వారు అనర్హులు
రాష్ట్ర మంత్రిమండలి నామినేటెడ్ ఎమ్మెల్సీల పదవుల కోసం సిఫార్సు చేసిన ఇద్దరి పేర్లను తెలంగాణ గవర్నర్ తమిళిసై తిరస్కరించారు.
నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్లపేర్లు తిరస్కరించిన గవర్నర్
దస్త్రాలు వెనక్కి.. సీఎం, సీఎస్లకు తమిళిసై లేఖ
రాజకీయాలతో సంబంధం లేని అర్హులనే సిఫార్సు చేయాలని సూచన
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర మంత్రిమండలి నామినేటెడ్ ఎమ్మెల్సీల పదవుల కోసం సిఫార్సు చేసిన ఇద్దరి పేర్లను తెలంగాణ గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, భారాస నేత దాసోజు శ్రవణ్ల పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపగా.. ఆర్టికల్ 171(5) మేరకు గవర్నర్ నామినేటెడ్ కోటా కింద వారిద్దరికీ తగిన అర్హతలు లేవని, కళలు, సాహిత్యం, సైన్స్ రంగాల్లో వీరిద్దరూ పనిచేయనందున.. నామినేట్ చేయడం కుదరదంటూ.. ఈనెల 19వ తేదీన దస్త్రాలను వెనక్కి పంపారు. సత్యనారాయణ, శ్రవణ్ల తిరస్కరణకు కారణాలు వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు, సీఎస్ శాంతికుమారికి లేఖలు రాశారు. సహకార ఉద్యమం, సాహిత్యం, కళలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రావీణ్యం ఉన్న, అర్హత గల వ్యక్తులను మంత్రులు సిఫార్సు చేస్తే.. ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎందరో అర్హులైన ప్రముఖులున్నా వారిని పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయాలతో సంబంధం ఉన్నవారి పేర్లను సిఫార్సు చేయడం సరికాదని, ఇకపై రాజకీయాలతో సంబంధం లేని అర్హులనే సిఫార్సు చేయాలని ఆమె సూచించారు.
తిరస్కరణకు ఇవీ కారణాలు
‘‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5)ల కింద సభ్యులను నామినేట్ చేయడానికి గవర్నర్కు అధికారం ఉంది. ఆచరణాత్మక అనుభవం, పరిజ్ఞానం, సాహిత్యం, సైన్స్, కళ, సహకార ఉద్యమం, సామాజిక సేవలో ఉన్న వ్యక్తులను కలిగి ఉంటుంది. కుర్రా సత్యనారాయణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. అయితే సాహిత్యం, సైన్స్, కళల్లో పరిజ్ఞానం లేదని, సహకార ఉద్యమంతో పాటు ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఇంటెలిజెన్స్ గానీ ఇతర వర్గాల నుంచి కానీ సమాచారం లేదు.
దాసోజు శ్రవణ్ సైతం రాజకీయాలతో పాటు కార్పొరేట్, విద్యారంగాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కానీ సాహిత్యం, సైన్స్, కళలు, సహకార ఉద్యమం, సామాజిక సేవల్లో ప్రత్యేక పరిజ్ఞానం లేదు గానీ కొద్దికాలం పనిచేసినట్లు ఉంది. 171(5) అధికరణ కింద ఉండాల్సిన అర్హతలకు సంబంధించిన స్వల్ప నివేదిక మినహా ఇతర లిఖితపూర్వక సమాచారమేదీ లేదు. ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు ఇతర సంస్థలు సైతం ఆయనకు పై అర్హతలున్నట్లు నివేదించలేదు. ఎమ్మెల్సీలుగా ఎవరిని నామినేట్ చేయాలో, ఎవరిని చేయకూడదో ప్రజాప్రాతినిధ్య చట్టంలో స్పష్టంగా ఉంది’’ అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TSRTC: మహిళలకు ఉచిత ప్రయాణంపై నేడు మార్గదర్శకాలు
రాష్ట్రంలో ఈ నెల 9వతేదీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. -
పగటి పూటే వణికిస్తోంది.. తుపానుతో పడిపోయిన ఉష్ణోగ్రతలు
తుపాను ప్రభావంతో రాష్ట్రంలో మధ్యాహ్న సమయంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. సాధారణం కన్నా తక్కువ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. -
TS Cabinet: కొత్త.. పాత కలయికగా మంత్రివర్గం
కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువుదీరనున్న మంత్రివర్గం కొత్త..పాత కలయికగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సహా 12 మంది ప్రమాణ స్వీకారం చేశారు. -
Free Bus Travel: రేపటి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ఈ నెల 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. -
కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కనులపండువగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. -
పాలకులం కాదు.. సేవకులం
‘మేం పాలకులం కాదు.. సేవకులం. ఈ రోజు నుంచి విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది’ అని నూతన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. -
శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్కుమార్
తెలంగాణ శాసనసభ స్పీకర్గా వికారాబాద్ కాంగ్రెస్ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్కుమార్ (59)ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి ఆశావహుడిగా ఉన్న ఆయన్ను అధిష్ఠానం అనూహ్యంగా సభాపతి పదవికి ఎంపికచేసింది. -
Revanth Reddy: విద్యుత్పైనే తొలి గురి!.. ఆ శాఖ కార్యదర్శిపై సీఎం ఆగ్రహం
మంత్రివర్గ తొలి సమావేశం సందర్భంగా.. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పనితీరుపై వాడి వేడిగా చర్చ సాగింది. విద్యుత్ రంగంలో ఏం జరిగిందో తెలుపుతూ సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. -
సచివాలయంలో అధికార పీఠంపై..
