ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబరు 1న రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎ.శాంతికుమారి ఉన్నతాధికారును ఆదేశించారు.
ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష
ఈనాడు, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్టోబరు 1న రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎ.శాంతికుమారి ఉన్నతాధికారును ఆదేశించారు. ప్రధాని రాష్ట్ర పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ బుధవారం హైదరాబాద్ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రధాని అక్టోబరు 1న ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారిని జాతికి అంకితం చేస్తారని, వరంగల్-ఖమ్మం, ఖమ్మం-విజయవాడ రహదారికి శంకుస్థాపన చేస్తారని, ఈ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. డీజీపీ అంజనీకుమార్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్శర్మ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, రహదారులు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వినాయక నిమజ్జనానికి పటిష్ఠ ఏర్పాట్లు: సీఎం కేసీఆర్
వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్తోపాటు పలు ప్రధాన నిమజ్జన కేంద్రాల వద్ద రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ ఏర్పాట్లు చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. భక్తులు తగు జాగ్రత్తలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమంలో ఆనందోత్సాహాలతో పాల్గొని ఇంటికి క్షేమంగా చేరుకోవాలని సూచించారు. వినాయక నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ ఒకేరోజు రావడం అరుదు అని, ప్రజలు అధ్యాత్మిక వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. -
JEE Main: జేఈఈ మెయిన్ దరఖాస్తుకు గడువు రేపే
2024 జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే జేఈఈ మెయిన్ తొలి విడత ఆన్లైన్ పరీక్షలకు దరఖాస్తు గడువు ఈ నెల 30వ తేదీ రాత్రి 9 గంటలకు ముగియనుంది. -
Chandrababu: సభలు, సమావేశాల్లో పాల్గొనొచ్చు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈనెల 20న ఇచ్చిన పూర్తిస్థాయి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు డిసెంబరు 8కి వాయిదా వేసింది. -
Margadarsi Chit Fund Case: లుక్ఔట్ సర్క్యులర్ కోర్టు ధిక్కరణ కాదా?
ఎలాంటి కఠిన చర్యలూ చేపట్టరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా.. మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా లుక్ఔట్ సర్క్యులర్(ఎల్ఓసీ)ను ఎలా జారీ చేశారని ఏపీ సీఐడీని తెలంగాణ హైకోర్టు నిలదీసింది. -
Vizag: సాగర సర్పం.. కాటేస్తే కష్టం
విశాఖ నగర పరిధి సాగర్నగర్ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు మంగళవారం ఓ విషపూరిత పాము చిక్కింది. -
ఇదీసంగతి!
-
ఇందూరులో వడగళ్ల బీభత్సం
నిజామాబాద్ జిల్లాలో మంగళవారం వడగళ్లు బీభత్సం సృష్టించాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో గాలివాన పడింది. -
ప్రలోభాల అడ్డుకట్టకు మరింత నిఘా
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపించడంతో నిఘాను మరింత విస్తృతం చేశామని, గురువారం పోలింగ్ ముగిసేంత వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ వెల్లడించారు. -
దీక్షాదివస్ స్ఫూర్తిగా... రాష్ట్రంకోసం పునరంకితం
తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం దీక్షా దివస్ స్ఫూర్తిగా పునరంకింతమవ్వాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివస్ అని, నాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని పేర్కొన్నారు. -
ఆర్మీ క్విజ్ ఫైనల్స్కు తేజ విద్యాలయ విద్యార్థులు
భారత సైనిక దళం ఆధ్వర్యంలో మంగళవారం చెన్నైలోని ఆఫీసర్స్ శిక్షణ అకాడమీ ఆడిటోరియంలో ఆర్మీ క్విజ్ సౌతిండియా సెమీ ఫైనల్స్ నిర్వహించారు. -
స్మితా సభర్వాల్కు నీటిపారుదల శాఖ బాధ్యతలు
నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ కార్యదర్శిగా సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ను పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్ఏసీ) ప్రభుత్వం నియమించింది. -
నేడు, రేపు సర్కారు బడులకు ఎన్నికల సెలవులు
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బుధ, గురువారాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న పలువురు కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని జిల్లాల్లో డీఈఓలు ఎస్ఎంఎస్ల ద్వారా ఆదేశాలిచ్చారు. -
అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి: గవర్నర్
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ తమిళిసై కోరారు. -
‘మేడిగడ్డ’పై నిపుణుల కమిటీ!
కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు నేపథ్యంలో సమగ్ర అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.


తాజా వార్తలు (Latest News)
-
TS Elections: మంత్రి కేటీఆర్పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
-
Gautam adani: అదానీ షేర్లు జూమ్.. కుబేరుల జాబితాలో టాప్-20లోకి అదానీ
-
Animal: ‘యానిమల్’ కోసం రణ్బీర్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే వావ్ అనాల్సిందే!
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Israel-Hamas: 16 రోజులు చీకటి గదిలో బంధించి.. బాలుడిని హింసించిన హమాస్
-
Btech Ravi: తెదేపా నేత బీటెక్ రవికి బెయిల్ మంజూరు