దిల్లీ మద్యం కేసులో.. ఎమ్మెల్సీ కవితకు ఊరట
దిల్లీ మద్యం కేసులో ఈడీ విచారణ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తాత్కాలిక ఊరట లభించింది. నవంబరు 20వ తేదీ వరకు ఆమెను విచారణకు పిలవవద్దని ఈడీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
నవంబరు 20 వరకు విచారణకు పిలవొద్దు
ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశం
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో ఈడీ విచారణ నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు తాత్కాలిక ఊరట లభించింది. నవంబరు 20వ తేదీ వరకు ఆమెను విచారణకు పిలవవద్దని ఈడీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దిల్లీ మద్యం కేసులో మహిళగా ఉన్న తనను ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం పిటిషన్ విచారణ చేపట్టింది. కవితను తాము విచారణకు పిలవడం లేదని, ఒకవేళ పిలిచినా పది రోజుల ముందుగానే సమాచారం ఇస్తామని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు ధర్మాసనానికి తెలిపారు. విచారణకు పిలిచే అంశంపై ఈడీ స్పష్టతనివ్వాలని కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి కోరారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ‘ఈ విషయాన్ని మేం వింటాం.. అప్పటివరకు ఆమెను ప్రశ్నించేందుకు పిలవొద్దు’ అని స్పష్టం చేశారు. మహిళలను దర్యాప్తు సంస్థల కార్యాలయాలకు పిలవడం, ప్రశ్నించడంపై కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తుండగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ జోక్యం చేసుకున్నారు. ‘మహిళలకు కొన్ని రక్షణలు ఉండాలి. అదే సమయంలో సాక్షిగా, నిందితురాలిగా మరేవిధంగానూ ఓ మహిళను ప్రశ్నించడానికి పిలవొద్దని మీరు చెప్పకూడదు. చట్టాల దుర్వినియోగంతో పలు ఇతర రకాల కేసులుంటాయి. అన్నింటినీ ఒకే కోవలో చూడలేం’ అని వ్యాఖ్యానించారు. దీనికి సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి స్పందిస్తూ పిటిషన్ విచారణలో ఉండగానే సమన్లు జారీ చేశారని తెలుపుతుండగా ఈడీ తరఫు న్యాయవాది ఎస్.వి.రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలను విచారణకు పిలిచినప్పుడు మహిళా అధికారులు ఉంటున్నారని తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అనేక రకాల కేసులుంటాయని, అన్నింటినీ ఒక వాక్యంలోనే తేల్చేయలేమన్నారు. అనంతరం కేసు తదుపరి విచారణను ధర్మాసనం నవంబరు 20వ తేదీకి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TS High Court: రోడ్డు ప్రమాదానికి డ్రైవర్ పక్కనున్న వ్యక్తీ కారణమంటే ఎలా..?
రోడ్డు ప్రమాద కారణాలను డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తికి ఆపాదించి బీమా పరిహారం సగానికి తగ్గించి ఇవ్వటాన్ని హైకోర్టు తప్పుబట్టింది. -
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. -
Revanth Reddy: మాటల్లో ధాటి... వ్యూహాల్లో మేటి
తూటాల్లాంటి మాటలు.. సూటిగా, కుండబద్దలు కొట్టినట్లుండే ప్రసంగాలు.. ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవడంలో దూకుడు.. కార్యకర్తలు, నాయకులను ముందుకు నడపడంలో నాయకత్వ పటిమ.. ఇవన్నీ ఆయన ప్రత్యేకతలు. -
తడిసి ముద్దవుతున్న రాష్ట్రం
ఏపీలో తీరం దాటిన తీవ్ర తుపాను మిగ్జాం ప్రభావంతో రాష్ట్రం తడిసిముద్దవుతోంది. ఈదురుగాలులతో ప్రజలు వణికిపోతున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. -
Revanth Reddy: ఇటు ఎమ్మెల్యేలు.. అటు అధిష్ఠానం అండ!
ఇటు మెజార్టీ ఎమ్మెల్యేలు.. అటు కాంగ్రెస్ అధిష్ఠానం అండగా నిలవడంతో ముఖ్యమంత్రి పదవి విషయంలో రేవంత్రెడ్డికి పెద్దగా అవరోధాలు ఎదురుకాలేదు. -
Revanth Reddy: తుపానుపై అప్రమత్తంగా ఉండాలి: అధికారులకు రేవంత్ సూచనలు
మిగ్ జాం తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓ ప్రకటనలో సూచించారు. -
Polavaram: పోలవరంపై కేంద్రం తీవ్ర ఆగ్రహం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వద్దన్నా నీళ్లు నింపుతున్నారని, కాఫర్డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని నిలదీసింది. -
Tirumala: ఇదేమి అన్న ప్రసాదం?
