ఉత్తమ పర్యాటక గ్రామాలకు అవార్డుల ప్రదానం
పర్యాటక దినోత్సవం సందర్బంగా సిద్ద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామ ప్రతినిధులకు బుధవారం దిల్లీలో అవార్డు అందజేశారు.
దిల్లీలో పురస్కారాలు అందుకున్న చంద్లాపూర్, పెంబర్తి గ్రామాల సర్పంచులు
చిన్నకోడూరు, జనగామ రూరల్, న్యూస్టుడేే: పర్యాటక దినోత్సవం సందర్బంగా సిద్ద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామ ప్రతినిధులకు బుధవారం దిల్లీలో అవార్డు అందజేశారు. చంద్లాపూర్ జాతీయ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైన విషయం తెలిసిందే. కేంద్ర పర్యాటక శాఖ నేతృత్వంలో ఈ పురస్కారాన్ని గ్రామ సర్పంచి చంద్రకళ, అదనపు పాలనాధికారి శ్రీనివాస్రెడ్డికి అందజేశారు. సస్యశ్యామలమైన గ్రామానికి అవార్డు దక్కడం ఓ చరిత్ర అని మంత్రి హరీశ్రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామస్థులకు శుభకాంక్షలు తెలిపారు. దిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో భారాస నాయకుడు సూరగోని రవి పాల్గొన్నారు.
- జాతీయ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైన జనగామ మండలం పెంబర్తి గ్రామ సర్పంచి అంబాల ఆంజనేయులుగౌడ్ బుధవారం దిల్లీలో పురస్కారం అందుకున్నారు. ఇప్పటికే పెంబర్తి హస్తకళలతో ప్రపంచస్థాయి గుర్తింపు పొందగా తాజాగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శులు విద్యావతి, శైలజా రామయ్యర్ సర్పంచికి అవార్డు అందజేశారు.
- తెలంగాణ ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, జాతీయస్థాయిలో పోటీపడి రెండు పురస్కారాలు సాధించడమే ఇందుకు నిదర్శనమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పెంబర్తి, చంద్లాపూర్ గ్రామాలకు ‘జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలు’గా అవార్డులు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. -
JEE Main: జేఈఈ మెయిన్ దరఖాస్తుకు గడువు రేపే
2024 జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే జేఈఈ మెయిన్ తొలి విడత ఆన్లైన్ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈ నెల 30వ తేదీ రాత్రి 9 గంటలకు ముగియనుంది. -
Chandrababu: సభలు, సమావేశాల్లో పాల్గొనొచ్చు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈనెల 20న ఇచ్చిన పూర్తిస్థాయి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు డిసెంబరు 8కి వాయిదా వేసింది. -
Margadarsi Chit Fund Case: లుక్ఔట్ సర్క్యులర్ కోర్టు ధిక్కరణ కాదా?
ఎలాంటి కఠిన చర్యలూ చేపట్టరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా.. మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా లుక్ఔట్ సర్క్యులర్(ఎల్ఓసీ)ను ఎలా జారీ చేశారని ఏపీ సీఐడీని తెలంగాణ హైకోర్టు నిలదీసింది. -
Vizag: సాగర సర్పం.. కాటేస్తే కష్టం
విశాఖ నగర పరిధి సాగర్నగర్ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు మంగళవారం ఓ విషపూరిత పాము చిక్కింది. -
ఇదీసంగతి!
-
ఇందూరులో వడగళ్ల బీభత్సం
నిజామాబాద్ జిల్లాలో మంగళవారం వడగళ్లు బీభత్సం సృష్టించాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో గాలివాన పడింది. -
ప్రలోభాల అడ్డుకట్టకు మరింత నిఘా
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపించడంతో నిఘాను మరింత విస్తృతం చేశామని, గురువారం పోలింగ్ ముగిసేంత వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ వెల్లడించారు. -
దీక్షాదివస్ స్ఫూర్తిగా... రాష్ట్రంకోసం పునరంకితం
తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం దీక్షా దివస్ స్ఫూర్తిగా పునరంకింతమవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివస్ అని, నాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని పేర్కొన్నారు. -
ఆర్మీ క్విజ్ ఫైనల్స్కు తేజ విద్యాలయ విద్యార్థులు
భారత సైనిక దళం ఆధ్వర్యంలో మంగళవారం చెన్నైలోని ఆఫీసర్స్ శిక్షణ అకాడమీ ఆడిటోరియంలో ఆర్మీ క్విజ్ సౌతిండియా సెమీ ఫైనల్స్ నిర్వహించారు. -
స్మితా సభర్వాల్కు నీటిపారుదల శాఖ బాధ్యతలు
నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ కార్యదర్శిగా సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ను పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్ఏసీ) ప్రభుత్వం నియమించింది. -
నేడు, రేపు సర్కారు బడులకు ఎన్నికల సెలవులు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బుధ, గురువారాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న పలువురు కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో డీఈఓలు ఎస్ఎంఎస్ల ద్వారా ఆదేశాలిచ్చారు. -
అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: గవర్నర్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళిసై కోరారు. -
‘మేడిగడ్డ’పై నిపుణుల కమిటీ!
కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు నేపథ్యంలో సమగ్ర అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.


తాజా వార్తలు (Latest News)
-
Uttarakhand Tunnel: తొలుత భయపడ్డాం.. కానీ, నమ్మకాన్ని వీడలేదు: మోదీతో కార్మికుల సంభాషణ
-
December deadline: ఆధార్ అప్డేట్.. బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్.. డిసెంబర్ డెడ్లైన్స్ ఇవే!
-
Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,000 చేరువలో నిఫ్టీ
-
Top Ten News @ Election Special: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు
-
CM Jagan: పిల్లల కళ్లజోళ్ల మీదా ఆయన బొమ్మే