సింగరేణిలో ఎన్నికల సైరన్
సింగరేణి కాలరీస్ సంస్థలో ఎన్నికల సైరన్ మోగింది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వచ్చే నెల 28న నిర్వహించేందుకు.. ఎన్నికల అధికారి, కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాసులు బుధవారం షెడ్యూలు విడుదల చేశారు.
వచ్చే నెల 28న గుర్తింపు సంఘం ఎన్నికలు
అదే రోజు ఫలితాల వెల్లడి
షెడ్యూలు విడుదల
ఈనాడు, హైదరాబాద్- కొత్తగూడెం, సింగరేణి, న్యూస్టుడే: సింగరేణి కాలరీస్ సంస్థలో ఎన్నికల సైరన్ మోగింది. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వచ్చే నెల 28న నిర్వహించేందుకు.. ఎన్నికల అధికారి, కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాసులు బుధవారం షెడ్యూలు విడుదల చేశారు. అదే రోజు ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ఈ నెల 30న కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి అందజేస్తారు. వాటిపై వచ్చే నెల 3 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 5న ఓటర్ల తుది జాబితా ప్రదర్శిస్తారు. వచ్చే నెల 6వ తేదీ ఉదయం 10 నుంచి 7వ తేదీ సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 9న ఉ. 10 నుంచి సా.5 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. అర్హులైన అభ్యర్థులకు 10వ తేదీ మధ్యాహ్నం ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. 28న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.
అయినా.. ఎన్నికలు జరిగేనా?: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూలు విడుదలైనా ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్రంలో వచ్చే నెల మొదటి వారంలో శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా ఈ పనిలో తలమునకలై ఉంది. 42 వేలకు పైగా ఓటర్లున్న సింగరేణిలో ఎన్నికలకు భారీ బందోబస్తుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సేవలు అవసరం. ఈ క్రమంలో సంబంధిత కలెక్టర్లు, ఎస్పీలు సింగరేణి ఎన్నికలలో పాల్గొనలేమని ఎన్నికల అధికారికి వెల్లడించారు. మరోవైపు కార్మిక సంఘాల్లో అధికశాతం ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయని తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని సంస్థలోని 13 యూనియన్లు లిఖితపూర్వకంగా ఎన్నికల అధికారి శ్రీనివాసులును కోరాయి. అలానే గెలిచిన సంఘం కాలపరిమితి, గత ఒప్పందాల అమలు తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి. వీటితోపాటు ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో మరో కేసు పెండింగ్లో ఉంది. సింగరేణిలో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత జాతీయస్థాయి రెస్క్యూ పోటీలు వచ్చే నెలలో జరగనున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా 20కి పైగా మైనింగ్ సంస్థల బృందాలు రానున్నాయి. 54వ రక్షణ వారోత్సవాలకు సంస్థ సన్నద్ధం అవుతోంది. వీటిని పరిగణనలోకి తీసుకోకుండా షెడ్యూలు విడుదల చేశారని సంఘాలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. -
వైభవంగా శ్రీవారి పౌర్ణమి గరుడసేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రాత్రి 7 గంటల నుంచి గరుడ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. -
శ్రీశైలంలో వైభవంగా లక్ష దీపోత్సవం
కార్తిక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో లక్ష దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
సిద్ధార్థ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు దంపతులు దిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ మూడో వివాహం
వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి ఎమ్మెల్సీ రెండో భార్య, కుమారుడు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. -
Kachidi Fish: ఒక్క చేప.. రూ.3.9 లక్షలు!
గోల్డెన్ ఫిష్గా పిలిచే అరుదైన కచిడి చేప సోమవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు సముద్రంలో చిక్కింది. దీనిని కొనుగోలు చేయడానికి స్థానిక వ్యాపారులు పోటీపడ్డారు. -
చంద్రబాబు, కొల్లు రవీంద్రలపై కఠిన చర్యలొద్దు
మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చేలా గత ప్రభుత్వ హయాంలో నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబు, ఎక్సైజ్శాఖ అప్పటి మంత్రి కొల్లు రవీంద్రపై తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు కఠిన చర్యలు తీసుకోవద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. -
రైతుబంధు పంపిణీకి అనుమతి నిలిపివేత
నిబంధనలను అతిక్రమించిన నేపథ్యంలో రాష్ట్రంలో రైతు బంధు పథకం నిధుల పంపిణీని తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) పేర్కొంది. -
టన్నెల్లో చిక్కుకున్నవారి కోసం ప్రార్థించండి
ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటనలో చిక్కుకుపోయిన కార్మికులు సురక్షితంగా బయటికి రావాలని దీపం వెలిగించి దేవుణ్ని ప్రార్థించాలని రాష్ట్ర ప్రజలను ప్రధాని మోదీ కోరారు. -
అందరికీ అందని ఓటరు స్లిప్పులు!
మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగనుండగా.. ఇప్పటికీ పోలింగ్ కేంద్రాల వివరాలతో కూడిన ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తికాలేదు. -
24 గంటల్లో.. రూ.14 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల తనిఖీల్లో భాగంగా పోలీసులు గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో రూ.14 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
ఎస్టీయూటీఎస్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా పర్వత్రెడ్డి
రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం (ఎస్టీయూటీఎస్) నూతన రాష్ట్ర వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
డిసెంబరు 2 వరకు పోస్టల్ బ్యాలెట్కు అవకాశమివ్వండి
ఎన్నికల విధులకు హాజరవుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు డిసెంబరు 2వ తేదీ వరకు అవకాశం కల్పించాలని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ను ఎస్టీయూటీఎస్, పీఆర్టీయూ తెలంగాణ కోరాయి. -
శ్రీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి సోమవారం కుటుంబసభ్యులతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
1న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు
తిరుమల శ్రీవారిని డిసెంబరు ఒకటో తేదీన తెదేపా అధినేత చంద్రబాబు.. కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రానికే తిరుమల చేరుకోనున్న ఆయన రాత్రి కొండ మీదే బస చేయనున్నట్లు సమాచారం.


తాజా వార్తలు (Latest News)
-
Atchannaidu: వచ్చేది తెదేపా ప్రభుత్వమే.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం: అచ్చెన్నాయుడు
-
Bobby Deol: బాబీ దేవోల్ చెప్పిన డైలాగ్ ఆ సినిమాలోదేనా! నెట్టింట ఆసక్తికర చర్చ..
-
₹10వేల బడ్జెట్లో శాంసంగ్ కొత్త ఫోన్.. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో!
-
Musk: అప్పటి వరకు ప్రతిరోజూ ఈ ట్యాగ్ ధరిస్తా: ఎలాన్ మస్క్
-
USA: ‘ప్రార్థనా స్థలాల్లో రాజకీయాలొద్దు’.. ఖలిస్థానీల దుశ్చర్యపై ‘సిఖ్స్ ఆఫ్ అమెరికా’ ఖండన
-
Uttarakhand Tunnel: ఏ క్షణమైనా మీ వాళ్లు బయటకు.. కూలీల కుటుంబాలకు సమాచారం