చట్టవిరుద్ధమైన అరెస్ట్ చెల్లదు
ఏదైన కేసులో నిందితులను అరెస్ట్ చేసే ముందు చట్టపర నిబంధనలను అమలు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బుధవారం హైకోర్టు స్పష్టంచేసింది.
ఎన్ఐఏ తీరును తప్పుబట్టిన హైకోర్టు
ఈనాడు, హైదరాబాద్: ఏదైన కేసులో నిందితులను అరెస్ట్ చేసే ముందు చట్టపర నిబంధనలను అమలు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బుధవారం హైకోర్టు స్పష్టంచేసింది. అక్రమంగా అరెస్ట్ చేసిన దుబాసి దేవేందర్ను విడుదల చేయాలంటూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ జిల్లా జైలు సూపరింటెండెంట్, ఎన్ఐఏ అధికారులను హైకోర్టు ఆదేశించింది. సిద్దిపేట ప్రభుత్వ కళాశాలలో పరీక్షలకు హాజరవుతున్న తన భర్త దేవేందర్ను ఎన్ఐఏ అధికారులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారంటూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పసుమాములకు చెందిన స్వప్న హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ కె.సుజనల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పిటిషనర్ భర్తను సివిల్ డ్రస్లో ఉన్న వ్యక్తులు తీసుకెళ్లి ములుగు స్టేషన్లో నిర్బంధించారన్నారు. అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ తీసుకెళ్లారని, ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందన్నారు. ఎన్ఐఏ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ దేవేందర్పై బస్తర్ జిల్లాలో 2019లో నమోదైన కేసులో 41ఎ కింద నోటీసులు జారీ చేసి చట్టబద్ధంగా కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి, ఇతర సంస్థలకు కొరియర్గా పనిచేశారన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచామని, జగదల్పూర్ జైలులో రిమాండ్పై ఉన్నారన్నారు. వాదనలను విన్న ధర్మాసనం ఎన్ఐఏ జారీ చేసిన 41ఎ నోటీసు జారీలో ఉన్న లోపాలను ఎత్తి చూపింది. నోటీసులో విజయవాడ ఎన్ఐఏ క్యాంపు ఆఫీసు చిరునామా చూపారని, పిటిషనర్ భర్తను సిద్దిపేటలో నిర్బంధంలోకి తీసుకున్నట్లు ఆధారాలున్నాయని పేర్కొంది.అరెస్ట్లో చట్ట ఉల్లంఘనలు ఉన్నందున పిటిషనర్ భర్తను విడుదల చేయాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిరా చుక్క.. తీర్పు రాసే వేళ..
పార్టీల పోటాపోటీ ప్రచారాలు.. హామీలు.. నేతల విమర్శలు ప్రతివిమర్శలు.. వార్రూమ్లలో ఎత్తులు పైఎత్తులు.. అన్నీ చూసి... చెప్పినవి విని... ఆకళింపు చేసుకున్న తెలంగాణ ఓటరు వచ్చే అయిదేళ్లకు తమ ప్రతినిధులను ఎన్నుకునే ఘడియలు వచ్చేశాయి. -
7 గంటల నుంచి పోలింగ్
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుంది. సిబ్బంది బుధవారం సాయంత్రానికి ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. -
ఓటు బాటలో పోటెత్తారు
సొంతూరిలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి ఓటర్లు బుధవారం పెద్దఎత్తున తరలివెళ్లారు. నగరంలో చదువుకుంటున్న విద్యార్థులు.. ఉద్యోగాలు చేస్తున్న యువత.. ఉపాధి నిమిత్తం ఇక్కడ స్థిరపడినవారు స్వగ్రామాలకు వెళ్లేందుకు రావడంతో.. జూబ్లీ బస్స్టేషన్(జేబీఎస్), మహాత్మా గాంధీ బస్స్టేషన్(ఎంజీబీఎస్)లతో పాటు రైల్వే స్టేషన్లూ కిక్కిరిశాయి. -
కృత్రిమ మేధతో సమస్యలకు చెక్!
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు కృత్రిమ మేధ శ్రేష్ఠతర కేంద్రాల(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్)ను నెలకొల్పేందుకు సమాయత్తమైంది. -
విదేశాల్లో దీక్షా దివస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని భారాస ప్రవాస విభాగాల ఆధ్వర్యంలో బుధవారం 52 దేశాల్లో దీక్షా దివస్ నిర్వహించారు. -
ఓటేసేందుకు వీరు.. ఓటేయించేందుకు వారు
రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటున్నవారు, విద్యార్థులు తమ సొంతూళ్లలో ఓటేసేందుకు బస్సుల్లో ప్రయాణమయ్యారు. -
ఓట్ల వేటపై కాసుల ఆట
-
తెలంగాణలో ఓటర్లుగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు
తెలంగాణలో గురువారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఓటర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. -
అకాల వర్షానికి దెబ్బతిన్న పత్తి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పలు ప్రాంతాల్లో పంటలు, ఆస్తులు దెబ్బతిన్నాయి. భారీ వడగళ్లు పడటంతో నిజామాబాద్ గ్రామీణ, కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలో పత్తి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. -
ఆర్జీయూకేటీకి గ్రీన్ యూనివర్సిటీ పురస్కారం
బాసరలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ప్రతిష్ఠాత్మక ‘గ్రీన్ యూనివర్సిటీ అవార్డు-2023’కి ఎంపికైంది. -
పాస్పోర్టు దరఖాస్తుల విచారణ విధానంలో మార్పు
పాస్పోర్టు పెండింగ్ దరఖాస్తుల విచారణ అపాయింట్మెంట్లను 250కి పెంచుతున్నట్లు ప్రాంతీయ పాస్పోర్టు అధికారిణి (ఆర్పీవో) స్నేహజ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
సినీనటి జయప్రదకు సుప్రీంకోర్టులో ఉపశమనం
సినిమా థియేటర్ కార్మికుల వేతనాల నుంచి మినహాయించుకున్న ఈఎస్ఐ విరాళాన్ని ఆ సంస్థకు జమ చేయలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి, మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. -
హైదరాబాద్లో డీసీపీ, ఏసీపీ సస్పెన్షన్
ఎన్నికల్లో డబ్బు తరలింపు విషయంలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం రచ్చకెక్కింది. ఈ వ్యవహారంలో నలుగురు సస్పెన్షన్కు గురి కాగా.. మరొకరిని సర్వీసు నుంచి తొలగించారు. -
ఇదీ సంగతి!