TS TET Results: రేపు టెట్ ఫలితాలు
ఉపాధ్యాయ అర్హత పరీక్ష( టెట్) ఫలితాలు ఈ నెల 27న వెలువడనున్నాయి. ఈ నెల 15న పరీక్ష జరగగా పేపర్-1కు 2.26 లక్షలు, పేపర్-2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు.
ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష( టెట్) ఫలితాలు ఈ నెల 27న వెలువడనున్నాయి. ఈ నెల 15న పరీక్ష జరగగా పేపర్-1కు 2.26 లక్షలు, పేపర్-2కు 1.90 లక్షల మంది హాజరయ్యారు. ఈ నెల 27న ఫలితాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, తుది నిర్ణయం ఉన్నతాధికారులు తీసుకుంటారని ఎస్సీఈఆర్టీ వర్గాలు తెలిపాయి.
ఫిజియోథెరపిస్టు పోస్టులకు వెబ్ఆప్షన్లు
వైద్య విధాన పరిషత్లో ఫిజియోథెరపిస్టు పోస్టులకు ఈ నెల 27న జరిగే ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు పూర్వ జోన్ల ప్రకారం ఈ నెల 26 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలని టీఎస్పీఎస్సీ కోరింది.
సీటీఈటీ ఫలితాలు విడుదల
ఆగస్టు 20న నిర్వహించిన కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటీఈటీ) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఫలితాల కోసం వెబ్సైట్ https://ctet.nic.in ను సంప్రదించవచ్చని సీబీఎస్ఈ సూచించింది.
మిగిలిన ఎంబీబీఎస్ సీట్లకు చివరి కౌన్సెలింగ్
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మూడు విడతల కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన కన్వీనర్ కోటా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి మంగళవారం సాయంత్రం 4 గంటల్లోపు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కాళోజీ వర్సిటీ ప్రకటనలో తెలిపింది. ఖాళీలు, ఇతర వివరాలను www.knruhs.telangana.gov.in వెబ్సైట్లో పరిశీలించాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు గ్యారంటీలతో ఆరంభం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్లోని లాల్బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
పాక్షిక మంత్రివర్గమేనా?
రేవంత్రెడ్డితో పాటు గురువారం మధ్యాహ్నం మంత్రులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. బుధవారం దిల్లీలో ఏఐసీసీ నాయకులతో సమావేశమైన రేవంత్రెడ్డి.. మంత్రివర్గం గురించి కూడా చర్చించినట్లు సమాచారం. -
4.72 లక్షల ఎకరాల్లో పంట నష్టం
రాష్ట్రంలో మిగ్జాం తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలతో 4.72 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. -
గ్యారంటీలకు ఏటా రూ.70 వేల కోట్లు!
ఎన్నికల హామీగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు ఏటా సుమారు రూ. 70 వేల కోట్లు అవసరమని అంచనా. -
ప్రమాణ స్వీకారానికి రండి..
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని పీసీసీ అధ్యక్షుడు, కాబోయే సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలకు బుధవారం బహిరంగ లేఖ రాశారు. -
దారి దాటేలోగా... దారుణమే జరిగింది!
ప్రసవవేదన పడుతున్న నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించే దారి సక్రమంగా లేక... సకాలంలో వైద్యం అందక ఓ పసిబిడ్డ పుట్టీపుట్టగానే కన్నుమూసింది. -
ఉత్తమ పనితీరు కళాశాలలకు.. బ్రాంచ్ల ఏర్పాటుకు అనుమతి
ఇక ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలలు సైతం ఆఫ్ క్యాంపస్ విధానంలో మరికొన్ని కళాశాలలను నడుపుకోవచ్చు. -
ఖైదీలపై ఏడాదికి రూ.2,528 కోట్ల ఖర్చు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఖైదీలపై 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,528 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్ర తెలిపారు. -
పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. -
గ్రూప్-1 చిక్కుముడి వీడేదెలా?
రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగ ప్రకటనపై కొత్త ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని...2024 ఫిబ్రవరి 1న తొలి ఉద్యోగ ప్రకటనగా గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొంది. -
అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుస్తోంది
రాష్ట్రంలో నియంతపాలన నుంచి బయట పడ్డామని పేర్కొంటూ సచివాలయ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. -
రేవంత్ ఇంటికి నిరంతర విద్యుత్తు
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా గురువారం రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆయన ఇల్లు, కార్యాలయం, ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో విద్యుత్తు సరఫరా తదితర అంశాలపై విద్యుత్తుశాఖ సమీక్షించింది. -
దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాంపల్లి నియోజకవర్గంలోని బోయిగూడ కమాన్ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన రజినికి రేవంత్రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. -
కొత్త ప్రభుత్వానికి అండగా ఉంటాం
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాష్ట్ర ఉద్యోగుల సంఘం అభినందనలు తెలపింది. -
ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తకు ఐజీయూ పురస్కారం
జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ లబానీ రే ను ప్రతిష్ఠాత్మక ఇండియన్ జియోఫిజికల్ యూనిట్(ఐజీయూ)-అన్ని తల్వానీ స్మారక పురస్కారం వరించింది. -
జనవరిలో రాష్ట్రానికి ఈసీ బృందం
లోక్సభ ఎన్నికల ఏర్పాట్ల వ్యూహరచన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం వచ్చే జనవరి మొదటి వారంలో రాష్ట్రానికి రానుంది. -
18 నుంచి రాష్ట్రపతి శీతాకాల విడిది
ఈ నెల 18 నుంచి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శీతాకాల విడిదికి నగరానికి రానున్నారు. -
కేసీఆర్ను కలిసిన చింతమడక గ్రామస్థులు
భారాస అధినేత కేసీఆర్ను కలిసేందుకు ఆయన స్వగ్రామమైన సిద్దిపేట గ్రామీణ మండలం చింతమడక గ్రామస్థులు బుధవారం ఎనిమిది బస్సుల్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి తరలివచ్చారు. -
రాష్ట్ర సహకార యూనియన్ ఛైర్మన్ పదవికి రాజీనామా
తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ ఛైర్మన్, భారాస నేత రాజా వరప్రసాద్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. -
మాజీ మంత్రి కార్యాలయంలోని ఫర్నిచర్ తరలింపు!
మంత్రుల పేషీల నుంచి చిన్న కాగితం కూడా బయటకు వెళ్లడానికి వీలులేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలిచ్చిన 24 గంటలలోపే రవీంద్రభారతి ప్రాంగణంలో బుధవారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేషీ నుంచి ఫర్నిచర్ తరలిస్తున్న వైనం వెలుగుచూసింది. -
పోలీసుశాఖ ప్రక్షాళన ఖాయం!
పదేళ్ల భారాస ప్రభుత్వం రూ.వందల కోట్లు ఖర్చుపెట్టి పోలీసుశాఖకు మౌలిక వసతులు కల్పించినా పరిపాలనాపరమైన విషయాల్లో అలసత్వం ప్రదర్శించిందన్న వాదన ఉంది.