కేసీఆర్.. సింగరేణి పక్షపాతి
సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థ పక్షపాతి అని, సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.
భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఈనాడు,హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థ పక్షపాతి అని, సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించి నిర్వీర్యం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను ఆయన తిప్పికొట్టి సంస్థకు, కార్మికులకు అండగా నిలుస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు లాభాల్లో 32 శాతం వాటా ఇవ్వాలని సింగరేణి సంస్థ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య ఇతర నేతలు బుధవారం కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సింగరేణి కార్మికులను సీఎం కేసీఆర్ ఎప్పడూ మరచిపోబోరని అన్నారు. కార్మికులకు అత్యధిక బోనస్ ప్రకటించిన ఎకైక రాష్ట్రం తెలంగాణ అని, 2014లో 18 శాతం బోనస్ ఉండగా.... 2022 నాటికి 30 శాతానికి పెంచామని, ఈ సారి 32 శాతానికి పెరగడం చరిత్రాత్మకమన్నారు.
భారాస ప్రవాస విభాగాల సమన్వయకర్త మహేశ్ బిగాల, ఇతర నేతలు మహేష్ తన్నీరు, చందు తల్లా, హరీశ్రెడ్డి, సురేశ్లు బుధవారం కవితను ఆమె నివాసంలో కలిసి మహిళా బిల్లు సాధనకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళా బిల్లులో ఓబీసీ మహిళల వాటా కోసం ఆమె కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సిరా చుక్క.. తీర్పు రాసే వేళ..
పార్టీల పోటాపోటీ ప్రచారాలు.. హామీలు.. నేతల విమర్శలు ప్రతివిమర్శలు.. వార్రూమ్లలో ఎత్తులు పైఎత్తులు.. అన్నీ చూసి... చెప్పినవి విని... ఆకళింపు చేసుకున్న తెలంగాణ ఓటరు వచ్చే అయిదేళ్లకు తమ ప్రతినిధులను ఎన్నుకునే ఘడియలు వచ్చేశాయి. -
7 గంటల నుంచి పోలింగ్
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కానుంది. సిబ్బంది బుధవారం సాయంత్రానికి ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. -
ఓటు బాటలో పోటెత్తారు
సొంతూరిలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి ఓటర్లు బుధవారం పెద్దఎత్తున తరలివెళ్లారు. నగరంలో చదువుకుంటున్న విద్యార్థులు.. ఉద్యోగాలు చేస్తున్న యువత.. ఉపాధి నిమిత్తం ఇక్కడ స్థిరపడినవారు స్వగ్రామాలకు వెళ్లేందుకు రావడంతో.. జూబ్లీ బస్స్టేషన్(జేబీఎస్), మహాత్మా గాంధీ బస్స్టేషన్(ఎంజీబీఎస్)లతో పాటు రైల్వే స్టేషన్లూ కిక్కిరిశాయి. -
కృత్రిమ మేధతో సమస్యలకు చెక్!
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు కృత్రిమ మేధ శ్రేష్ఠతర కేంద్రాల(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్)ను నెలకొల్పేందుకు సమాయత్తమైంది. -
విదేశాల్లో దీక్షా దివస్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబరు 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజును పురస్కరించుకొని భారాస ప్రవాస విభాగాల ఆధ్వర్యంలో బుధవారం 52 దేశాల్లో దీక్షా దివస్ నిర్వహించారు. -
ఓటేసేందుకు వీరు.. ఓటేయించేందుకు వారు
రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటున్నవారు, విద్యార్థులు తమ సొంతూళ్లలో ఓటేసేందుకు బస్సుల్లో ప్రయాణమయ్యారు. -
ఓట్ల వేటపై కాసుల ఆట
-
తెలంగాణలో ఓటర్లుగా ఉన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు
తెలంగాణలో గురువారం జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఓటర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ఉత్తర్వులిచ్చింది. -
అకాల వర్షానికి దెబ్బతిన్న పత్తి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పలు ప్రాంతాల్లో పంటలు, ఆస్తులు దెబ్బతిన్నాయి. భారీ వడగళ్లు పడటంతో నిజామాబాద్ గ్రామీణ, కామారెడ్డి నియోజకవర్గాల పరిధిలో పత్తి పంటకు తీవ్రనష్టం వాటిల్లింది. -
ఆర్జీయూకేటీకి గ్రీన్ యూనివర్సిటీ పురస్కారం
బాసరలోని రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ప్రతిష్ఠాత్మక ‘గ్రీన్ యూనివర్సిటీ అవార్డు-2023’కి ఎంపికైంది. -
పాస్పోర్టు దరఖాస్తుల విచారణ విధానంలో మార్పు
పాస్పోర్టు పెండింగ్ దరఖాస్తుల విచారణ అపాయింట్మెంట్లను 250కి పెంచుతున్నట్లు ప్రాంతీయ పాస్పోర్టు అధికారిణి (ఆర్పీవో) స్నేహజ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
సినీనటి జయప్రదకు సుప్రీంకోర్టులో ఉపశమనం
సినిమా థియేటర్ కార్మికుల వేతనాల నుంచి మినహాయించుకున్న ఈఎస్ఐ విరాళాన్ని ఆ సంస్థకు జమ చేయలేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి, మాజీ ఎంపీ జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. -
హైదరాబాద్లో డీసీపీ, ఏసీపీ సస్పెన్షన్
ఎన్నికల్లో డబ్బు తరలింపు విషయంలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం రచ్చకెక్కింది. ఈ వ్యవహారంలో నలుగురు సస్పెన్షన్కు గురి కాగా.. మరొకరిని సర్వీసు నుంచి తొలగించారు. -
ఇదీ సంగతి!