తిరుమలలో నిత్యాన్నదానంపై వివాదాలు ముసురుకుంటున్నాయి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో నాణ్యత సరిగ్గా లేదంటూ పలువురు భక్తులు తితిదే సిబ్బందిపై తిరగబడ్డారు. -
జైళ్లశాఖ ఉత్పత్తుల్లో మూడో స్థానంలో తెలంగాణ
దేశవ్యాప్తంగా ఖైదీలు చేపట్టిన వస్తు ఉత్పత్తుల్లో తెలంగాణ జైళ్లశాఖ మూడో స్థానంలో నిలిచింది. 2022 సంవత్సరంలో దేశంలోని ఖైదీలందరు కలిసి రూ.267.03 కోట్ల మేర ఉత్పత్తులు చేస్తే.. తెలంగాణలో రూ.34కోట్ల మేర జరిగాయి. -
విజయసాయిరెడ్డి పిటిషన్పై విచారణ పరిధి లేదు
వైకాపా ఎంపీ వి.విజయసాయిరెడ్డి పిటిషన్పై విచారించే పరిధి ఈ కోర్టుకు లేదంటూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మంగళవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. -
Revanth Reddy: భద్రతా వలయంలో రేవంత్రెడ్డి నివాసం
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా అధిష్ఠానం ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. -
అయిదేళ్లలో తెలంగాణ నుంచి వచ్చింది రూ.84వేల కోట్లు
గత అయిదేళ్లలో పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వానికి రూ.84,904.04 కోట్లు రాగా... పన్నుల్లో వాటా రూపంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.85,628.78 కోట్లు ఇచ్చింది. -
నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి పకడ్బందీ ఏర్పాట్లు: సీఎస్
ఎల్బీ స్టేడియంలో ఈ నెల 7వతేదీ గురువారం ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. -
సంపత్రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు
జనగామ జిల్లా పరిషత్తు ఛైర్మన్, భారాస జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి మృతి తీరనిలోటని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. -
గవర్నర్ను కలిసిన డీజీపీ
రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన రవిగుప్తా మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
తెలుగు రాష్ట్రాల్లో ‘ఆటా’ వేడుకలు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) వేడుకలను 20 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు ఆటా అధ్యక్షుడు (ఎలెక్ట్), ఇక్కడి వేడుకల నిర్వహణ ఛైర్పర్సన్ జయంత్ చల్లా ఒక ప్రకటనలో తెలిపారు. -
నూతన సర్కారుకు సంపూర్ణ సహకారం అందిస్తాం: టీఎన్జీఓ
రాష్ట్ర అభివృద్ధి కోసం ఉద్యోగులుగా కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని, సంపూర్ణ సహకారం అందిస్తామని టీఎన్జీఓ సంఘం ప్రకటించింది. -
41% తగ్గిన రైతుల ఆత్మహత్యలు
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయి. 2021లో రైతులు 303 మంది, కౌలుదారులు 49 మంది, వ్యవసాయ కూలీలు ఏడుగురు కలిపి మొత్తం 359 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
వేలిముద్రల ద్వారా 449 మంది నిందితుల పట్టివేత
2022 గణాంకాల ప్రకారం వేలిముద్రల ద్వారా నిందితులను గుర్తించడంలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో, వేలిముద్రల డేటాబేస్ ఉన్న రాష్ట్రాల్లో ఆరో స్థానంలో ఉన్నట్లు జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. -
రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలి: ట్రెసా
ప్రజలకు సత్వర సేవలు అందే విధంగా కొత్త ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని, ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం(ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్కుమార్ విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణలో రూర్బన్ మిషన్ కింద 1,425 పనులు
శ్యామ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ (ఎస్పీఎంఆర్ఎం) కింద తెలంగాణలోని 17 పట్టణాల్లో 1,425 పనులు కొనసాగుతున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి నిరంజన్ జ్యోతి తెలిపారు.


తాజా వార్తలు (Latest News)
-
రేవంత్ సీఎం అని ముందే ఎలా చెప్పారు?.. తనదైన శైలిలో ఆన్సర్ చెప్పిన బండ్ల గణేశ్
-
Biden-Trump: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకపోతే.. నేనూ చేయనేమో: బైడెన్
-
Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీని ఇష్టపడటానికి కారణమదే: బ్రెండన్ మెక్కల్లమ్
-
TDP-Janasena: తెదేపా అధినేత చంద్రబాబుతో పవన్కల్యాణ్ భేటీ
-
Instagram: త్వరలో ఫేస్బుక్, ఇన్స్టాలో క్రాస్ చాటింగ్ బంద్!
-
Benjamin Netanyahu: అప్పుడు మీరంతా ఎందుకు మౌనంగా ఉన్నారు?.. మానవ హక్కుల సంస్థలపై నెతన్యాహు ఆగ్రహం