అయోమయం.. గందరగోళం
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పరీక్షల నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) పొరపాట్లతో అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా మారింది.
గ్రూప్-2కు చదవాలా? గ్రూప్-1కు సిద్ధం కావాలా?
పోటీ పరీక్షలకు సన్నద్ధతపై ఉద్యోగార్థుల్లో ఆందోళన
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పరీక్షల నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) పొరపాట్లతో అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా మారింది. ప్రశ్నపత్రాల లీకేజీ గతంలో వారిలో గందరగోళం సృష్టించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై నెలకొన్న తాజా పరిణామాలతో నవంబరులో జరిగే గ్రూప్-2 పరీక్షకు సన్నద్ధతపై అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ తుది కీ ప్రకారం మార్కులు అంచనా వేసుకున్న పలువురు అభ్యర్థులు ప్రధాన పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. అందులో ప్రతిభ చూపలేకపోయామని భావించినవారు గ్రూప్-2పై దృష్టి సారించారు. తాజా పరిణామాల నేపథ్యంలో గ్రూప్-1, గ్రూప్-2లలో దేనిపై దృష్టి పెట్టాలన్న విషయమై గందరగోళం నెలకొంది. మరోవైపు, గ్రూప్-1 మినహాయించి పరీక్షలు పూర్తయిన నోటిఫికేషన్లకు అభ్యర్థుల ప్రతిభ ఆధారితంగా జనరల్ ర్యాంకు జాబితాలను వెల్లడించేందుకు టీఎస్పీఎస్సీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
గ్రూప్-2 పరీక్షకు 5.51 లక్షల మంది...
గ్రూప్-1 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. వీరిలో 90 శాతానికిపైగా అభ్యర్థులు గ్రూప్-2 పరీక్షలకూ దరఖాస్తు చేశారు. గ్రూప్-2కు మొత్తం 5.51 లక్షల దరఖాస్తులు వచ్చాయి. తొలుత గ్రూప్-2 పరీక్షలను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూలు జారీ చేసింది. ప్రశ్నపత్రాల లీకేజీతో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. దాన్ని జూన్ 11న రెండోసారి నిర్వహించారు. జులై 1న గ్రూప్-4 పరీక్ష జరిగింది. వరుస పరీక్షలు, ప్రశ్నపత్రాల లీకేజీతో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యామని, గ్రూప్-2 పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు సమయం సరిపోదని, దాన్ని వాయిదా వేయాలంటూ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో పరీక్షను నవంబరు 2, 3 తేదీలకు కమిషన్ వాయిదా వేసింది. దానికి సన్నద్ధమవుతున్న తరుణంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు గ్రూప్-1 ప్రధాన పరీక్షపై దృష్టి పెట్టిన అభ్యర్థులు.. ఆ ప్రయత్నాన్ని విరమించి నెల రోజుల్లో జరిగే గ్రూప్-2 పరీక్షకు సన్నద్ధం కావాలంటే సమయం సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనరల్ ర్యాంకుల ప్రకటనకు కమిషన్ నిర్ణయం!
టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు 19 ఉద్యోగ ప్రకటనలకు రాతపరీక్షలు నిర్వహించింది. అయితే ప్రధానమైన గ్రూప్-1, గ్రూప్-2లు ఇంకా పూర్తికాలేదు. గ్రూప్-4 పరీక్ష జరిగినప్పటికీ తుది కీ వెల్లడించలేదు. గ్రూప్-3, డీఏవో, వసతిగృహ సంక్షేమాధికారుల పోస్టులకు రాతపరీక్షల తేదీలు ఖరారు కాలేదు. గ్రూప్-4తో పాటు ఇప్పటివరకు పరీక్షలు జరిగిన నోటిఫికేషన్లకు ఒక్కొక్కటిగా అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా మెరిట్ ర్యాంకులు ప్రకటించాలని కమిషన్ నిర్ణయించింది. ఇప్పటికే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు(ఏఈఈ) పోస్టులకు జనరల్ ర్యాంకుల జాబితాలు వెల్లడించింది. న్యాయ వివాదాలున్న నోటిఫికేషన్లను పక్కనపెట్టి మిగతావాటికి జాబితాల వెల్లడికి కార్యాచరణ పూర్తి చేసింది.
మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన తరువాత 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేసి.. తుది నియామక కార్యాచరణ మొదలుపెట్టాలని భావిస్తోంది. అప్పటివరకు ప్రతిభ ఆధారిత ర్యాంకులు ప్రకటిస్తే మార్కులు తెలుసుకునేందుకు అభ్యర్థులకు వీలుంటుందని అంచనా వేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. -
వైభవంగా శ్రీవారి పౌర్ణమి గరుడసేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి 7 గంటల నుంచి గరుడ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. -
శ్రీశైలంలో వైభవంగా లక్ష దీపోత్సవం
కార్తిక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో లక్ష దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దంపతులు దిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ మూడో వివాహం
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి ఎమ్మెల్సీ రెండో భార్య, కుమారుడు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. -
Kachidi Fish: ఒక్క చేప.. రూ.3.9 లక్షలు!
గోల్డెన్ ఫిష్గా పిలిచే అరుదైన కచిడి చేప సోమవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు సముద్రంలో చిక్కింది. దీనిని కొనుగోలు చేయడానికి స్థానిక వ్యాపారులు పోటీపడ్డారు. -
చంద్రబాబు, కొల్లు రవీంద్రలపై కఠిన చర్యలొద్దు
మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చేలా గత ప్రభుత్వ హయాంలో నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబు, ఎక్సైజ్శాఖ అప్పటి మంత్రి కొల్లు రవీంద్రపై తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. -
రైతుబంధు పంపిణీకి అనుమతి నిలిపివేత
నిబంధనలను అతిక్రమించిన నేపథ్యంలో రాష్ట్రంలో రైతు బంధు పథకం నిధుల పంపిణీని తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) పేర్కొంది. -
టన్నెల్లో చిక్కుకున్నవారి కోసం ప్రార్థించండి
ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటనలో చిక్కుకుపోయిన కార్మికులు సురక్షితంగా బయటికి రావాలని దీపం వెలిగించి దేవుణ్ని ప్రార్థించాలని రాష్ట్ర ప్రజలను ప్రధాని మోదీ కోరారు. -
అందరికీ అందని ఓటరు స్లిప్పులు!
మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుండగా.. ఇప్పటికీ పోలింగ్ కేంద్రాల వివరాలతో కూడిన ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తికాలేదు. -
24 గంటల్లో.. రూ.14 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల తనిఖీల్లో భాగంగా పోలీసులు గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో రూ.14 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
ఎస్టీయూటీఎస్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా పర్వత్రెడ్డి
రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం (ఎస్టీయూటీఎస్) నూతన రాష్ట్ర వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
డిసెంబరు 2 వరకు పోస్టల్ బ్యాలెట్కు అవకాశమివ్వండి
ఎన్నికల విధులకు హాజరవుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు డిసెంబరు 2వ తేదీ వరకు అవకాశం కల్పించాలని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ను ఎస్టీయూటీఎస్, పీఆర్టీయూ తెలంగాణ కోరాయి. -
శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి సోమవారం కుటుంబసభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
1న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు
తిరుమల శ్రీవారిని డిసెంబరు ఒకటో తేదీన తెదేపా అధినేత చంద్రబాబు.. కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రానికే తిరుమల చేరుకోనున్న ఆయన రాత్రి కొండ మీదే బస చేయనున్నట్లు సమాచారం.


తాజా వార్తలు (Latest News)
-
Malla Reddy: మహేశ్బాబు ‘బిజినెస్మేన్’ చూసి ఎంపీ అయ్యా.. మల్లారెడ్డి స్పీచ్కు మహేశ్బాబు నవ్వులే నవ్వులు!
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Pat Cummins: నా చరమాంకంలోనూ ‘కోహ్లీ వికెట్టే’ గుర్తొస్తుంది: కమిన్స్
-
Digital Payments: ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట.. తొలి UPI చెల్లింపునకు 4 గంటల వ్యవధి?
-
Kriti Sanon: అల్లు అర్జున్తో నటించే అవకాశం త్వరగా రావాలనుకుంటున్నా..!
-
కన్నకూతుళ్లను కీచకులకు అప్పగించిన తల్లికి.. 40 ఏళ్ల జైలు శిక్ష..!