెన్షన్కు గురి కాగా.. మరొకరిని సర్వీసు నుంచి తొలగించారు. -
ఇదీ సంగతి!


తాజా వార్తలు (Latest News)
-
AP HighCourt: ఎస్సై నియామక ప్రక్రియపై హైకోర్టులో విచారణ
-
బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్ చెరలో 10 నెలల చిన్నారి మృతి..!
-
పన్నూ హత్య కుట్ర కేసు.. భారత వ్యక్తిపై అమెరికా అభియోగాలు
-
EastCoast Train: ఈస్ట్కోస్టు ఎక్స్ప్రెస్లో పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు
-
Tata Tech Listing: టాటా టెక్ బంపర్ లిస్టింగ్.. ఒక్కో లాట్పై రూ.21 వేల లాభం
-
Elon Musk: ‘పోతే పోండి.. బెదిరించొద్దు’.. అడ్వర్టైజర్లపై మస్క్ ఆగ్రహం!