‘ఆకర్షణ’ను చూసి గర్విస్తున్నా
‘చదువుకోవడం.. నేర్చుకోవడంలోని ఆనందాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వ్యాప్తి చేస్తున్న విద్యార్థిని ఆకర్షణ సతీశ్ను చూసి గర్విస్తున్నా’ అని ప్రధాని అన్నారు.
సేకరించిన 6 వేల పుస్తకాలతో 7 గ్రంథాలయాల ఏర్పాటు
మన్ కీ బాత్లో హైదరాబాద్ విద్యార్థిని అభినందించిన ప్రధాని మోదీ
ఈనాడు, హైదరాబాద్: ‘చదువుకోవడం.. నేర్చుకోవడంలోని ఆనందాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వ్యాప్తి చేస్తున్న విద్యార్థిని ఆకర్షణ సతీశ్ను చూసి గర్విస్తున్నా’ అని ప్రధాని అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా మోదీ ఆమెను అభినందించారు. ఆకర్షణ చేసిన ప్రయత్నం గురించి ప్రధాని 2 నిమిషాల 7 సెకన్ల పాటు మాట్లాడారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఏడో తరగతి విద్యార్థిని ఆకర్షణ.. ఇరుగు పొరుగువారి నుంచి సేకరించిన 6 వేల పాత పుస్తకాలతో ఇప్పటివరకు 7 గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది. 2021లో కొవిడ్ సమయంలో ఒక రోజు ఆకర్షణ తన తల్లిదండ్రులతో కలిసి ఆహారాన్ని అందించడానికి ఎంఎన్జే కేన్సర్ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులకు నొప్పి నుంచి ధ్యాస పఠనం వైపు మళ్లడానికి పుస్తకాలు బహూకరించాలనే ఆలోచన వచ్చింది. అక్కడే తొలుత ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసింది. వచ్చేవారం సిద్దిపేటలో ఎనిమిదో గ్రంథాలయాన్ని మంత్రి హరీశ్ ప్రారంభించబోతున్నారు. అక్టోబరు 15న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి నాటికి పదోది ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆకర్షణ తెలిపింది.
ఆకర్షణకు పేరు పెట్టింది అబ్దుల్ కలాం..
తన కుమార్తెకు ఆకర్షణ అనే పేరు కలాం పెట్టారని తండ్రి సతీశ్కుమార్ గుర్తుచేసుకున్నారు. ఆయన అప్పట్లో కలాం దగ్గర విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం ప్రైవేట్ హెల్త్ కేర్ సంస్థలో సీనియర్ మేనేజర్గా చేస్తున్నారు. అక్టోబరులో రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆకర్షణను కలుస్తానని మోదీ హామీ ఇచ్చారు. నిజామాబాద్లో కలుసుకునేలా అపాయింట్మెంట్ ఖరారు చేసే అవకాశం ఉందని సతీశ్ ‘ఈనాడు’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తమ పనితీరు కళాశాలలకు.. బ్రాంచ్ల ఏర్పాటుకు అనుమతి
ఇక ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలలు సైతం ఆఫ్ క్యాంపస్ విధానంలో మరికొన్ని కళాశాలలను నడుపుకోవచ్చు. -
పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. -
ఖైదీలపై ఏడాదికి రూ.2,528 కోట్ల ఖర్చు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఖైదీలపై 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,528 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్ర తెలిపారు. -
ఖైదీలపై ఏడాదికి రూ.2,528 కోట్ల ఖర్చు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఖైదీలపై 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,528 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్ర తెలిపారు. -
పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. -
ఉత్తమ పనితీరు కళాశాలలకు.. బ్రాంచ్ల ఏర్పాటుకు అనుమతి
ఇక ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలలు సైతం ఆఫ్ క్యాంపస్ విధానంలో మరికొన్ని కళాశాలలను నడుపుకోవచ్చు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే బ్రాంచ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. -
గ్రూప్-1 చిక్కుముడి వీడేదెలా?
రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగ ప్రకటనపై కొత్త ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని...2024 ఫిబ్రవరి 1న తొలి ఉద్యోగ ప్రకటనగా గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొంది. -
అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుస్తోంది
రాష్ట్రంలో నియంతపాలన నుంచి బయట పడ్డామని పేర్కొంటూ సచివాలయ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. -
రేవంత్ ఇంటికి నిరంతర విద్యుత్తు
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా గురువారం రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆయన ఇల్లు, కార్యాలయం, ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో విద్యుత్తు సరఫరా తదితర అంశాలపై విద్యుత్తుశాఖ సమీక్షించింది. -
దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాంపల్లి నియోజకవర్గంలోని బోయిగూడ కమాన్ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన రజినికి రేవంత్రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. -
కొత్త ప్రభుత్వానికి అండగా ఉంటాం
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాష్ట్ర ఉద్యోగుల సంఘం అభినందనలు తెలపింది. -
ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తకు ఐజీయూ పురస్కారం
జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ లబానీ రే ను ప్రతిష్ఠాత్మక ఇండియన్ జియోఫిజికల్ యూనిట్(ఐజీయూ)-అన్ని తల్వానీ స్మారక పురస్కారం వరించింది. -
జనవరిలో రాష్ట్రానికి ఈసీ బృందం
లోక్సభ ఎన్నికల ఏర్పాట్ల వ్యూహరచన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం వచ్చే జనవరి మొదటి వారంలో రాష్ట్రానికి రానుంది. -
18 నుంచి రాష్ట్రపతి శీతాకాల విడిది
ఈ నెల 18 నుంచి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శీతాకాల విడిదికి నగరానికి రానున్నారు. -
కేసీఆర్ను కలిసిన చింతమడక గ్రామస్థులు
భారాస అధినేత కేసీఆర్ను కలిసేందుకు ఆయన స్వగ్రామమైన సిద్దిపేట గ్రామీణ మండలం చింతమడక గ్రామస్థులు బుధవారం ఎనిమిది బస్సుల్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి తరలివచ్చారు. -
రాష్ట్ర సహకార యూనియన్ ఛైర్మన్ పదవికి రాజీనామా
తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ ఛైర్మన్, భారాస నేత రాజా వరప్రసాద్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. -
మాజీ మంత్రి కార్యాలయంలోని ఫర్నిచర్ తరలింపు!
మంత్రుల పేషీల నుంచి చిన్న కాగితం కూడా బయటకు వెళ్లడానికి వీలులేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలిచ్చిన 24 గంటలలోపే రవీంద్రభారతి ప్రాంగణంలో బుధవారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేషీ నుంచి ఫర్నిచర్ తరలిస్తున్న వైనం వెలుగుచూసింది. -
పోలీసుశాఖ ప్రక్షాళన ఖాయం!
పదేళ్ల భారాస ప్రభుత్వం రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి పోలీసుశాఖకు మౌలిక వసతులు కల్పించినా పరిపాలనాపరమైన విషయాల్లో అలసత్వం ప్రదర్శించిందన్న వాదన ఉంది. -
నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. వరి కోతలు మొదలై రెండు నెలలు అవుతోంది. -
కారు దిగొచ్చి.. దివ్యాంగులతో గవర్నర్ ముచ్చట
రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం ట్యాంక్బండ్ మార్గంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
ప్రమాదాల మాసం డిసెంబరు..!
రహదారిపై ప్రయాణించేటప్పుడు వాహనం అదుపు తప్పినా.. మరో వాహనం ఢీకొట్టినా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.