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్రెడ్డి గురువారం సాయంత్రం సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. -
జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితా
ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే జనవరి అయిదో తేదీ వరకు దేశవ్యాప్తంగా ఉన్న పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల ప్రక్షాళన వ్యవహారాలను అధికారులు చేపట్టాలని ఎన్నికల సంఘం సూచించింది. -
కళాశాలల్లో స్వల్పకాల నైపుణ్యాభివృద్ధి కోర్సులు
డిగ్రీ విద్యార్థుల్లో ప్రస్తుతం అవసరమైన నైపుణ్యాలను పెంచే దిశగా యూజీసీ ముందుకెళ్తోంది. అన్ని కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాలు స్వల్పకాల నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రారంభించుకునేందుకు పచ్చజెండా ఊపింది. -
అద్దం లాంటి రోడ్డు.. అలసత్వమే అడ్డు
రూ.కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టిన అధికారులు మధ్యలో ఉన్న విద్యుత్తు స్తంభాలను తొలగించలేదు. దీంతో అది వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. -
Jeevan Reddy: ఆర్మూర్లో జీవన్రెడ్డి మాల్కు కరెంటు కట్
ఓ షాపింగ్ మాల్ స్థలం అద్దె, విద్యుత్ బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోవడంతో సంబంధిత సంస్థలు చర్యలకు దిగాయి. -
‘అభినవ మొల్ల’ లక్ష్మీనరసమ్మ మృతి
భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత్రి డా.చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ (85) గురువారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. -
కలుషిత ఆహారం తిని విద్యార్థులకు అస్వస్థత
కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బోర్గాం(పి)లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. -
విద్యుత్తు ఉద్యోగ సంఘం నాయకుడిపై సస్పెన్షన్ ఎత్తివేత
తెలంగాణ విద్యుత్తు వర్కర్స్ యూనియన్(బి-2871) రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగరాజు సస్పెన్షన్ను దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ ఎత్తివేసింది. -
‘జలశక్తి’ సమావేశాన్ని వాయిదా వేయండి
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణ విషయంలో శుక్రవారం ఏపీ, తెలంగాణలతో జలశక్తి శాఖ దిల్లీలో నిర్వహించే సమావేశాన్ని వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి కేంద్రాన్ని కోరారు. -
రాచకొండలో అత్యధికం.. ములుగులో అత్యల్పం
తెలంగాణలో 2022 సంవత్సరంలో జరిగిన నేరాల్లో ఎక్కువగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే చోటు చేసుకున్నాయి. -
డెల్టా ర్యాంకింగ్లో తిర్యాణికి తొలిస్థానం
నీతి ఆయోగ్ గురువారం ప్రకటించిన యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం డెల్టా ర్యాంకుల్లో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి బ్లాక్ తొలిస్థానాన్ని కైవసం చేసుకొంది. -
ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు రాజీనామా
వరంగల్ కేంద్రంగా విద్యుత్తు వినియోగదారులకు సేవలందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీˆఎల్) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) అన్నమనేని గోపాలరావు తన పదవికి రాజీనామా చేశారు. -
మురుగు నీటి సమస్యపై నివేదిక ఇవ్వండి
హైదరాబాద్ తిలక్నగర్ పార్సీకాలనీలోని మురుగు నీటి సమస్యపై అధ్యయనంచేసి ఈ నెల 20వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని జీహెచ్హెంసీ, హైదారాబాద్ మెట్రో నీటి సరఫరా, జలమండలిని హైకోర్టు ఆదేశించింది.


తాజా వార్తలు (Latest News)
-
Mahua Moitra: మహువా మెయిత్రాపై బహిష్కరణ వేటు
-
Tata group: మరో ఐఫోన్ల ప్లాంట్కు టాటాలు రెడీ.. 50 వేల మందికి ఉపాధి!
-
Revanth Reddy: అంతకుమించిన తృప్తి ఏముంటుంది!: సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్
-
UPI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. ఆటో డెబిట్, ఆ యూపీఐ చెల్లింపుల పరిమితి పెంపు
-
Fake Toll Plaza: రోడ్డు వేసి.. నకిలీ టోల్ ప్లాజా కట్టి.. ₹కోట్లు కొట్టేసి: గుజరాత్లో ఘరానా మోసం
-
Flipkart: ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్