యాసంగి సాగుకు ఇప్పటి నుంచే సన్నద్ధత
యాసంగి పంటల సాగుకోసం ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులకు సూచించారు. యాసంగిలో సుమారు 75-80 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని, అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు.
విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తేవాలి
వానాకాలం సీజన్లో రికార్డుస్థాయిలో వరి
యాసంగికి పెరిగే అవకాశం
సమీక్షలో మంత్రి నిరంజన్రెడ్డి
ఈనాడు,హైదరాబాద్: యాసంగి పంటల సాగుకోసం ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అధికారులకు సూచించారు. యాసంగిలో సుమారు 75-80 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని, అవసరమైన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. వానాకాలం సీజన్లో ఇప్పటివరకు కోటి 26 లక్షల ఎకరాల్లో పంటలను వేయగా.. అత్యధికంగా 65 లక్షల ఎకరాల్లో వరి సాగయిందని, రాష్ట్ర చరిత్రలోనే ఇది రికార్డని మంత్రి పేర్కొన్నారు. మరో 12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేశారన్నారు. వానాకాలం పంటల పరిస్థితి, రబీ సాగుకు సన్నద్ధత, రుణమాఫీ అమలు, ఆయిల్పామ్ సాగుపై బుధవారం సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ‘‘వానాకాలం సీజన్ వరి అంచనాకు మించి సాగయింది. నాగర్కర్నూల్ జిల్లాలోనే గతంలోకన్నా 24వేల ఎకరాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. సిద్దిపేట, సంగారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మహబూబ్నగర్, వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో గతంలోకన్నా పెరిగింది. గత యాసంగిలో 74 లక్షల ఎకరాల్లో సాగయింది. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉంది. రబీ కోసం 9.8 లక్షల టన్నుల యూరియా అవసరమని కేంద్రానికి నివేదిస్తే 9.2 లక్షల టన్నులే కేటాయించారు’’ అని మంత్రి పేర్కొన్నారు.
కొనసాగుతున్న రుణమాఫీ...
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ పూర్తిచేస్తామని నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఇప్పటివరకు 21,34,949 రైతులకు రూ.11,812.14 కోట్లు మాఫీ అయ్యాయి. అర్హుల రుణాలన్నీ మాఫీ చేస్తాం. రుణమాఫీ సందేహాల నివృత్తికి రాష్ట్రస్థాయిలో 040 23243667 నంబరులో సంప్రదించాలి. పెండింగ్లో ఉన్న రైతుబీమా క్లెయిములన్నీ వేగంగా పరిష్కరిస్తాం’’ అని నిరంజన్రెడ్డి తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. -
జేఈఈ మెయిన్ దరఖాస్తుకు గడువు రేపే
2024 జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే జేఈఈ మెయిన్ తొలి విడత ఆన్లైన్ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈ నెల 30వ తేదీ రాత్రి 9 గంటలకు ముగియనుంది. -
Chandrababu: సభలు, సమావేశాల్లో పాల్గొనొచ్చు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈనెల 20న ఇచ్చిన పూర్తిస్థాయి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు డిసెంబరు 8కి వాయిదా వేసింది. -
లుక్ఔట్ సర్క్యులర్ కోర్టు ధిక్కరణ కాదా?
ఎలాంటి కఠిన చర్యలూ చేపట్టరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా.. మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా లుక్ఔట్ సర్క్యులర్(ఎల్ఓసీ)ను ఎలా జారీ చేశారని ఏపీ సీఐడీని తెలంగాణ హైకోర్టు నిలదీసింది. -
Vizag: సాగర సర్పం.. కాటేస్తే కష్టం
విశాఖ నగర పరిధి సాగర్నగర్ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు మంగళవారం ఓ విషపూరిత పాము చిక్కింది. -
ఇదీసంగతి!
-
ఇందూరులో వడగళ్ల బీభత్సం
నిజామాబాద్ జిల్లాలో మంగళవారం వడగళ్లు బీభత్సం సృష్టించాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో గాలివాన పడింది. -
ప్రలోభాల అడ్డుకట్టకు మరింత నిఘా
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపించడంతో నిఘాను మరింత విస్తృతం చేశామని, గురువారం పోలింగ్ ముగిసేంత వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ వెల్లడించారు. -
దీక్షాదివస్ స్ఫూర్తిగా... రాష్ట్రంకోసం పునరంకితం
తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం దీక్షా దివస్ స్ఫూర్తిగా పునరంకింతమవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివస్ అని, నాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని పేర్కొన్నారు. -
ఆర్మీ క్విజ్ ఫైనల్స్కు తేజ విద్యాలయ విద్యార్థులు
భారత సైనిక దళం ఆధ్వర్యంలో మంగళవారం చెన్నైలోని ఆఫీసర్స్ శిక్షణ అకాడమీ ఆడిటోరియంలో ఆర్మీ క్విజ్ సౌతిండియా సెమీ ఫైనల్స్ నిర్వహించారు. -
స్మితా సభర్వాల్కు నీటిపారుదల శాఖ బాధ్యతలు
నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ కార్యదర్శిగా సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ను పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్ఏసీ) ప్రభుత్వం నియమించింది. -
నేడు, రేపు సర్కారు బడులకు ఎన్నికల సెలవులు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బుధ, గురువారాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న పలువురు కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో డీఈఓలు ఎస్ఎంఎస్ల ద్వారా ఆదేశాలిచ్చారు. -
అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: గవర్నర్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళిసై కోరారు. -
‘మేడిగడ్డ’పై నిపుణుల కమిటీ!
కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు నేపథ్యంలో సమగ్ర అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.


తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ దరఖాస్తుకు గడువు రేపే
-
మీ హయాంలో అభివృద్ధి ఏది?.. కావలి ఎమ్మెల్యేను నిలదీసిన వైకాపా అభిమాని
-
క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి: వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యలు
-
IND Vs AUS: మ్యాచ్లో ఓ మలుపు.. ఇషాన్ కిషన్ తప్పిదమే ఆసీస్కు కలిసొచ్చింది!
-
East Godavari: ఇంటి వద్దే తుపాకీతో కాల్చి లేఖరి దారుణ హత్య..
-
నీవెందుకు నేనే చనిపోతా.. ప్రియురాలికి సందేశం పెట్టి యువకుడి ఆత్మహత్య