టెట్ పేపర్-2లో 15 శాతమే పాస్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయింది. టెట్ నిర్వహణ మొదలైన 2011 నుంచి పేపర్-2లో అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైంది.
పరీక్ష నిర్వహణ ప్రారంభమయ్యాక ఇదే అత్యల్ప ఉత్తీర్ణత
పేపర్-1లో 36.89 శాతం పాస్
సందేహాలకు తావిస్తున్న ఫలితాల వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోయింది. టెట్ నిర్వహణ మొదలైన 2011 నుంచి పేపర్-2లో అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. ఆ పేపర్లో కేవలం 15.30 శాతం మందే కనీస మార్కులు పొంది అర్హత సాధించారు. పేపర్-1లో గతేడాది కంటే నాలుగు శాతం ఉత్తీర్ణత పెరిగినా అంతకు ముందు జరిగిన ఆరు పరీక్షలతో పోల్చుకుంటే మాత్రం బాగా తగ్గిపోయింది. ఈ నెల 15వ తేదీన టెట్ నిర్వహించగా...ఫలితాలను పాఠశాల విద్యాశాఖ బుధవారం వెల్లడించింది. పేపర్-1లో 82,489 మంది, పేపర్-2లో 29,073 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. పరీక్ష జరిగిన నాడే పేపర్-2 ప్రశ్నపత్రం కఠినంగా ఉందని, పేపర్-1 మాత్రం సులభంగా ఉందని కొందరు అభ్యర్థులు తెలిపారు. ఆ ప్రకారమే ఉత్తీర్ణత శాతం వచ్చింది. గురుకుల ఉపాధ్యాయులు, జూనియర్ అధ్యాపకులు తదితర పరీక్షలకూ అభ్యర్థులు సన్నద్ధమవడంతో టెట్లో ఉత్తీర్ణత తగ్గిందని అధికారులు భావిస్తున్నారు. టెట్లో వచ్చిన మార్కులకు టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ)లో 20 శాతం వెయిటేజీ ఇస్తారు. అందుకోసమే అధిక శాతం అభ్యర్థులు టెట్ పరీక్ష రాస్తున్నారు.
జిల్లాల వారీగా ఇప్పుడెందుకు ప్రకటించలేదు..
ఈ నెల 15న పరీక్ష జరగగా..పేపర్-1కు 2,22,744 మంది, పేపర్-2కు 1,89,963 మంది హాజరైనట్లు అధికారికంగా టెట్ కన్వీనర్ ప్రకటించారు. బుధవారం మాత్రం పేపర్-1కు 2,23,582 మంది, పేపర్-2కు 1,90,047 మంది హాజరైనట్లు వెల్లడించారు. అంటే పేపర్-1కు 838 మంది తగ్గారు. పేపర్-2లో 84 మంది పెరిగినట్లు చూపారు. ఇది ఎందుకు జరిగిందనే విషయాన్ని అధికారులు వెల్లడించకపోవడం సందేహాలకు తావిస్తోంది. ఉదయం 10 గంటలకు ఫలితాలను వెబ్సైట్లో పెట్టిన అధికారులు మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఉత్తీర్ణత శాతం వెల్లడించకపోవడం గమనార్హం. జిల్లాల వారీగా, సామాజిక వర్గాలు, అమ్మాయిల ఉత్తీర్ణత శాతం వివరాలను ఇచ్చేందుకు నిరాకరించారు. పరీక్ష జరిగిన నాడు జిల్లాల వారీగా అభ్యర్థులు, హాజరు శాతాన్ని ప్రకటించిన అధికారులు ఇప్పుడు మాత్రం ససేమిరా అంటుండడంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాంపల్లి నియోజకవర్గంలోని బోయిగూడ కమాన్ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన రజినికి రేవంత్రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. -
Bhimavaram: భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన వియ్యంకుడి ఊరైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సందడి నెలకొంది. -
దారి దాటేలోగా... దారుణమే జరిగింది!
ప్రసవవేదన పడుతున్న నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించే దారి సక్రమంగా లేక... సకాలంలో వైద్యం అందక ఓ పసిబిడ్డ పుట్టీపుట్టగానే కన్నుమూసింది. -
Hyderabad: మాజీ మంత్రి కార్యాలయంలోని ఫర్నిచర్ తరలింపు!
మంత్రుల పేషీల నుంచి చిన్న కాగితం కూడా బయటకు వెళ్లడానికి వీలులేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలిచ్చిన 24 గంటలలోపే రవీంద్రభారతి ప్రాంగణంలో బుధవారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేషీ నుంచి ఫర్నిచర్ తరలిస్తున్న వైనం వెలుగుచూసింది. -
బలహీనపడిన తుపాను
మిగ్జాం తీవ్ర తుపాను తీరం దాటాక.. కోస్తాను కుదిపేసింది. ప్రకాశం జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా వరకు భారీ, అతి భారీ వర్షాలతో ముంచెత్తింది. -
Revanth Reddy: ఆరు గ్యారంటీలతో ఆరంభం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్లోని లాల్బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
Congress: పాక్షిక మంత్రివర్గమేనా?
రేవంత్రెడ్డితో పాటు గురువారం మధ్యాహ్నం మంత్రులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. బుధవారం దిల్లీలో ఏఐసీసీ నాయకులతో సమావేశమైన రేవంత్రెడ్డి.. మంత్రివర్గం గురించి కూడా చర్చించినట్లు సమాచారం. -
4.72 లక్షల ఎకరాల్లో పంట నష్టం
రాష్ట్రంలో మిగ్జాం తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలతో 4.72 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. -
గ్యారంటీలకు ఏటా రూ.70 వేల కోట్లు!
ఎన్నికల హామీగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు ఏటా సుమారు రూ. 70 వేల కోట్లు అవసరమని అంచనా. -
ప్రమాణ స్వీకారానికి రండి..
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని పీసీసీ అధ్యక్షుడు, కాబోయే సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలకు బుధవారం బహిరంగ లేఖ రాశారు. -
ఉత్తమ పనితీరు కళాశాలలకు.. బ్రాంచ్ల ఏర్పాటుకు అనుమతి
ఇక ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలలు సైతం ఆఫ్ క్యాంపస్ విధానంలో మరికొన్ని కళాశాలలను నడుపుకోవచ్చు. -
ఖైదీలపై ఏడాదికి రూ.2,528 కోట్ల ఖర్చు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఖైదీలపై 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,528 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్ర తెలిపారు. -
పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. -
గ్రూప్-1 చిక్కుముడి వీడేదెలా?
రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగ ప్రకటనపై కొత్త ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని...2024 ఫిబ్రవరి 1న తొలి ఉద్యోగ ప్రకటనగా గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొంది. -
అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుస్తోంది
రాష్ట్రంలో నియంతపాలన నుంచి బయట పడ్డామని పేర్కొంటూ సచివాలయ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. -
Revanth Reddy: రేవంత్ ఇంటికి నిరంతర విద్యుత్తు
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా గురువారం రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆయన ఇల్లు, కార్యాలయం, ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో విద్యుత్తు సరఫరా తదితర అంశాలపై విద్యుత్తుశాఖ సమీక్షించింది. -
కొత్త ప్రభుత్వానికి అండగా ఉంటాం
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాష్ట్ర ఉద్యోగుల సంఘం అభినందనలు తెలపింది. -
ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్లో ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్ష ఫలితాలను పోలీసు నియామక మండలి ఎట్టకేలకు విడుదల చేసింది. -
ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తకు ఐజీయూ పురస్కారం
జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ లబానీ రే ను ప్రతిష్ఠాత్మక ఇండియన్ జియోఫిజికల్ యూనిట్(ఐజీయూ)-అన్ని తల్వానీ స్మారక పురస్కారం వరించింది. -
వివేకా హత్య కేసులో అభియోగాల నమోదుపై 20న విచారణ
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులపై అభియోగాల నమోదు నిమిత్తం సీబీఐ కోర్టు.. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
జనవరిలో రాష్ట్రానికి ఈసీ బృందం
లోక్సభ ఎన్నికల ఏర్పాట్ల వ్యూహరచన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం వచ్చే జనవరి మొదటి వారంలో రాష్ట్రానికి రానుంది.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. కాసేపట్లో నగరానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
-
రేషన్కార్డుల జారీపై ఆశలు.. మళ్లీ దరఖాస్తు చేస్తున్న పేదలు
-
Bhimavaram: భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు